Noida Twin Tower Demolition: 9 సెకన్లలో కూలనున్న టవర్స్.. ఈ రోజు మధ్యాహ్నం 2.30కి ముహూర్తం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Noida Twin Tower Demolition: నోయిడా ట్విన్ టవర్స్ పేకమేడలా కూల్చివేతకు సమయం ఆసన్నమైంది. ఈ రోజు మధ్యాహ్నం 2.30 నుంచి కూల్చివేత ప్రక్రియ ప్రారంభమై దాదాపుగా 15 నిమిషాల వ్యవధిలోనే కూల్చివేత ప్రక్రియ పూర్తవుతుంది. నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన నోయిడాలోని సెక్టార్ 93ఏలో ఉన్న ట్విన్ టవర్స్ ను కూల్చివేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఆగస్టు 28న కూల్చివేయాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఈ ట్విన్ టవర్స్ కూల్చివేసేందుకు సెక్టార్ 93ఏ లోని ప్రజలను ఆ ప్రాంతం నుంచి ఖాళీ చేయించారు. వాహనాలు, పెంపుడు జంతువులను ఇతర ప్రాంతాలకు తరలించారు. నోయిడా ట్విన్ టవర్స్ లో అపెక్స్ టవర్ లో 32 ఫోర్లు ఉండగా.. సెయాన్ టవర్ లో 29 ఫ్లోర్లు ఉన్నాయి.
103 మీటర్ల ఎత్తున్న ఈ జంట టవర్ల కూల్చివేత కోెసం మొత్తం 3700 కిలోల పేలుడు పదార్థాలు ఉపయోగించనున్నారు. పిల్లర్లకు 7000 రంధ్రాలను చేసి పేలుడు పదార్థాలను ఏర్పాటు చేశారు. వీటన్నింటిని వైర్ల ద్వారా కనెక్ట్ చేశారు. దాదాపుగా 20,000 సర్క్యూట్ లను ఏర్పాటు చేశారు. కేవలం 9 సెకన్లలోనే 32 అంతస్తులు కుప్పకూలనున్నాయి. పేలుడు వల్ల వచ్చే దుమ్ము 12 నిమిషాల వరకు ఉంటుంది. గాలి వేగం వల్ల కొంత సమయం మారే అవకాశం ఉంది. పేలుడు పర్యవేక్షించే నిపుణులు టవర్స్ నుంచి 100 మీటర్ల దూరంలో ఉంటారు. పేలుడు సమయంలో ఆ ప్రాంతాన్ని నో ఫ్లైయింగ్ జోన్ గా ప్రకటించారు అధికారులు. పేలుడు వల్ల 55,000 టన్నుల శిథిలాలు ఏర్పడుతాయి. వీటిని 3000 ట్రక్కుల ద్వారా మూడు నెలల పాటు తరలించనున్నారు.
Also Read
- Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
- UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
- UP: ఏం త్యాగం.. ఐదుగురు పిల్లల తల్లిని ప్రియుడికిచ్చి పెళ్లి చేసిన భర్త.. ఏం జరిగిందంటే..!
- Rahul Gandhi vs BJP: విద్యార్థులతో రాజకీయాలెందుకు? రాహుల్గాంధీని ప్రశ్నించిన బీజేపీ
Read Also: Asia Cup 2022: తొలి మ్యాచ్లో శ్రీలంక చిత్తు.. ఆఫ్ఘనిస్తాన్ ఘనవిజయం
పేలుడు సమయంలో వచ్చే ప్రకంపనలు దాదాపుగా 30 సెకన్లు ఉంటాయి. ఈ ప్రకంపనలు రిక్టర్ స్కేల్ పై 0.4గా ఉండే భూకంపానికి సమానం. నోయిడా ప్రాంతంలో ఉండే భవనాలు రిక్టర్ స్కేల్ పై 6.0 తీవ్రతతో వచ్చే భూకంపాలను కూడా తట్టుకోగలవు. సాయంత్రం 5.30 తరువాత ఆ ప్రాంతంలో నివాసం ఉంటున్న వారిని అధికారులు తిరిగి అనుమతిస్తారు. ఇప్పటికే ఈ టవర్స్ లో ఉన్న పలు ఫ్లాట్లు అమ్ముడయ్యాయి. వీరందరికి వడ్డీతో సహా తిరిగి చెల్లించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. గతంలో ఇండియాలో 68 మీటర్ల ఎత్తు ఉన్న భవనం కూల్చివేయడమే రికార్డుగా ఉండేది. అయితే ప్రస్తుతం దీన్ని 103 మీటర్ల నోయిడా ట్విన్ టవర్స్ బ్రేక్ చేస్తోంది. ఇప్పటి వరకు అబుదాబిలో 168 మీటర్ల భవనాన్ని నేలమట్టం చేయడం రికార్డుగా ఉంది.
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!