Ladakh: లడఖ్లో ఒంటరిగా బైక్ రైడ్.. ఆక్సిజన్ అందక యువకుడి మృతి
- లడఖ్లో ఒంటరిగా బైక్ రైడ్
- ఆక్సిజన్ అందక యువకుడి మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
లడఖ్లో విషాదం చోటుచేసుకుంది. ఉత్తరప్రదేశ్కు చెందిన యువకుడు బైక్ రైడింగ్కి వెళ్లి ప్రాణాలు పోగొట్టుకున్నాడు. దీంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
నోయిడాకు చెందిన చిన్మయ్ శర్మ(27) లడఖ్లోని లేహ్కు ఒంటరిగా బైక్ రైడింగ్కు వెళ్లాడు. ఆక్సిజన్ అందక ఆల్టిట్యూడ్ సిక్నెస్తో ప్రాణాలు వదిలాడు. చిరాగ్ ఆగస్టు 22న విహార యాత్రకు బయలుదేరి వెళ్లాడు. నాలుగు రోజుల తర్వాత ఆగస్టు 26న తనకు తలనొప్పిగా ఉందని తన తండ్రికి తెలియజేసినట్లు సమాచారం. విశ్రాంతి తీసుకోవాలని, వైద్య సహాయం తీసుకోవాలని తండ్రి సూచించారు. మరుసటి రోజు చిన్మయ్ శర్మ శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిని ఎదుర్కొంటున్నట్లు తన తండ్రికి చెప్పాడు. అనంతరం తండ్రి లేహ్లోని హోటల్ మేనేజర్ని తన కొడుకును ఆసుపత్రికి తీసుకెళ్లమని కోరాడు. ఆగష్టు 29న చిరాగ్ శర్మ చికిత్స తీసుకుంటూ ప్రాణాలు వదిలాడు. అతని తల్లిదండ్రులు లేహ్ చేరుకోవడానికి కొన్ని గంటల ముందే మరణించాడు. దీంతో వారు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఇదిలా ఉంటే చిన్మయ్ శర్మ.. తల్లిదండ్రులకు ఏకైక సంతానం కావడం విశేషం. ఒక్కగానొక్క కొడుకు చనిపోవడంతో తీవ్ర ఆవేదన చెందారు.
Also Read
- India Iran Travel Advisory: ఇరాన్కు అనవసర ప్రయాణాలు వద్దు.. పౌరులకు హెచ్చరిక జారీ చేసిన భారత రాయబార కార్యాలయం
- Ketan Agarwal Murder Case: అప్పుడు ‘సోనమ్’.. ఇప్పుడు ‘సియా’.. పెళ్లి అంటేనే భయపడుతున్న అబ్బాయిలు..
- Delhi: తెల్లవారుజామున కలకలం.. కార్మికుల గుడిసెల్లో భారీ అగ్నిప్రమాదం.!
- Pune Woman and Lover Arrested: కేతన్ అగర్వాల్ హత్య కేసు.. నిందితులు సియా, చేతన్లకు 7 రోజుల పోలీసు కస్టడీ!
ఇది కూడా చదవండి: Kanakadurga Flyover: పార్కింగ్ స్పాట్గా మారిన బెజవాడ దుర్గగుడి ఫ్లై ఓవర్..
చిన్మయ్ శర్మ… డిజిటల్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్గా పని చేస్తున్నాడు. నోయిడాలో ఉన్న ఒక సంస్థలో పనిచేస్తున్నాడు. మృతుడు ఉత్తరప్రదేశ్లోని ముజఫర్నగర్లో నివాసం ఉంటున్నాడు. అతని తల్లిదండ్రులు ముజఫర్నగర్లో ఉపాధ్యాయులుగా పని చేస్తున్నారు. లేహ్ 10,000 అడుగుల ఎత్తులో ఉంది. ఎత్తైన ఎడారి ప్రాంతం. అధిక ఎత్తులో ఉన్నప్పుడు అనారోగ్యానికి గురవుతుంటారు. ఆ వాతావరణం అలవాటు చేసుకోవడానికి కనీసం మూడు రోజులు సమయం పడుతుందని నివేదికలు తెలుపుతున్నాయి. శరీరం తక్కువ ఆక్సిజన్ స్థాయిలకు గురైనప్పుడు మరియు గాలి పీడనం చాలా త్వరగా మారినప్పుడు హై ఆల్టిట్యూడ్ సిక్నెస్ సంభవిస్తుంది. తలనొప్పి, వాంతులు, అలసట, శ్వాస ఆడకపోవడం మరియు వికారం వంటి లక్షణాలు ఉంటాయి. ఆ కారణం చేతనే అతడు ప్రాణాలు కోల్పోయాడు.
ఇది కూడా చదవండి: Suicide: పిల్లలతో కలిసి నదిలోకి దూకిన ఆర్మీ జవాన్ భార్య..
అనారోగ్యంలో మూడు రకాలు ఉన్నాయి: ఆల్టిట్యూడ్ మౌంటైన్ సిక్నెస్ (AMS) అనేది ఎత్తులో ఉండే అనారోగ్యం, తేలికపాటి రూపం. హై-ఎలిట్యూడ్ సెరిబ్రల్ ఎడెమా (HACE) అనేది AMS యొక్క మరింత తీవ్రమైన రూపం. హై-ఎలిట్యూడ్ పల్మనరీ ఎడెమా (HAPE) త్వరగా ప్రాణాంతకమవుతుంది.
తాజావార్తలు
-
Jayam Ravi : మరో వివాదంలో చిక్కుకున్న జయం రవి.
-
Bill Gates: “అవును, నాకు ఆ ముగ్గురితో ఎఫైర్ ఉంది”.. ఎప్స్టీన్ ఫైల్స్ విచారణలో బిల్ గేట్స్ షాకింగ్ స్టేట్మెంట్
-
OnePlus 16T: వన్ప్లస్ 16T వచ్చేస్తోంది.. 6.3 ఇంచెస్ హై రిఫ్రెష్ రేట్ డిస్ప్లే.. స్నాప్ డ్రాగన్ 8 Elite Gen 6 ప్రాసెసర్
-
Saikrishna Custodial Death Case: సీఐ నాగరాజు రిమాండ్ రిపోర్టు.. వెలుగులోకి సంచనల విషయాలు!
-
Tamannaah Bhatia: బాలీవుడ్, టాలీవుడ్ మధ్య తేడాలపై తమన్నా సంచలన వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
6.39mm స్లిమ్ డిజైన్, 144Hz AMOLED డిస్ప్లే, 6000mAh బ్యాటరీతో TECNO CAMON Slim లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ తోపు అంతే.. ఐపీఎల్ 2026లో రూ.34 కోట్ల పెర్ఫార్మెన్స్!
-
Water Bottle Cleaning: మీరు నీళ్లు తాగే బాటిల్ శుభ్రంగా ఉందా.? బ్యాక్టీరియా, దుర్వాసన రాకుండా ఇలా చేసేయండి.!
-
Pesara Payasam: స్వీట్ తినాలినిపిస్తుందా.? తీపి + హెల్తీ ‘పెసరపప్పు పాయసం’ చేసేయండి ఇలా.!
-
Jharkhand Stampede: ఆర్సీబీ లాంటి మరో తొక్కిసలాట ఘటన.. అభిమానులకు తీవ్ర గాయాలు, జస్ట్ మిస్!