Congress: ఎవరూ భయపడొద్దు.. అమేథీ, రాయ్బరేలీపై 24 గంటల్లో నిర్ణయం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Congress: ఎన్నికలు దగ్గర పడుతున్నా కొద్ది కాంగ్రెస్ పార్టీ రాయ్బరేలీ, అమేథీ స్థానాలపై నాన్చుతూనే ఉంది. మరోవైపు అభ్యర్థులను ప్రకటించకపోవడంతో కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. అయితే, త్వరలోనే దీనిపై స్పష్టత ఇచ్చేందుకు కాంగ్రెస్ సిద్ధమవుతోంది. 24 గంటల్లో నిర్ణయం ప్రకటిస్తామని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చెబుతున్నారు. అభ్యర్థుల ఎంపికకు సంబంధించి కేంద్ర ఎన్నికల కమిటీ(సీఈసీ) అధికారాన్ని ఖర్గేకి ఇచ్చిందిన పార్టీ నేత జైరాం రమేష్ తెలిపారు. ఎవరూ భయపడొద్దని, ఎవరూ పారిపోవడం లేదని ఆయన అన్నారు.
Also Read
- Asaduddin Owaisi: ‘‘ఆరుగురు పిల్లలు ఉన్నంత మాత్రాన..’’ ఓటర్ల జాబితా మ్యాపింగ్పై ఓవైసీ ఆగ్రహం..
- Success Story: వయసు 23 ఏళ్లు.. ఏకంగా 19 ప్రభుత్వ ఉద్యోగాలు.. ఆమె విజయ రహస్యం ఇదే..
- PM Modi: అది ‘‘హిందూ గ్రోత్ రేట్’’ కాదు, ‘‘కాంగ్రెస్ గ్రోత్ రేట్’’
- Congress-TMC Merger: రాహుల్ నాయకత్వాన్ని అంగీకరించిన మమత.!
అమేథీ, రాయ్బరేలీ నియోజకవర్గాలకు సంబంధించి మంగళవారం విడుదల చేసిన తాజా లోక్సభ ఎన్నికల జాబితాలో అభ్యర్థులను పేర్కొనకుండా కాంగ్రెస్ సస్పెన్స్ను కొనసాగిస్తోంది. 2019లో బీజేపీ నేత స్మృతి ఇరానీ చేతిలో రాహుల్ గాంధీ పరాజయం పాలయ్యారు. అయితే, ఈ సారి మళ్లీ అతను అమేథీ నుంచి పోటీ చేస్తారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఐదో దశలో మే 20న ఈ రెండు స్థానాలకు ఎన్నికలు జరగబోతున్నాయి.
మరోవైపు కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ అమేథీ నుంచి నామినేషన్ దాఖలు చేశారు. రాహుల్, ప్రియాంకా ఎవరు పోటీ చేసిన ఓడిపోతారని ఆమె చెప్పారు. ఉత్తర్ ప్రదేశ్లో మొత్తం 80 ఎంపీ స్థానాలు ఉండగా.. సమాజ్వాదీ పార్టీతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకుని 17 స్థానాల్లో పోటీ చేస్తోంది. మిగిలిన 63 స్థానాల్లో సమాజ్ వాదీ, ఇతర ప్రాంతీయ పార్టీలు పోటీ చేస్తున్నాయి.
తాజావార్తలు
-
Astrology: కెరీర్లో నెమ్మదిగా ఎదిగినా.. చివరికి పెద్ద స్థాయికి చేరుకునే 3 రాశులు ఇవేనా?
-
Story Board: హైదరాబాద్లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
-
RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
-
Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
-
Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!