Jairam Ramesh: అమిత్ షా కలెక్టర్లను బెదిరిస్తున్నారు.. స్పందించిన ఈసీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jairam Ramesh: మంగళవారం జరిగే ఓట్ల లెక్కింపు ముందు కాంగ్రెస్ నేత జైరాం రమేష్ సంచలన ఆరోపణలు చేశారు. అమిత్ షా అన్ని జిల్లాల అధికారులను పిలిచి బెదిరించారని ఆరోపించారు. ఈ ఆరోపణలు చేసిన ఒక రోజు తర్వాత కేంద్రం ఎన్నికల సంఘం స్పందించింది. ఏ అధికారి కూడా ‘‘అనవసరమైన ప్రభావం’’ గురించి నివేదించలేదని, ఏవైనా వివరాలు ఉంటే ఆదివారం సాయంత్రం 7 గంటల వరకు ఇవ్వాలని, వీటిని బట్టి చర్యలు తీసుకుంటామని కేంద్ర ఎన్నికల సంఘం చెప్పింది.
Read Also: Assembly election 2024: అరుణాచల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ భారీ విజయం.. సిక్కింలో ఎస్కేఎం..
Also Read
- Nitin Nabin: విదేశాల నుంచి భారత యువతను ఆడించలేరు.. సీజేపీపై బీజేపీ పరోక్ష విమర్శలు..
- Shashi Tharoor: రాహుల్గాంధీపై అనుచిత వ్యాఖ్యలు.. ‘ఒబామా.. మోడీ సంగతి ఏంటి?’.. రామచంద్ర గుహకు శశిథరూర్ కౌంటర్
- IMD Rain Alert: దక్షిణ, ఈశాన్య రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
- India At UN: పాక్కు భారత్ షాక్.. కాశ్మీర్ రాగం పాడితే ఇదే సమాధానం!
‘‘ అధికారం కోల్పోతున్న హోంమంత్రి కలెక్టర్లను పిలుస్తున్నారు. ఇప్పటి వరకు అమిత్ షా 150 మందితో మాట్లాడారు. అధికారులను బహిరంగంగా బెదిరించే ప్రయత్నం చాలా సిగ్గుచేటు మరియు ఆమోదయోగ్యం కాదు. ప్రజాస్వామ్యం ఆదేశానుసారం పని చేస్తుందని గుర్తుంచుకోండి, బెదిరింపులపై కాదు. జూన్ 4న ప్రధాని మోడీ, అమిత్ షా ఇద్దరు నిష్క్రమిస్తారు. ఇండియా కూటమి విజయం సాధిస్తుంది. అధికారులు ఎలాంటి ఒత్తిడికి లోనుకాకూడదు. వారు రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి’’ అని ఎక్స్ వేదికగా జైరాం రమేష్ ట్వీట్ చేశారు.
మీరు జాతీయ పార్టీలో సీనియర్ నేత కాబట్టి కౌంటింగ్ రోజుకు ముందు మీరు నిజమని నమ్ముతున్న సమాచారాన్ని, ఆధారాలను ఇవ్వాలని, 150 మంది కలెక్టర్ల అందించాలని ఈసీ కోరింది. తద్వారా తగిన చర్యలు తీసుకోవచ్చని ఎన్నికల సంఘం చెప్పింది. అయితే, ఇలాంటి ఆరోపణలను కేంద్రమంత్రి హర్దీప్ సింగ్ పూరి కొట్టిపారేశారు. భారత హోం మంత్రి ఏ జిల్లా అధికారిని లేదా సబ్ డివిజనల్ అధికారిని పిలువరు, ఒక రాష్ట్ర సీఎంతో వ్యవహరిస్తారు అని అన్నారు.
The outgoing Home Minister has been calling up DMs/Collectors. So far he has spoken to 150 of them. This is blatant and brazen intimidation, showing how desperate the BJP is. Let it be very clear: the will of the people shall prevail, and on June 4th, Mr. Modi, Mr. Shah, and the…
— Jairam Ramesh (@Jairam_Ramesh) June 1, 2024
తాజావార్తలు
-
HYDRAA : హైడ్రా ప్రజావాణికి మరో బ్రేక్.. జూన్ 22 నుంచే మళ్లీ ప్రారంభం..!
-
Off The Record : కేటీఆర్కు సమాంతరంగా మరో వర్కింగ్ ప్రెసిడెంట్ పై కేసీఆర్ కసరత్తు
-
Nitin Nabin: విదేశాల నుంచి భారత యువతను ఆడించలేరు.. సీజేపీపై బీజేపీ పరోక్ష విమర్శలు..
-
Shashi Tharoor: రాహుల్గాంధీపై అనుచిత వ్యాఖ్యలు.. ‘ఒబామా.. మోడీ సంగతి ఏంటి?’.. రామచంద్ర గుహకు శశిథరూర్ కౌంటర్
-
Vaibhav’s Father: ‘సూర్యవంశీ వారి కాలి దుమ్ముకు కూడా సరిపోడు’.. సంచలన వ్యాఖ్యలు చేసిన వైభవ్ తండ్రి..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!