గంగా నదిలో కోవిడ్ మృతదేహాలు.. కేంద్రం సమాధానం ఇదే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కరోనా మహమ్మారి ఎంతో మంది ప్రాణాలు తీసింది… భారత్ ఇప్పటి వరకు 5,02,874 మంది కోవిడ్ బారినపడి మృతిచెందారు.. అయితే, కరోనా సెకండ్ వేవ్ ఘోరంగా దెబ్బకొట్టింది.. పెద్ద సంఖ్యలో కేసులు నమోదు కావడంతో పాటు.. మృతుల సంఖ్య కూడా భారీగా పెరిగి ఆందోళనకు గురిచేసింది.. ఇక, కరోనా సెకండ్ వేవ్ సమయంలో.. గంగా నదిలో మృతదేహాలు కొట్టుకురావడం సంచలనంగా మారింది.. కోవిడ్ రోగులను ఇలా నీటిలో వదిలేస్తున్నారనే ఆరోపణలు వచ్చాయి.. యూపీ ప్రభుత్వంపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి.. వాటిని.. గంగానదిలో తీరంలో పూడ్చిపెట్టడంతో.. భారీ వర్షాలతో మరోసారి ఆ మృతదేహాలో గంగా నదిలో తేలుతూ విమర్శలు పాలు చేశాయి.. అయితే, ఈ వ్యవహారం ఇప్పుడు రాజ్య సభ వరకు వెళ్లింది.. గంగా నదిలో కోవిడ మృతదేహాలపై తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ డెరిక్ ఓ బ్రియన్.. ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.. గంగా నదిలో ఎన్ని మృతదేహాలు కొట్టుకొచ్చాయి… వాటి కోసం ఎలాంటి చర్యలు తీసుకున్నారు.. అంటూ కేంద్రాన్ని ప్రశ్నించారు.
Read Also: కోవిడ్ అప్డేట్: తగ్గిన కేసులు.. భారీగా పెరిగిన మరణాలు
Also Read
- AIADMK Crisis: అన్నాడీఎంకేలో మరింత ముదిరిన సంక్షోభం.. స్పీకర్తో విడివిడిగా ఇరు వర్గాల భేటీ
- NEET Paper Leak Case: నీట్ పేపర్ లీక్ కేసు.. ఎన్టీఏను రద్దు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్
- Exam Paper: ‘డార్లింగ్.. నీ కోసం పరీక్ష పేపర్లు లీక్ చేస్తా’ అంటూ.. విద్యార్థినిని లైంగికంగా వేధించిన ప్రొఫెసర్..
- Gig Workers Strike: "పెరిగిన రేట్లకు తగ్గట్టు సర్వీస్ ఛార్జీలు పెంచండి".. మళ్లీ సమ్మె బాట పట్టిన గిగ్ వర్కర్లు..
ఇక, టీఎంసీ ఎంపీ ప్రశ్నపై స్పందించిన కేంద్రం.. గంగా నదిలో మృతదేహాల మాట వాస్తమే.. కానీ.. మృతదేహాల వివరాలు లేవని సమాధానం చెప్పింది. ఉత్తరప్రదేశ్, బీహార్ గుండా ప్రవహించే గంగానదిలో గుర్తు తెలియని మృతదేహాలు కొట్టుకురావడం నిజమేనని అంగీకరించి మోడీ సర్కార్.. వాటికి సంబంధించిన నివేదికలు అందజేయాలని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేశామని పేర్కొంది.. కానీ, ఆ వివరాలు తమ వద్ద లేవంటూ కేంద్ర జల శక్తి సహాయ మంత్రి బిశ్వేశ్వర్ రాజ్యసభలో రాతపూర్వక సమాధానం ఇచ్చారు. కాగా, కేంద్రం సమాధానంపై విపక్షాలు అసంతృప్తి వ్యక్తం చేశాయి. ప్రభుత్వం నిజాలు దాచిపెడుతోందని, అబద్ధాలు చెబుతోందని విపక్షాల ఎంపీలు మండిపడుతున్నారు.
తాజావార్తలు
-
Tickets Prices Hike: మరి ఇంత దారుణమా.. SRH vs RCB మ్యాచ్ టికెట్ ధరలు అంతలా పెంచేసారేంట్రా బాబు..!
-
AIADMK Crisis: అన్నాడీఎంకేలో మరింత ముదిరిన సంక్షోభం.. స్పీకర్తో విడివిడిగా ఇరు వర్గాల భేటీ
-
Jayam Ravi: 14 ఏళ్లు బానిసలా బతికా.. ‘నా పిల్లలను కూడా చూడనివ్వట్లేదు’ అంటూ ఏడ్చేసిన జయం రవి..
-
Minister Seethakka: 32 లక్షల మహిళలకు రుణాలు.. మహిళల ఆర్థిక స్వావలంబనకు స్త్రీనిధి అండ
-
NEET Paper Leak Case: నీట్ పేపర్ లీక్ కేసు.. ఎన్టీఏను రద్దు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..