గంగా నదిలో కోవిడ్ మృతదేహాలు.. కేంద్రం సమాధానం ఇదే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కరోనా మహమ్మారి ఎంతో మంది ప్రాణాలు తీసింది… భారత్ ఇప్పటి వరకు 5,02,874 మంది కోవిడ్ బారినపడి మృతిచెందారు.. అయితే, కరోనా సెకండ్ వేవ్ ఘోరంగా దెబ్బకొట్టింది.. పెద్ద సంఖ్యలో కేసులు నమోదు కావడంతో పాటు.. మృతుల సంఖ్య కూడా భారీగా పెరిగి ఆందోళనకు గురిచేసింది.. ఇక, కరోనా సెకండ్ వేవ్ సమయంలో.. గంగా నదిలో మృతదేహాలు కొట్టుకురావడం సంచలనంగా మారింది.. కోవిడ్ రోగులను ఇలా నీటిలో వదిలేస్తున్నారనే ఆరోపణలు వచ్చాయి.. యూపీ ప్రభుత్వంపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి.. వాటిని.. గంగానదిలో తీరంలో పూడ్చిపెట్టడంతో.. భారీ వర్షాలతో మరోసారి ఆ మృతదేహాలో గంగా నదిలో తేలుతూ విమర్శలు పాలు చేశాయి.. అయితే, ఈ వ్యవహారం ఇప్పుడు రాజ్య సభ వరకు వెళ్లింది.. గంగా నదిలో కోవిడ మృతదేహాలపై తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ డెరిక్ ఓ బ్రియన్.. ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.. గంగా నదిలో ఎన్ని మృతదేహాలు కొట్టుకొచ్చాయి… వాటి కోసం ఎలాంటి చర్యలు తీసుకున్నారు.. అంటూ కేంద్రాన్ని ప్రశ్నించారు.
Read Also: కోవిడ్ అప్డేట్: తగ్గిన కేసులు.. భారీగా పెరిగిన మరణాలు
Also Read
- Siya Goyal: సియా గోయల్ కుటుంబానికి FDA షాక్.. రూ.8 లక్షల విలువైన వస్తువుల స్వాధీనం
- PM Modi: ఘనంగా ప్రారంభమైన పూరీ జగన్నాథ రథయాత్ర.. దేశ ప్రజలకు ప్రధాని మోడీ శుభాకాంక్షలు..
- King Cobra Rescue: అమ్మబాబోయ్.. 10 అడుగుల రాచనాగుని చుట్టుకుని బయటకు వచ్చిన మహిళ (వీడియో)
- BMC Taj Mahal Palace Hotel: 26/11 తర్వాత రోడ్లపై బారికేడ్లు ఏర్పాటు.. తాజ్ హోటల్కు రూ. 22 కోట్ల నోటీసు జారీ
ఇక, టీఎంసీ ఎంపీ ప్రశ్నపై స్పందించిన కేంద్రం.. గంగా నదిలో మృతదేహాల మాట వాస్తమే.. కానీ.. మృతదేహాల వివరాలు లేవని సమాధానం చెప్పింది. ఉత్తరప్రదేశ్, బీహార్ గుండా ప్రవహించే గంగానదిలో గుర్తు తెలియని మృతదేహాలు కొట్టుకురావడం నిజమేనని అంగీకరించి మోడీ సర్కార్.. వాటికి సంబంధించిన నివేదికలు అందజేయాలని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేశామని పేర్కొంది.. కానీ, ఆ వివరాలు తమ వద్ద లేవంటూ కేంద్ర జల శక్తి సహాయ మంత్రి బిశ్వేశ్వర్ రాజ్యసభలో రాతపూర్వక సమాధానం ఇచ్చారు. కాగా, కేంద్రం సమాధానంపై విపక్షాలు అసంతృప్తి వ్యక్తం చేశాయి. ప్రభుత్వం నిజాలు దాచిపెడుతోందని, అబద్ధాలు చెబుతోందని విపక్షాల ఎంపీలు మండిపడుతున్నారు.
తాజావార్తలు
-
Iran Missile Attack: అమెరికా-ఇరాన్ యుద్ధం మరింత ఉధృతం.. గల్ఫ్ దేశాల్లో అమెరికా స్థావరాలపై ఇరాన్ క్షిపణి దాడులు
-
FIFA WC 2026: 39 ఏళ్ల మెస్సీని ఇప్పటికీ ఎందుకు ఎవరూ ఆపలేకపోతున్నారు? కారణం ఇదే!
-
Fauzi Release Date : ‘ఫౌజీ’ రిలీజ్ డేట్ వచ్చేసింది.. డిసెంబర్లో థియేటర్స్ దద్దరిల్లాల్సిందే
-
Doctor Murder Case: రక్తపు మడుగులో భర్త.. 8ఏళ్ల పిల్లాడిని చావబాదింది.. తర్వాత మంచంపై పడుకొని ఫోన్లో రీల్స్ చూస్తూ…
-
Tollywood : డాన్సర్స్ అసోసియేషన్ వివాదంపై ఫిలిం ఫెడరేషన్ అత్యవసర సమావేశం
ట్రెండింగ్
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!