USA: భారత్, రష్యా నుంచి క్రూడ్ ఆయిల్ కొంటే మాకేం ఇబ్బంది లేదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
No Conflict In India Buying Russian Crude Oil Says US Official: భారతదేశం అమెరికా భాగస్వామిగా ఉంటూ రష్యా క్రూడ్ ఆయిల్ కొనుగోలు చేయడంలో మాకేం విభేధాలు లేవని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అడ్మినిస్ట్రేషన్ లో ముఖ్య అధికారిగా ఉన్న ఇంధన వనరుల సహాయ కార్యదర్శి జియోఫ్రి ఆర్ ప్యాట్ అన్నారు. భారత్ రష్యాతో సాధ్యమైనంత తక్కువ ధరకు కొనుగోలు చేయడంలో భారత్, రష్యాతో గట్టి బేరం కుదుర్చుకుందని దీంతో తమకు ఎలాంటి ఇబ్బందులు లేవని.. ఇంధన భద్రతలో అమెరికా, భారత్ తో సౌకర్యవంతంగా ఉందని వెల్లడించారు. భారత్, రష్యా నుంచి క్రూడ్ ఆయిల్ కొనుగోలుపై అమెరికా చేసిన స్పష్టమైన తొలి ప్రకటన ఇదే. అమెరికా ప్రపంచ భాగస్వాముల్లో భారత్ ఒకటిగా నిలిచిపోతుందని అన్నారు.
Read Also: Shiv Sena: శివసేన పేరు, పార్టీ గుర్తు ఏక్ నాథ్ షిండే వర్గానివే.. స్పష్టం చేసిన ఈసీ
Also Read
- Mood of the Nation: సీఎం అయిన 3 నెలలకే ప్రధాని రేసులోకి తలపతి విజయ్!
- Mohan Bhagwat: న్యూయార్క్లో మోహన్ భగవత్ ర్యాలీపై రగడ.. ఈవెంట్ నిర్వాహకులకు బిగ్ షాక్
- MOTN Survey: మోడీ వైపే ప్రజలు.. కాక్రోచ్ పార్టీకి షాక్.. తాజా సర్వేలో సంచలనం..
- Kangana-kriti: కృతి సనన్ యాడ్ వివాదం వేళ.. కంగనా నేషనల్ అవార్డ్ లుక్ వైరల్
రష్యా ముడి చమురు ధరపై భారతీయ కంపెనీలు విజయవంతంగా చర్చలు జరుపుతున్నాయని.. దీని వల్ల భారత రిఫైనరీలు సరసమైన ధరకు ఆయిల్ ను గ్లోబల్ మార్కెట్ లో ఉంచడానికి వీలు కల్పిస్తున్నాయని జియోఫ్రి ఆర్ ప్యాట్ అన్నారు. ప్యాట్ ఫిబ్రవరి 16-17 తేదీల్లో న్యూఢిల్లీలో పర్యటిస్తున్నారు. గ్రీన్ హైడ్రోజన్, పౌర అణుశక్తి రంగాల్లో రెండు దేశాల సహకారాన్ని విస్తరించడానికి చర్చలు జరుపుతున్నారు.
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభం అయిన తర్వాత జీ 7 దేశాలు( యూకే, యూఎస్ఏ, జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ, జపాన్, కెనడా) రష్యా ఆయిల్ ధర పరిమితిని విధించాయి. బ్యారెల్ కు 60 డాలర్ల కన్నా ఎక్కువ చెల్లించకుండా ప్రైస్ క్యాప్ విధించింది. అయితే ఈ నేపథ్యంలో భారత్ రష్యా నుంచి కేవలం 15 డాలర్లకే బ్యారెల్ కొనుగోలు చేస్తున్నట్లు అంచనా వేస్తున్నట్లు ప్యాట్ అన్నారు.
ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభం అయినప్పటి నుంచి రష్యా వద్ద నుంచి భారత్ క్రూడ్ ఆయిల్ కొనుగోలు చేస్తోంది. అయితే దీనిపై యూరోపియన్ యూనియన్ తో పాటు అమెరికా కూడా భారత్ పై ఒత్తడి తీసుకువచ్చింది. అయితే పలు సందర్భాల్లో వెస్ట్రన్ మీడియా చేస్తున్న ఆరోపణలను విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ తిప్పికొట్టారు.
- Tags
తాజావార్తలు
-
IP66+IP68+IP69+IP69K రేటింగ్స్, AMOLED డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో REDMI Note 17 Pro Max 5G లాంచ్..!
-
Asha Bhosle Last Song: 90 ఏళ్ల వయసులో రికార్డ్ చేసిన ఆశా భోంస్లే చివరి పాట.. జయంతి రోజే విడుదల
-
ఏడేళ్ల సాఫ్ట్వేర్ సపోర్ట్, 120Hz AMOLED డిస్ప్లే, ట్రిపుల్ కెమెరా సెటప్, IP68తో Samsung Galaxy S26 FE లాంచ్..!
-
Sonal Dinusha: టీమిండియాపై సెంచరీలు.. ఆ కిక్కే వేరప్పా.. గాల్లో తేలిపోతున్న శ్రీలంక హీరో!
-
Tollywood : టాలీవుడ్ టాప్ డైరెక్టర్స్ నెక్ట్స్ లైనప్ సినిమాలు ఇవే
ట్రెండింగ్
-
Festival Recipes : రక్షా బంధన్ స్పెషల్.. ఇంట్లోనే సింపుల్గా కాజు కట్లీ రెడీ..!
-
MS Dhoni-CSK: సీఎస్కేలో ధోనీకి 25 శాతం వాటానా?.. ఫ్రీగా ఎవరైనా ఇస్తారా?.. మాజీ టీమిండియా ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
కేవలం రూ.7,999కే.. 5000mAh బ్యాటరీ, LED ఫ్లాష్ కెమరాతో Lava Bold N4 Lite లాంచ్..!
-
రూ.14,999కే మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే.. Realme C100i 4G ఫోన్ లాంచ్.!
-
Paneer Bhurji Recipe: పప్పు, కూరలతో బోర్ కొడుతోందా.? అయితే “పనీర్ భుర్జీ”తో కొత్త టేస్ట్ ఆస్వాదించండి..!