USA: భారత్, రష్యా నుంచి క్రూడ్ ఆయిల్ కొంటే మాకేం ఇబ్బంది లేదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
No Conflict In India Buying Russian Crude Oil Says US Official: భారతదేశం అమెరికా భాగస్వామిగా ఉంటూ రష్యా క్రూడ్ ఆయిల్ కొనుగోలు చేయడంలో మాకేం విభేధాలు లేవని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అడ్మినిస్ట్రేషన్ లో ముఖ్య అధికారిగా ఉన్న ఇంధన వనరుల సహాయ కార్యదర్శి జియోఫ్రి ఆర్ ప్యాట్ అన్నారు. భారత్ రష్యాతో సాధ్యమైనంత తక్కువ ధరకు కొనుగోలు చేయడంలో భారత్, రష్యాతో గట్టి బేరం కుదుర్చుకుందని దీంతో తమకు ఎలాంటి ఇబ్బందులు లేవని.. ఇంధన భద్రతలో అమెరికా, భారత్ తో సౌకర్యవంతంగా ఉందని వెల్లడించారు. భారత్, రష్యా నుంచి క్రూడ్ ఆయిల్ కొనుగోలుపై అమెరికా చేసిన స్పష్టమైన తొలి ప్రకటన ఇదే. అమెరికా ప్రపంచ భాగస్వాముల్లో భారత్ ఒకటిగా నిలిచిపోతుందని అన్నారు.
Read Also: Shiv Sena: శివసేన పేరు, పార్టీ గుర్తు ఏక్ నాథ్ షిండే వర్గానివే.. స్పష్టం చేసిన ఈసీ
Also Read
- Ketan Agarwal murder case: 3 ఏళ్ల టైమ్ దొరుకుతుందనే కేతన్ హత్య..
- Mahua Moitra: ‘బెంగాలీలకు రాజ్మా అంటే తెలుసా?’ బీజేపీ ప్రభుత్వంపై మహువా మొయిత్రా ఫైర్
- Sonia Gandhi: గాజాపై కేంద్రం తీరుపై సోనియాగాంధీ విమర్శలు.. ప్రజల్ని తప్పుదోవ పట్టించొద్దన్న బీజేపీ
- CM Vijay: ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధిగా ‘జన నాయకన్’ నిర్మాత నియామకం.. తమిళనాడులో రాజకీయ దుమారం
రష్యా ముడి చమురు ధరపై భారతీయ కంపెనీలు విజయవంతంగా చర్చలు జరుపుతున్నాయని.. దీని వల్ల భారత రిఫైనరీలు సరసమైన ధరకు ఆయిల్ ను గ్లోబల్ మార్కెట్ లో ఉంచడానికి వీలు కల్పిస్తున్నాయని జియోఫ్రి ఆర్ ప్యాట్ అన్నారు. ప్యాట్ ఫిబ్రవరి 16-17 తేదీల్లో న్యూఢిల్లీలో పర్యటిస్తున్నారు. గ్రీన్ హైడ్రోజన్, పౌర అణుశక్తి రంగాల్లో రెండు దేశాల సహకారాన్ని విస్తరించడానికి చర్చలు జరుపుతున్నారు.
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభం అయిన తర్వాత జీ 7 దేశాలు( యూకే, యూఎస్ఏ, జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ, జపాన్, కెనడా) రష్యా ఆయిల్ ధర పరిమితిని విధించాయి. బ్యారెల్ కు 60 డాలర్ల కన్నా ఎక్కువ చెల్లించకుండా ప్రైస్ క్యాప్ విధించింది. అయితే ఈ నేపథ్యంలో భారత్ రష్యా నుంచి కేవలం 15 డాలర్లకే బ్యారెల్ కొనుగోలు చేస్తున్నట్లు అంచనా వేస్తున్నట్లు ప్యాట్ అన్నారు.
ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభం అయినప్పటి నుంచి రష్యా వద్ద నుంచి భారత్ క్రూడ్ ఆయిల్ కొనుగోలు చేస్తోంది. అయితే దీనిపై యూరోపియన్ యూనియన్ తో పాటు అమెరికా కూడా భారత్ పై ఒత్తడి తీసుకువచ్చింది. అయితే పలు సందర్భాల్లో వెస్ట్రన్ మీడియా చేస్తున్న ఆరోపణలను విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ తిప్పికొట్టారు.
- Tags
తాజావార్తలు
-
Ketan Agarwal murder case: 3 ఏళ్ల టైమ్ దొరుకుతుందనే కేతన్ హత్య..
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Mahua Moitra: ‘బెంగాలీలకు రాజ్మా అంటే తెలుసా?’ బీజేపీ ప్రభుత్వంపై మహువా మొయిత్రా ఫైర్
-
Cathy Gebe: మహిళా ఎంపీ దెబ్బకు పురుష ఎంపీలు షాక్.. పార్లమెంట్లో ఒక్క పదంతో వాళ్ల పరువు తీసేసింది!
-
Europe Heatwave: యూరప్ను బెంబేలెత్తిస్తోన్న ‘ఒమేగా బ్లాక్’.. రికార్డు ఉష్ణోగ్రతలకు కారణమిదేనా!
ట్రెండింగ్
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!
-
55 రోజుల స్టాండ్బై బ్యాటరీతో రూ.1,699కే itel Power 451 AI ఫీచర్ ఫోన్..