Nitish Kumar: 2024 లోక్సభ ఎన్నికల్లో యూపీ నుంచి నితీష్ కుమార్ పోటీ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nitish Kumar: బిహార్లో బీజేపీతో తెగదెంపులు చేసుకున్న బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్.. వచ్చే లోక్సభ ఎన్నికల్లో బీజేపీని దెబ్బకొట్టడానికి ప్రయత్నాలు ముమ్మరం చేశారు. నితీష్ కుమార్ 2024 లోక్సభ ఎన్నికలకు ముందు ప్రతిపక్ష పార్టీలను ఏకం చేయడానికి ప్రయత్నిస్తున్నప్పటికీ, ఆయనే స్వయంగా ఉత్తరప్రదేశ్లోని ఫుల్పూర్ నుంచి ఎన్నికల్లో పోటీ చేయవచ్చని ఊహాగానాలు చెలరేగుతున్నాయి. ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ రాష్ట్రంలో తనకు నచ్చిన ఏదైనా స్థానం నుంచి లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయాలని నితీష్ కుమార్కు ఆఫర్ ఇచ్చారని.. తన పార్టీ తరపున మద్దతు ఇస్తానని హామీ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. ఫుల్పూర్లోని జనతాదళ్ (యునైటెడ్)కి చెందిన పలువురు కార్యకర్తలు లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయాలని నితీష్కుమార్ను డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే.
జనతాదళ్ (యునైటెడ్) జాతీయ అధ్యక్షుడు లలన్ సింగ్ ఆదివారం కూడా నితీష్ కుమార్ ఉత్తరప్రదేశ్ నుంచి లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయవచ్చని సూచించారు. ఎందుకంటే ఆయనకు ఫుల్పూర్ నుండి మాత్రమే కాకుండా అంబేడ్కర్ నగర్, మీర్జాపూర్ లోక్సభ స్థానం నుంచి కూడా పోటీ చేసే అవకాశాలు కూడా ఉన్నాయన్నారు. “అంగీకరించడానికి, తిరస్కరించడానికి ఏమీ లేదు. నితీష్ కుమార్ లోక్సభ ఎన్నికల్లో పోటీ చేస్తారా లేదా అనేది సరైన సమయంలో మాత్రమే నిర్ణయించబడుతుంది. కానీ నితీష్ కుమార్కు అంబేద్కర్ నగర్, మీర్జాపూర్ నుంచి లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయడానికి ఆఫర్ చేయబడింది.” ఆయన ఉత్తరప్రదేశ్ నుంచి ఎన్నికల్లో పోటీ చేయాలని పార్టీ కార్యకర్తలు డిమాండ్ చేస్తున్న ప్రతిపక్ష పార్టీలను ఏకం చేయడమే తన ధ్యేయమని ల\లన్ సింగ్ అన్నారు. ఉత్తరప్రదేశ్లో అత్యధిక లోక్సభ స్థానాలు ఉన్నందున 2024 ఎన్నికలకు ఎన్నికలపరంగా కీలకమైన రాష్ట్రమని లలన్ సింగ్ పేర్కొన్నారు. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ నుంచి బీజేపీకి 65 మంది ఎంపీలు ఉన్నారని, అఖిలేష్ యాదవ్, నితీశ్ కుమార్తో పాటు ఇతర ప్రతిపక్షాలు కలిస్తే కాషాయ పార్టీ 15-20 సీట్లకే పరిమితమయ్యే అవకాశం ఉందని ఆయన అన్నారు.
Also Read
- CM Vijay: నీట్ పేపర్ లీక్పై స్పందించిన సీఎం విజయ్.. ఏమన్నారంటే..?
- Prateek Yadav Death: నీలం రంగులో కాలి బొటన వేలు.. ప్రతీక్ యాదవ్ పోస్టుమార్టం రిపోర్ట్లో కీలక విషయాలు..
- Ahmedabad: అమ్మ.. కిలాడీ.. చిరునవ్వుతో పని కానిచ్చేసింది.. వీడియో వైరల్
- Karnataka: కేరళం పంచాయితీ ముగియకుండానే కర్ణాటకలో రేగిన వర్గపోరు.. వెలసిన డీకే.శివకుమార్ కటౌట్లు
President Murmu: క్వీన్ ఎలిజబెత్-2 అంత్యక్రియల్లో పాల్గొనేందుకు లండన్కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
అలహాబాద్లోని ఫుల్పూర్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ లోక్సభ స్థానం అయిన వారణాసికి కేవలం 100 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ స్థానం నుంచి నితీష్కుమార్ పోటీ చేయాలని నిర్ణయించుకుంటే, 2024 ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్లో రాజకీయ డైనమిక్స్ మారవచ్చు. 2024లో నరేంద్ర మోడీకి సవాల్ రావాలంటే ఉత్తరప్రదేశ్లో భారీ విజయం సాధించాలని నితీష్ కుమార్కు తెలుసునని, అది కాకపోతే తన లక్ష్యం విఫలమవుతుందని నితీశ్ కుమార్కు తెలుసన రాజకీయ వర్గాలు చెబుతున్నాయి.
తాజావార్తలు
-
Norovirus: మరో వైరస్ కలకలం.. 1700 మంది నౌకలోనే క్వారంటైన్..
-
CM Vijay: నీట్ పేపర్ లీక్పై స్పందించిన సీఎం విజయ్.. ఏమన్నారంటే..?
-
Virosh: గ్లోబల్ రికార్డుల వేటలో విజయ్-రశ్మిక జోడీ!
-
Trump: పాపం ట్రంప్.. చైనాలో అమెరికా అధ్యక్షుడికి అవమానం!
-
Natti Kumar: ఇద్దరి మధ్య కోల్డ్ వార్ ప్రొడ్యూసర్స్, డిస్ట్రిబ్యూటర్స్ మధ్య సమస్యలకు కారణం!
ట్రెండింగ్
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!