ఎప్పుడూ లేని విధంగా కేంద్ర ప్రభుత్వం ఈసారి ఆదివారం వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టింది. ఇక ఎన్నడూ లేని విధంగా బడ్జెట్ కారణంగా మార్కెట్ కూడా సండే ఓపెన్ కావాల్సి వచ్చింది. ఇక బడ్జెట్లో ఏవైనా మెరుపులు ఉన్నాయంటే అది లేదు. పేదోడికి.. సామాన్యుడికి ఊరట కలిగించే ప్రకటనలు ఏవీ రాలేదు. ఎన్నికలు జరగబోయే రాష్ట్రాలకైనా తాయిలాలు ఉంటాయనుకుంటే అది లేదు. మరోవైపు స్టాక్ మార్కెట్ అయినా లాభాల్లో దూసుకెళ్లిందా? అంటే అది లేదు. పెట్టుబడిదారులకు బడ్జెట్ ఏ మాత్రం రుచించలేదు. దీంతో 8 లక్షల కోట్లకు పైగా సంపద ఆవిరైపోయింది.
ఈ నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా కేంద్ర ప్రభుత్వం పంచ్లు పేలుతున్నాయి. నిర్మలమ్మ బడ్జెట్పై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. సండే మూడ్ను.. మార్కెట్ను రెండూ నాశనం చేశారంటూ ధ్వజమెత్తుతున్నారు. మధ్యతరగతి ప్రజల దుస్థితిపై ఫన్నీ మీమ్స్ పేలుతున్నాయి. మధ్యతరగతి వారికి సెలవు లేదు.. బడ్జెట్ లేదు.. ఆదివారం సమయం వృధా అయిందని మరొకరు విమర్శించారు.
ఇది కూడా చదవండి: UP: 9 ఏళ్లుగా లవ్.. 2 నెలల క్రితం పెళ్లి.. శవమైన భర్త.. మిస్టరీ ఏంటంటే..!
నేడు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్ 2026-27 ప్రకటించారు. పార్లమెంట్లో కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెడుతూ ఆర్థిక మంత్రి ఒక ముఖ్యమైన విషయాన్ని స్పష్టంగా చెప్పారు. ప్రభుత్వం ప్రజల అవసరాలను విస్మరించకుండా ఆర్థిక క్రమశిక్షణను పాటిస్తూ ముందుకు సాగుతోందని స్పష్టం చేశారు. 2026-27 ఆర్థిక సంవత్సరానికి గానూ మొత్తంగా రూ. 53.5 లక్షల కోట్ల కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టారు. మొత్తం రెవెన్యూ వసూళ్లను రూ.35,33,150 కోట్లుగా అంచనా వేశారు. మూలధన వసూళ్లు రూ.18,14,165 కోట్లు ఉండబోతున్నట్లు తెలిపారు. పన్ను వసూళ్లు రూ.28,66,922 కోట్లు, పన్నేతర వసూళ్లు రూ.6,66,228 కోట్లుగా అంచనా వేశారు. మొత్తం ఆదాయం రూ.53,47,315 కోట్లుగా అంచనా వేశారు.
