Site icon NTV Telugu

Covid-19: తొమ్మిది నెలల శిశుకుకు కోవిడ్-19 పాజిటివ్..

Covid 19

Covid 19

Covid-19: దేశంలో కరోనా కేసులు నెమ్మదిగా పెరుగుతున్నాయి. పలు రాష్ట్రాల్లో కోవిడ్-19 పాజిటివ్ కేసులు వెలుగులోకి వస్తున్నాయి. బెంగళూరులో తొమ్మిది నెలల బాలుడికి కోవిడ్-19 పాజిటివ్ నిర్ధారణ అయినట్లు ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. హోస్కోటేకి చెందిన శిశువును మొదట ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్చి, ఆ తర్వాత కలాసిపాల్యలోని వాణి విలాస్ ఆస్పత్రికి తరలించారు. మే 22న శిశువుకు పాజిటివ్ వచ్చిందని ఆ రాష్ట్ర కుటుంబ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ హర్ష్ గుప్తా తెలిపారు. ప్రస్తుతం శిశువు ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని చెప్పారు.

Read Also: Dubbak Murder Case : 80 రోజుల పసికందును హత్య చేసిన తల్లి.. విచారణలో షాకింగ్ విషయాలు..!

మరోవైపు, కేరళలో కరోనా కేసులు విజృంభిస్తున్నాయి. మే నెలలో రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 182 ఇన్ఫెక్షన్లు నమోదయ్యాయి. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ హెచ్చరించారు. కోట్టయం జిల్లాలో అత్యధికంగా 57 కేసులు నమోదయ్యాయి, ఎర్నాకులం తరువాత 34 కేసులు, తిరువనంతపురంలో 30 కేసులు నమోదయ్యాయి.

కోవిడ్-19 కేసులు పెరుగుతుండటంతో ఏపీ ఆరోగ్య శాఖ మే 22న ప్రజలకు ఒక సలహా జారీ చేసింది. రైల్వే స్టేషన్లు, బస్ స్టాండ్లు మరియు విమానాశ్రయాలు వంటి రద్దీగా ఉండే ప్రదేశాలలో సామూహిక సమావేశాలను నివారించాలని మరియు కోవిడ్-19 జాగ్రత్తలు పాటించాలని ఆరోగ్య శాఖ ప్రజలకు సూచించింది.

Exit mobile version