PFI: భారత్ను ఇస్లామిక్ దేశంగా చేసే కుట్ర.. ఎన్ఐఏ రిపోర్టులో సంచలన విషయాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PFI conspiracy to make India an Islamic country: పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(పీఎఫ్ఐ), ఈ సంస్థ నాయకుల ఇళ్లపై రెండు రోజుల క్రితం దేశవ్యాప్తంగా 11 రాష్ట్రాల్లో ఎన్ఐఏ, ఈడీలు సోదాలు నిర్వహించి 106 మంది కీలక సభ్యులను అదుపులోకి తీసుకుంది. అయితే తాజాగా ఎన్ఐఏ విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. 10 మంది రిమాండ్ రిపోర్టులో ఎన్ఐఏ కోర్టుకు పలు విషయాలను తెలియజేసింది. ఒక వర్గాన్ని లక్ష్యంగా చేసుకుని.. ప్రముఖ నాయకులను లక్ష్యంగా చేసుకుని అత్యంత నేరారోపణలు ఉన్నాయని ఎన్ఐఏ పేర్కొంది.
రాడికల్ ఇస్లామిస్ట్ గ్రూపుల్లోకి యువత వెళ్లేలా ప్రోత్సహిస్తోంది ఫీఎఫ్ఐ, లష్కరేతోయిబా, ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా(ఐసిస్)తో సహా పలు ఉగ్రవాద గ్రూపుల్లో ముస్లిం యువత చేరేలా ప్రోత్సహించినట్లు ఎన్ఐఏ రిపోర్టులో పేర్కొన్నట్లు తెలుస్తోంది. జీహాద్ లోభాగంగా భారతదేశంలో ఇస్లామిక్ పాలన స్థాపించడానికి పీఎఫ్ఐ కుట్ర పన్నిందని పేర్కొంది. పీఎఫ్ఐ ప్రభుత్వ విధానాలపై ముస్లిం వర్గాల్లో తప్పుడుగా చెబుతూ.. భారత్ లో అసహనాన్ని వ్యాపిస్తుందని పేర్కొంది.
Also Read
- Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
- Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
- Bangladesh: భారత్, పాకిస్థాన్ను దాటేసిన బంగ్లాదేశ్.. ఏ విషయంలోనో తెలుసా?
- Pakistan: పాకిస్తాన్ మరోసారి.. భారత విమానాలపై గగనతల ఆంక్షలు పొడగింపు..
Read Also: Sitaram Yechury: మోదీ ప్రభుత్వాన్ని గద్దె దింపాలి
ఇతర మతాలు, వర్గాలను భయభ్రాంతులకు గురిచేయడంతో పాటు చట్టవిరుద్ధమైన కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొంటున్నట్లు ఎఫ్ఐఆర్ లో పేర్కొంది. సెప్టెంబర్మ 22న దేశవ్యాప్తంగా 11 రాష్ట్రాల్లో ఎన్ఐఏ దాడులు నిర్వహించి 106 మంది పీఎఫ్ఐ కార్యకర్తలను అరెస్ట్ చేసింది. దాడులు చేసిన సమయంలో ఒక వర్గానికి చెందని ప్రముఖ నాయకులను లక్ష్యంగా చేసుకున్నట్లు తేలింది. పీఎఫ్ఐ సమాజంలో దౌర్జన్యాలు సృష్టించడానికి కుట్ర పన్నిందని ఎన్ఐఏ పేర్కొంది. నిందితుల నుంచి, పీఎఫ్ఐ కార్యాలయాల నుంచి జప్తు చేసిన ఎలక్ట్రానిక్ డివైసెస్ నుంచి సమాచారం రాబట్టేందుకు త్రివేండ్రంలోని సీడీఏసీలో విశ్లేషించాల్సి ఉందని ఎన్ఐఏ పేర్కొంది.
ప్రస్తుతం అరెస్ట్ చేసిన వ్యక్తులపై ఐపీసీ సెక్షన్లతో పాటు యూఏపీఏ చట్టం కింద అనేక కేసులు నమోదు చేసింది ఎన్ఐఏ. అత్యధికంగా కేరళ నుంచి ఎక్కువ అరెస్టులు జరిగాయి. కేరళలో 22 మందిని, మహారాష్ట్ర, కర్ణాటకల్లో 20 మందిని, తమిళనాడులో పది మందిని, అస్సాంలో 9 మందిని, ఉత్తర్ ప్రదేశ్ లో 8 మందిని, ఏపీ నుంచి ఐదుగురిని, మధ్యప్రదేశ్ నుంచి నలుగురిని, పుదుచ్చేరి, ఢిల్లీల నుంచి ముగ్గురు చొప్పున, రాజస్థాన్ నుంచి ఇద్దరిని ఎన్ఐఏ అరెస్ట్ చేసింది.
తాజావార్తలు
-
OTR : వైసీపీ నేతలతో టచ్.. టీడీపీ ఎమ్మెల్యేతో మ్యాచ్? కాకినాడలో హాట్ టాపిక్
-
Story Board : ఇరాన్ యుద్ధం గల్ఫ్ కు చేసిన నష్టమేంటి..? దుబాయ్ గతానికి, ప్రస్తుతానికి తేడా ఏంటి..?
-
Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
-
Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
-
Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!