Bengaluru: కొత్త జంట షాకింగ్ నిర్ణయం.. వెయ్యి కి.మీ ప్రయాణం చేసి ఏం చేశారంటే..!
- టెక్ సిటీ బెంగళూరులో ఘోర విషాదం
- కొత్త సంసారంలో కలహాలు.. ఘర్షణలు
- భార్య ఆత్మహత్య తర్వాత గంటల వ్యవధిలో భర్త కూడా సూసైడ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కొత్త సంసారంలో ఏం కలహాలు వచ్చాయో.. ఏమో తెలియదు గానీ ఓ నూతన జంట షాకింగ్ నిర్ణయం తీసుకుంది. భార్య ఆత్మహత్య చేసుకోగా.. గంటల వ్యవధిలో భర్త కూడా ప్రాణాలు తీసుకున్నాడు. ఈ విషాద ఘటన టెక్ సిటీ బెంగళూరులో చోటుచేసుకుంది.
ఇది కూడా చదవండి: US: గగనతలంలో ప్రమాదం.. 2 హెలికాప్టర్లు ఢీ.. వీడియో వైరల్
Also Read
- GR Gopinath: రూపాయికే విమాన టికెట్.. సామాన్యుడి విమాన కల నిజం చేసిన వ్యక్తి కథ ఇది! ఆయన ఎవరో తెలుసా?
- Health Awareness Wedding: ఆలోచింపజేస్తున్న ఈ వధూవరుల నిర్ణయం.. ఆ టెస్ట్ తర్వాతే వివాహబంధంలోకి అడుగుపెట్టిన జంట
- Karnataka: మందుబాబులకు కర్ణాటక ప్రభుత్వం బంపర్ ఆఫర్.. భారీగా తగ్గనున్న మద్యం ధరలు!
- Greater Noida: కోటి రూపాయలతో పెళ్లి.. 14 నెలలకే విషాదాంతం! కట్నం వేధింపులకు వివాహిత బలి
గన్వి (26), సూరజ్ శివన్న (36) భార్యాభర్తలు. అక్టోబర్ 29న బెంగళూరులో వివాహం జరిగింది. అనంతరం హనీమూన్ కోసం శ్రీలంక టూర్ ప్లాన్ చేసుకున్నారు. అయితే ఈ ప్రయాణం అర్థాంతరంగా రద్దైంది. వివాదం కారణంగా గత వారం తిరిగి బెంగళూరు చేరుకున్నారు. భార్యాభర్తల మధ్య ఏం సంఘర్షణ జరిగిందో ఏమో తెలియదు గానీ గత మంగళవారం గన్వి ఆత్మహత్యకు ప్రయత్నించింది. వెంటిలేటర్పై రెండు రోజులు చికిత్స అందించారు. గత గురువారం వైద్యులు బ్రెయిన్ డెడ్గా ప్రకటించారు.
ఇది కూడా చదవండి: Trump-Zelensky: ట్రంప్-జెలెన్స్కీ భేటీ.. చివరికి ఏం తేలిందంటే..!
ఇక గన్వి మృతి తర్వాత బాధిత కుటుంబ సభ్యులు బెంగళూరులోని సూరజ్ శివన్న, అతని కుటుంబ సభ్యులపై వరకట్న వేధింపుల ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా నిందితులను అరెస్ట్ చేయాలంటూ అత్తమామల ఇంటి ముందు నిరసనకు దిగారు. ఇంటి దగ్గర ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో సూరజ్ శివన్న, అతడి తల్లి జయంతి మహారాష్ట్రలోని నాగ్పూర్కు బయల్దేరి వెళ్లిపోయారు. దాదాపు రెండు రోజుల పాటు 1,000 కి.మీలు ప్రయాణం చేసి వార్ధా రోడ్లోని ఒక హోటల్లో దిగిన తర్వాత తల్లితో పాటు శివన్న ఆత్మహత్యాయత్నం చేశాడు. శివన్న ఉరివేసుకుని ప్రాణాలు తీసుకోగా.. తల్లి జయంతి పరిస్థితి విషమంగా ఉంది.

వెంటనే శివన్న సూరజ్ సోదరుడు సంజయ్ నాగ్పూర్ పోలీసులకు సమాచారం ఇచ్చాడు. అత్తమామల వేధింపులు కారణంగానే తన సోదరుడు ఆత్మహత్య చేసుకున్నాడని ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సంసారంలో తలెత్తిన కలహాలు నూతన జంట ప్రాణాలు తీశాయి.
తాజావార్తలు
-
Redmi K100: 200MP కెమెరాతో రెడ్మీ K100 చవకైన స్మార్ట్ఫోన్.. 10,000mAh బ్యాటరీ!
-
IPL 2026: ఐపీఎల్ 2026లో మజా లేదు.. ఆ సమరం ఎక్కడ అంటున్న ఫాన్స్?
-
GR Gopinath: రూపాయికే విమాన టికెట్.. సామాన్యుడి విమాన కల నిజం చేసిన వ్యక్తి కథ ఇది! ఆయన ఎవరో తెలుసా?
-
AP Heatwave Alert: ఏపీలో ఎండల తీవ్రత.. వారం రోజుల పాటు హీట్వేవ్స్ హెచ్చరిక
-
Hyderabad Traffic Alert: ఉప్పల్ రింగ్ రోడ్డు క్లోజ్.. నగర, వరంగల్-హైదరాబాద్ ప్రయాణికులకు రూట్ మ్యాప్ ఇదే..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..