Lt General Anil Chauhan: కొత్త సీడీఎస్గా అనిల్ చౌహాన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Centre appoints Lt General Anil Chauhan as India’s 2nd Chief of Defence Staff: భారతదేశ త్రివిధ దళాల సమన్వయకర్తగా, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్(సీడీఎస్) పదవిని చేపట్టనున్నారు లెఫ్టినెంట్ జనరల్ అనిల్ చౌహాన్. హెలికాప్టర్ ప్రమాదంలో భారత తొలి సీడీఎస్ బిపిన్ రావత్ చనిపోయిన 9 నెలల తర్వాత రెండో సీడీఎస్ గా అనిల్ చౌహాన్ ను నియమించింది కేంద్రప్రభుత్వం. లెఫ్టినెంట్ జనరల్ అనిల్ చౌహాన్ మే 2021న ఈస్టర్న్ కమాండ్ చీఫ్ గా పదవీ విరమణ చేశారు.
Read Also: Study Abroad: ‘విదేశీ విద్య’ అంటే ఇండియాలో మేమే: Uni2Go కోఫౌండర్ రితికారెడ్డి
Also Read
- Delhi Police: ప్రధాని మోడీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మైనర్పై కేసు విషయంలో.. ఢిల్లీ పోలీసుల కీలక నిర్ణయం
- Saharsa Passenger Train Fire: ప్యాసింజర్ రైలులో భారీ అగ్నిప్రమాదం.. పూర్తిగా దగ్ధమైన బోగీ.!
- IMD Weather Update : ఒకచోట వరదలు.. మరోచోట వాన జాడే లేదు.!
- Attack On Pappu Yadav: ఎంపీ పప్పు యాదవ్పై కత్తితో దాడి.. హడలెత్తించిన దుండగులు..
గతేడాది డిసెంబర్ లో తమిళనాడు కూనురు సమీపంలో నీలగిరి కొండల్లో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో భారత తొలి సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్ చనిపోయారు. ఆ తర్వాత ప్రస్తుతం అనిల్ చౌహన్ ను సీడీఎస్ గా నియమిస్తూ.. బుధవారం ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. లెఫ్టినెంట్ జనరల్ అనిల్ చౌహాన్ (రిటైర్డ్) భారత ప్రభుత్వ సైనిక వ్యవహారాల శాఖ కార్యదర్శిగా కూడా పని చేయనున్నారు. భారతదేశంలో ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్సులను సమన్వయం చేసేందుకు చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ పదవిని మోదీ ప్రభుత్వం తీసుకువచ్చింది. భారత తొలి సీడీఎస్ గా బిపిన్ రావత్ ను నియమించింది.
తమిళనాడులోని ఓ ఆర్మీ కార్యక్రమంలో పాల్గొనేందుకు భార్యతో వెళ్తున్న సమయంలో తమిళనాడు నీలగిరి కొండల్లో హెలికాప్టర్ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో సీడీఎస్ బిపిన్ రావత్, ఆయన భార్యతో పాటు ప్రయాణిస్తున్న 13 మంది మరణించారు. ప్రాణాలతో బయటపడిన గ్రూప్ కెప్టెన్.. తీవ్ర గాయాలతో చికిత్స పొందుతూ మరణించారు.
అనిల్ చౌహన్ వివరాలు:
అనిల్ చౌహనా్ ఖడక్వాస్లాలోని నేషనల్ డిఫెన్స్ అకాడమీ, డెహ్రాడూన్ లోని ఇండియన్ మిలిటరీ అకాడమిలో విద్య అభ్యసించారు. 1981లో భారత సైన్యంలోని 11 గూర్ఖా రైఫిల్స్ లో పనిచేశారు. మేజర్ జనరల్ గా అనిల్ చౌహన్ నార్తర్న కమాండ్ లోని క్లిష్టమైన బారాముల్లా సెక్టార్ లో పదాతిదళానికి నాయకత్వం వహించారు. లెఫ్టినెంట్ జనరల్ గా నార్త్ ఈస్ట్ లోని కార్ప్స్ కి నాయకత్వం వహించారు. సెప్టెంబర్ 2019లో తూర్పు కమాండ్ జనరల్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్ గా పనిచేశారు. మే 2021లో సర్వీసు నుంచి పదవీ విరమణ చేశారు. తాజాగా సీడీఎస్ గా నియమించబడ్డారు.
తాజావార్తలు
-
Monday Fasting Drinks: సోమవారం ఉపవాస సమయంలో ఈ పానీయాలు తాగితే.. నీరసం, అలసట ఉండనే ఉండదు!
-
Trainee IPS Case: ట్రైనీ ఐపీఎస్ కేసులో మరో ట్విస్ట్.. ప్రేమలేఖలు, ల్యాప్టాప్ స్వాధీనం..!
-
India Fielding Coach: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో భారీ మార్పు.. 17 ఫస్ట్క్లాస్ మ్యాచ్లు ఆడిన ప్లేయర్కు కీలక బాధ్యతలు!
-
Ramayana: నితేష్ తివారీ సినిమా వెనుక మరో సీక్రెట్.. అస్సాం చరిత్రకు ‘రామాయణం’తో సంబంధం ఉందా?
-
Women’s Asia Cup 2026కు భారత జట్టు ప్రకటన.. కెప్టెన్గా హర్మన్ప్రీత్, వైస్ కెప్టెన్గా స్మృతి మందాన..!
ట్రెండింగ్
-
Best Cricketing Brain: ఎంఎస్ ధోనీ కాదు, అతడే బెస్ట్ క్రికెటింగ్ బ్రెయిన్.. ఆ టీమిండియా మాజీ స్టార్ ఎవరంటే?
-
Tata దూకుడు మాములుగా లేదుగా.. Nexon నుంచి ప్రీమియం Avinya X వరకు భారీ ప్లాన్..!
-
India Medal Tally: కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత్ చరిత్ర.. 39 పతకాలతో ఘన ముగింపు.. మెడల్స్ ఫుల్ లిస్ట్ ఇదే!
-
8100mAh భారీ బ్యాటరీ, 108MP కెమెరా వంటి క్రేజీ ఫీచర్లతో Honor X7e Plus (4G) లాంచ్..!
-
Vegetable Cleaning : కూరగాయలను ఉప్పు నీటితో కడుగుతున్నారా.? ఈ విషయాలు తప్పక తెలుసుకోండి.!