Neha Singh Rathore: దేశానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు.. సింగర్పై దేశద్రోహం కేసు
- దేశానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు
- సింగర్ నేహా సింగ్ రాథోడ్పై దేశద్రోహం కేసు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పహల్గామ్ ఉగ్ర దాడి తర్వాత దేశమంతా దు:ఖంలో ఉంటే ఉత్తరప్రదేశ్కు చెందిన జానపద గాయని నేహా సింగ్ రాథోడ్ మాత్రం దేశ సమగ్రతను దెబ్బతీసే విధంగా సోషల్ మీడియాలో రెచ్చగొట్టే పోస్టులు పెట్టింది. 2019లో పుల్వామా ఉగ్ర దాడిని మోడీ ఎన్నికల అస్త్రంగా ఉపయోగించుకున్నారని.. తాజాగా పహల్గామ్ ఉగ్ర దాడి పేరుతో బీహార్లో ఓట్లు అడుగుతున్నారని పోస్టు పెట్టింది. ఈ పోస్టు పాకిస్థానీయులకు అస్త్రంగా మారింది. ఆమె చేసిన పోస్టును పాకిస్థాన్ జర్నలిస్టులు తెగ వైరల్ చేస్తున్నారు. అందరూ రీట్వీట్ చేస్తూ ప్రధాని మోడీని తప్పుగా క్రియేట్ చేస్తున్నారు. భారత్లో సొంత ప్రజలే మోడీ తీరును తప్పుపడుతున్నారంటూ కామెంట్లు చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: Delhi: ప్రధాని మోడీతో రక్షణ మంత్రి రాజ్నాథ్సింగ్ కీలక భేటీ.. ఉత్కంఠ రేపుతున్న చర్చలు
Also Read
- Allahabad High Court: హలాలా, ట్రిపుల్ తలాక్ పేరుతో లైంగిక దోపిడీ.. హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు..
- RSS: భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి.. ఆయోధ్య నిందితులను శిక్షించాలన్న ఆర్ఎస్ఎస్
- Parliament: 20 నుంచి పార్లమెంట్ సమావేశాలు!.. 2 కీలక బిల్లులు ప్రవేశపట్టే అవకాశం
- EPFO: ఉద్యోగులకు అలర్ట్.. క్లెయిమ్ చేయని EPF డబ్బు రూ.9,330 కోట్లు
పహల్గామ్ ఉగ్ర దాడి కేవలం నిఘా, భద్రతా వైఫల్యం అని ఆమె పేర్కొంది. ప్రధాని మోడీ.. రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపగలరు గానీ.. సొంత దేశంలో మాత్రం ఉగ్రదాడిని నివారించలేరని ఆరోపించింది. ఆమె చేసిన వ్యాఖ్యలపై లక్నోలోని హజ్రత్గంజ్ పోలీస్ స్టేషన్లో అభయ్ ప్రతాప్ సింగ్ అనే వ్యక్తి ఫిర్యాదు చేశాడు. ఆమె ఒక మతాన్ని రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యానించిందని ఫిర్యాదు చేశాడు. దీంతో ఆమెపై భారతీయ శిక్షాస్మృతి సెక్షన్ 124ఏలో పేర్కొన్నట్లుగా బీఎన్ఎస్ దేశద్రోహం కేసు నమోదు చేశారు. అలాగే క్రిమినల్ కోడ్ సెక్షన్ 152 కింద దేశ సార్వభౌమత్వం, ఐక్యత, సమగ్రతకు హాని కలిగించినట్లుగా పోలీసులు అభియోగాలు మోపారు.
ఇది కూడా చదవండి: CM Revanth Reddy : కేసీఆర్కు నేను సీఎం అయిన రెండో రోజే గుండె పగిలింది
ఏప్రిల్ 22న పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాక్తో భారత్ సంబంధాలు దెబ్బతిన్నాయి. భారత్ కఠిన నిర్ణయాలు తీసుకుంది. సింధు జలాలు నిలిపివేసింది. అంతేకాకుండా పాకిస్థానీయుల వీసాలను రద్దు చేసింది. అలాగే అటారీ సరిహద్దు మూసివేసింది. తాజాగా పాక్కు సంబంధించిన 16 యూట్యూబ్ ఛానళ్లపై నిషేధం విధించింది. ఇలా ఒక్కొక్కటిగా భారత్ కఠిన నిర్ణయాలు తీసుకుంటోంది. ఇక ఉగ్ర దాడులకు పాల్పడ్డ నిందితుల సమాచారం అందిస్తే రూ.20లక్షల రివార్డ్ ప్రకటించింది. గత మంగళవారం జరిగిన ఉగ్రదాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. పదుల కొద్ది గాయపడ్డారు. మృతుల్లో ఎక్కువగా కొత్తగా పెళ్లైన వారు ఉండడం బాధాకరం.
ఇది కూడా చదవండి: Pahalgam Terror Attack: దాడిని ఖండిస్తూ జమ్మూకాశ్మీర్ అసెంబ్లీ తీర్మానం
తాజావార్తలు
-
RC 17: సుకుమార్ – దేవిశ్రీ కాంబోకి బ్రేక్.. నిజమేనా?
-
Allahabad High Court: హలాలా, ట్రిపుల్ తలాక్ పేరుతో లైంగిక దోపిడీ.. హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు..
-
Home Tips : ఇంట్లోకి తేళ్లు రాకుండా ఉండాలా.? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
14 రోజుల బ్యాటరీ, AMOLED డిస్ప్లేతో HUAWEI Band 11 సిరీస్ భారత్లో లాంచ్..!
-
RSS: భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి.. ఆయోధ్య నిందితులను శిక్షించాలన్న ఆర్ఎస్ఎస్
ట్రెండింగ్
-
IND vs ENG 2nd T20: సంజును తొలగించకుండా, వైభవ్కు అవకాశం ఇవ్వాలంటే.. ఇదొక్కటే మార్గం!
-
IND vs ENG 2nd T20: సంజు అవుట్, వైభవ్ ఇన్.. రెండో టీ20కి భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Vaibhav Sooryavanshi: దయచేసి వైభవ్ను ఆడించండి.. బీసీసీఐకి ఎవరన్నా చెప్పండ్రా బాబు.. దిగ్గజాల కామెంట్స్ వైరల్!
-
RCB అభిమానులకు నథింగ్ సర్ప్రైజ్.. జూలై 7న Nothing Phone (4b) RCB Edition విడుదల
-
Samsung Galaxy A27 5G vs OnePlus Nord 6: ఏ స్మార్ట్ఫోన్ బెస్ట్?