NEET Paper Leak: నీట్ పేపర్ లీక్ దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. పేపర్ లీక్ కావడంతో పరీక్షల్ని రద్దు చేశారు. ఈ లీక్ కేసులో మాస్టర్ మైండ్ను రాజస్థాన్ స్పెషల్ టాస్క్ఫోర్స్ అరెస్ట్ చేసింది. రాజస్థాన్కు చెందిన మనీష్ యాదవ్ ఈ లీక్లో ప్రధాన సూత్రధారి అని తేలింది. ఇతడితో సహా 15 మంది నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు. కెరీర్ కన్సల్టెంట్గా పనిచేస్తున్న మనీష్ ఈ మొత్తం కేసులో కీరోల్ పోషించినట్లు తేలింది.
Read Also: PM Modi: రేపు ఉదయం మోడీ కేబినెట్ భేటీ.. పెట్రో పెంపు తప్పదా?
ముందుగా నాసిక్లో ప్రశ్నాపత్రాన్ని డూప్లికేట్ చేసినట్లు తేలింది. అక్కడ నుంచి హర్యానాకు పంపినట్లు నిర్ధారించారు. హర్యానాలో 5 సెట్లుగా మార్చి రాజస్థాన్, ఉత్తరాఖండ్, కేరళకు పంపినట్లు తేలింది. ఈ నెల 1,2 మధ్య గెస్ పేపర్ పేరుతో వాట్సాప్, టెలిగ్రామ్లో షేర్ చేసినట్లు తేలింది. ఒక్కో విద్యార్థి వద్ద నుంచి రూ. 30,000ల నుంచి రూ. 2 లక్షల వరకు వసూలు చేసినట్లు తేలింది. రాజస్థాన్ సికార్లో పరీక్షకు 42 గంటల ముందే ప్రశ్నాపత్రం లీక్ అయినట్లు అధికారులు భావిస్తు్న్నారు. ఈ పేపర్ లీక్ బయటకు రావడంతో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ముందు విద్యార్థులు, విద్యార్థి సంఘాల నాయకులు, విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన నిర్వహించారు.
