Pending Cases in Courts: దేశంలో దాదాపు 5కోట్ల కేసులు పెండింగ్.. పార్లమెంట్లో కేంద్రం వెల్లడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pending Cases in Courts: భారతదేశంలోని న్యాయస్థానాల్లో దాదాపు 5 కోట్ల కేసులు పెండింగ్లో ఉన్నాయని కేంద్రం వెల్లడించింది. భారతదేశంలోని వివిధ కోర్టులలో పెండింగ్లో ఉన్న కేసులు ఐదు కోట్ల మార్కుకు చేరుకుంటున్నాయని కేంద్ర ప్రభుత్వం తరఫున న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజిజు లోక్సభలో వెల్లడించారు. జులై 1 నాటికి సుప్రీంకోర్టులో 72,062 కేసులు పెండింగ్లో ఉండగా.. జులై 25 నాటికి 25 హైకోర్టుల్లో 59,55,873 కేసులు పెండింగ్లో ఉన్నాయని న్యాయ మంత్రి కిరణ్ రిజిజు లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు. జిల్లా, సబార్డినేట్ కోర్టుల్లో 4.23 కోట్ల కేసులు పెండింగ్లో ఉన్నాయి. అంటే, వివిధ కోర్టుల్లో మొత్తం 4.83 కోట్ల కేసులు పెండింగ్లో ఉన్నాయి.
వివిధ కోర్టుల్లో కేసులు భారీగా పెండింగ్లో ఉండటానికి గల కారణాలను ప్రభుత్వం అంచనా వేసిందా? అని మొత్తం 26 మంది లోక్సభ సభ్యులు అడిగారు. కోర్టుల్లో పెండింగ్లో ఉన్న కేసుల పరిష్కారం న్యాయవ్యవస్థ పరిధిలోనిదని రిజిజు అన్నారు. ఆయా కోర్టులు వివిధ రకాల కేసుల పరిష్కారానికి ఎలాంటి కాలపరిమితి నిర్దేశించబడలేదన్నారు. కోర్టుల్లో కేసుల పరిష్కారంలో ప్రభుత్వానికి ప్రత్యక్ష పాత్ర లేదన్నారు. న్యాయస్థానాలలో కేసులను సకాలంలో పరిష్కరించడం అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది, వీటిలో తగిన సంఖ్యలో న్యాయమూర్తులు, న్యాయాధికారుల లభ్యత, సహాయక కోర్టు సిబ్బంది, భౌతిక మౌలిక సదుపాయాలు, ప్రమేయం ఉన్న వాస్తవాల సంక్లిష్టత, సాక్ష్యాల స్వభావం, బార్ యొక్క సహకారం, దర్యాప్తు సంస్థలు, సాక్షులు, న్యాయవాదులు, నియమాలు, విధానాల సరైన అప్లికేషన్ ఉండాలంటూ ఆయన చెప్పుకొచ్చారు. “కేసుల పరిష్కారంలో జాప్యానికి దారితీసే అనేక అంశాలు ఉన్నాయి. వీటిలో, న్యాయమూర్తుల ఖాళీలు, తరచుగా వాయిదాలు, విచారణ కోసం పర్యవేక్షించడానికి, ట్రాక్ చేయడానికి, బంచ్ కేసులను పర్యవేక్షించడానికి తగిన ఏర్పాట్లు లేకపోవడం వంటివి ఉన్నాయి” అని ఆయన చెప్పారు.
Also Read
- Ketan Agrawal Case: కేతన్ హత్యపై స్పందించిన రాజా రఘువంశీ కుటుంబం.. ఏం డిమాండ్ చేశారంటే..!
- Ketan Agarwal Case: 'పెళ్లి నుంచి తప్పించుకోలేవు'.. కేతన్పై సియా గోయల్ సంచలన ఆరోపణ
- Ketan Agrawal Case: కేతన్ హత్యపై తొలిసారి స్పందించిన సీఎం ఫడ్నవిస్.. ఏమన్నారంటే..!
- Ayodhya Ram Mandir: అయోధ్య రామాలయం వెండి ఇటుకలు మాయమయ్యాయా? సిట్ దర్యాప్తులో సంచలన నిజాలు!
Maharashtra Politics: ఉద్ధవ్కు మరో దెబ్బ.. ఏక్నాథ్ షిండేను కలిసిన థాక్రే సోదరుడి కుమారుడు
జులై 26న లోక్సభలో కుటుంబ న్యాయస్థానాల (సవరణ) బిల్లుపై జరిగిన చర్చకు మంత్రి సమాధానమిస్తూ.. పెండింగ్లో ఉన్న కేసులకు ప్రభుత్వం లేదా న్యాయవ్యవస్థను నిందించడం అన్యాయమన్నారు. ప్రతిరోజూ కోర్టుల డాకెట్లకు కేసులు జోడించబడతాయన్నారు. “ప్రభుత్వం, న్యాయ మంత్రి ఏమి చేస్తున్నారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. నేను బాధగా ఉన్నాను. పెండింగ్లో ఉన్న కేసుల వంటి తీవ్రమైన సమస్యలను లేవనెత్తేటప్పుడు, ప్రజలు ముందుగా వివరాలను తెలుసుకోవాలి” అని రిజిజు అన్నారు. న్యాయస్థానాలపై దాడి చేయడానికి అనుచితమైన పదాలను ఉపయోగించడాన్ని కూడా అతను వ్యతిరేకించాడు. న్యాయమూర్తులు కష్టపడి పనిచేస్తారు.. రోజులో వందలాది కేసులను పరిష్కరించిన న్యాయమూర్తులు ఉన్నారని, వారు ఉదయం 9 నుండి రాత్రి 9 గంటల వరకు పని చేస్తారని ఆయన అన్నారు.
తాజావార్తలు
-
Shreyas Iyer: శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో సరికొత్త శకం.. ఐర్లాండ్తో నేడే భారత్ తొలి టీ20..
-
Petrol Diesel Rates: పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గే ఛాన్స్ ఉందా? సామాన్యులకు గుడ్ న్యూస్ అందబోతోందా!
-
Ketan Agrawal Case: కేతన్ హత్యపై స్పందించిన రాజా రఘువంశీ కుటుంబం.. ఏం డిమాండ్ చేశారంటే..!
-
Poori vs Paratha: పూరీ Vs పరాఠా.. దేనితో ఆరోగ్యానికి ఎక్కువ ప్రమాదం..? తప్పక తెలుసుకోవాల్సిన నిజాలు
-
Ketan Agarwal Case: ‘పెళ్లి నుంచి తప్పించుకోలేవు’.. కేతన్పై సియా గోయల్ సంచలన ఆరోపణ
ట్రెండింగ్
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!
-
Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!