UP: ఆ కారణం చేత నవరాత్రి జరుపుకోలేదని మనస్తాపంతో వివాహిత ఆత్మహత్య
- ఉత్తరప్రదేశ్లోని ఝాన్సీలో తీవ్ర విషాదం
- నవరాత్రి జరుపుకోలేదని వివాహిత ఆత్మహత్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉత్తరప్రదేశ్లోని ఝాన్సీలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. పీరియడ్స్ కారణంగా నవరాత్రి సమయంలో ఉపవాసం ఉండి.. దుర్గాదేవిని పూజించలేకపోయానన్న మనస్తాపంతో 36 ఏళ్ల ప్రియాంషా సోని విషం తీసుకుని ఆత్మహత్య చేసుకుంది. స్థానికంగా ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది.
తొమ్మిది రోజుల పాటు నవరాత్రి వేడుకలు జరుగుతాయి. ఈ వేడుకల కోసం ఏడాది నుంచే సోని సిద్ధపడుతోంది. మార్చి 30న నవరాత్రి మొదటి రోజు ప్రారంభమైంది. ముందు రోజు భర్త ముఖేష్ చేత.. పూజకు కావాల్సిన వస్తువులన్నీ తెప్పించింది. పువ్వులు, పండ్లు, స్వీట్లు, దీపాలు, ధాన్యాలు తీసుకొచ్చాడు. దేవతా ప్రతిమను కూడా తీసుకొచ్చాడు. పూజకు కావాల్సిన అన్ని సిద్ధం చేసుకుని వేడుకకు సిద్ధపడుతున్న సమయంలో కరెక్ట్గా సోనికి పీరియడ్స్ ప్రారంభమైంది. ఒక్కసారిగా ఆమె ఆశలన్నీ ఆవిరైపోయాయి. రుతుక్రమం సమయంలో పూజ చేయడం కానీ… ప్రార్థన చేయడం కానీ.. ఉపవాసం ఉండకూడదని సిద్ధాంతం ఉంది. దీంతో ఏడాది నుంచి ఎన్నో ఆశలు పెట్టుకుని పూజకు సిద్ధపడుతున్న సమయంలో ఋతుస్రావం ప్రారంభం కావడంతో అపవిత్రంగా భావించింది. ఇరుగుపొరుగు వారు కూడా అదే సలహా ఇచ్చారు.
Also Read
- Indian Railways logo: ఇండియన్ రైల్వేస్ లోగోలో భారీ మార్పు.. ఇకపై 18 నక్షత్రాలు..ఈ మార్పుకు కారణం ఏమిటి?
- Uttar Pradesh: యూపీలో ప్రకృతి ప్రకోపం.. పిడుగులు, వానాకాలం బీభత్సానికి 111 మంది బలి
- Delhi Work From Home: ప్రభుత్వం కీలక నిర్ణయం.. రెండు రోజులు వర్క్ ఫ్రమ్ హోమ్.. పొదుపు చర్యల జాబితా విడుదల
- Petrol, Diesel Prices Hiked: వాహనదారులకు బిగ్ షాక్.. దేశవ్యాప్తంగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. ఎంతంటే?
అప్పటికీ భర్త ముఖేష్.. ఆమెను సముదాయించి.. నచ్చజెప్పే ప్రయత్నం చేశాడు. పీరియడ్స్ అనేది సహజమైన ప్రక్రియ అని.. దాని గురించి పెద్దగా పట్టించుకోవద్దని కూడా సలహా ఇచ్చాడు. అయినా కూడా సోని జీర్ణించుకోలేకపోయింది. చాలా ఒత్తిడికి.. ఆందోళనకు గురైంది. తీవ్ర మనస్తాపం చెంది. భర్త పనికి వెళ్లగానే సోని చాలా సేపు ఏడ్చింది. దీంతో భర్త తిరిగి ఇంటికి వచ్చి చాలా ఓదార్చాడు. బాగానే ఉంది అనుకుని తిరిగి పనికి వెళ్లగానే.. సోని విషం సేవించింది. స్థానికులు ఆస్పత్రికి తరలించారు. తాను తప్పు చేశానని.. విషం సేవించినట్లుగా చెప్పింది. వైద్యులు పరీక్షించి.. చికిత్స తర్వాత డిశ్చార్జ్ చేసి ఇంటికి పంపించారు. స్థలం మార్పు చేస్తే.. పరిస్థితి కుదిటపడుతుందని భావించిన ముఖేష్.. సోనిని ఆమె తల్లిదండ్రుల ఇంటికి తీసుకెళ్లాడు. ఇంతలోనే మరోసారి ఆమె పరిస్థితి విషమించడం మరోసారి ఆస్పత్రికి తీసుకెళ్లాడు. కానీ ఈసారి మాత్రం 15-20 నిమిషాల్లోనే ఆమె కన్నుమూసింది. దీంతో ఒక్కసారిగా విషాదఛాయలు అలుముకున్నాయి. బంధువులంతా కన్నీరుమున్నీరుగా విలపించారు. సోనికి ప్రస్తుతం 3 సంవత్సరాల జాన్వి, 2 సంవత్సరాల మాన్వి అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
- Tags
- Navratri
- periods
- suicide
- UP
- woman dies
తాజావార్తలు
-
Tabu: హీరోయిన్ల ఏజ్ షేమింగ్పై టబు ఓపెన్ కామెంట్స్ వైరల్!
-
Indian Railways logo: ఇండియన్ రైల్వేస్ లోగోలో భారీ మార్పు.. ఇకపై 18 నక్షత్రాలు..ఈ మార్పుకు కారణం ఏమిటి?
-
Uttar Pradesh: యూపీలో ప్రకృతి ప్రకోపం.. పిడుగులు, వానాకాలం బీభత్సానికి 111 మంది బలి
-
Peddi: ‘పెద్ది’ రిలీజ్కు భారీ షాక్..
-
Delhi Work From Home: ప్రభుత్వం కీలక నిర్ణయం.. రెండు రోజులు వర్క్ ఫ్రమ్ హోమ్.. పొదుపు చర్యల జాబితా విడుదల
ట్రెండింగ్
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!