Agnipath: అగ్నివీరుల భవిష్యత్ భద్రం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశవ్యాప్తంగా జరుగుతున్న అగ్నిపథ్ నిరసనల నేపథ్యంలో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ స్పందించారు. అగ్నివీరుల భవిష్యత్పై ఎలాంటి ఆందోళనలు అవసరం లేదన్నారు. భవిష్యత్లో మనం కనిపించని శత్రువులపై యుద్ధాలు చేయాల్సిన అవసరం వస్తుందని.. ఈ నేపథ్యంలో దేశానికి యువత సేవలు అందించాల్సిన అవసరం ఉందన్నారు. అగ్నిపథ్ను సమర్థించిన అజిత్ ధోవల్.. యువ, సుశిక్షిత సేనలు దేశానికి అవసరమన్నారు. అగ్నిపథ్ను పథకాన్ని మరో కోణంలో చూడాలన్నారు. అగ్నిపథ్ అనేది 2014లో ప్రధాని నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చినప్పుడు, భారతదేశాన్ని ఎలా సురక్షితంగా మార్చాలనేది ఆయన ప్రధాన ప్రాధాన్యతలలో ఒకటని ఆయన వెల్లడించారు.
ఈ రెజిమెంటల్ వ్యవస్థ యధావిధిగా కొనసాగుతుందని ఆయన వెల్లడించారు. ఈ పథకాన్ని వ్యతిరేకిస్తూ జరగుతున్న హింసాత్మక ఆందోళనలపై అజిత్ ధోవల్ ఆందోళన వ్యక్తం చేశారు. విధ్వంసం, హింసాకాండను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని ధోవల్ హెచ్చరించారు, అగ్నిపథ్ నిరసనల వెనుక కొందరి స్వార్థ ప్రయోజనాలు దాగి ఉన్నాయని.. సమాజంలో చిచ్చు పెట్టాలనే ఉద్దేశంతో కొందరు ఈ స్కీంను వ్యతిరేకిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నిరసనల్లో పాల్గొన్న నిందితులను అధికారులు గుర్తించారని.. విచారణ జరుగుతుందని ఆయన పేర్కొన్నారు.
Also Read
- Bengal: రాజకీయ కురువృద్ధుడ్ని ప్రతిపక్ష నేతగా నియమించిన టీఎంసీ
- PM Modi: అప్పుడు బీఆర్ఎస్.. ఇప్పుడు కాంగ్రెస్ పాలనతో విసిగిపోయారు.. హైదరాబాద్ టూర్పై మోడీ ట్వీట్
- Agni Missile: అగ్ని మిస్సైల్ మరో స్థాయికి.. MIRV క్షిపణి పరీక్ష విజయవంతం
- Mamata Banerjee: "నేనూ న్యాయవాదినే.. ఎలా పోరాడాలో నాకు తెలుసు".. బీజేపీపై యుద్ధం ప్రకటించిన దీదీ
తాజావార్తలు
-
GT vs RR : గుజరాత్ టైటాన్స్ ఘనవిజయం.. పాయింట్ల పట్టికలో టాప్కు..!
-
Bengal: రాజకీయ కురువృద్ధుడ్ని ప్రతిపక్ష నేతగా నియమించిన టీఎంసీ
-
Suriya: సూర్య ఫ్యాన్స్కు గుడ్ న్యూస్.. ‘విశ్వనాథ్ & సన్స్’ రిలీజ్ అప్పుడే!
-
PM Modi: అప్పుడు బీఆర్ఎస్.. ఇప్పుడు కాంగ్రెస్ పాలనతో విసిగిపోయారు.. హైదరాబాద్ టూర్పై మోడీ ట్వీట్
-
Agni Missile: అగ్ని మిస్సైల్ మరో స్థాయికి.. MIRV క్షిపణి పరీక్ష విజయవంతం