Maharashtra: నాసిక్లో ఘోరం.. బావిలో పడ్డ కారు.. ఒకే కుటుంబానికి చెందిన 9 మంది మృతి
- నాసిక్లో ఘోరం
- బావిలో పడ్డ కారు
- ఒకే కుటుంబానికి చెందిన 9 మంది మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహారాష్ట్రలోని నాసిక్లో ఘోర విషాదం చోటుచేసుకుంది. శుభకార్యానికి వెళ్లి తిరిగి వస్తుండగా కారు బావిలో పడిపోయింది. దీంతో ఒకే కుటుంబానికి చెందిన 9 మంది దుర్మరణం చెందారు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనాస్థలికి చేరుకుని కారును బయటకు తీశారు. పెద్ద ఎత్తున స్థానికులు గుమిగూడారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
ఇది కూడా చదవండి: US-Iran War: ‘‘మనం యుద్ధంలో ఉన్నాం’’.. పైలట్ గల్లంతుపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు
Also Read
- National Mourning: ఖతార్ మాజీ ఎమిర్ కన్నుమూత.. భారత్ కీలక నిర్ణయం..
- Success story: గ్రామీణ నేపథ్యం, IIT చదువు లేదు.. కానీ, రూ. 2.6 కోట్ల ప్యాకేజీ సాధించిన కుర్రాడు..
- Karnataka: ‘‘చిల్లర లేకపోతే దిగిపో..’’ మంత్రికే షాక్ ఇచ్చిన బస్ కండక్టర్..
- Monsoon: రైతులకు గుడ్ న్యూస్.. జోరందుకోనున్న రుతుపవనాలు.. జూలై 18-25 మధ్య భారీ వర్ష సూచన
నాసిక్కు 40 కిలోమీటర్ల దూరంలోని దిండోరి తాలూకాలోని శివాజీనగర్ ప్రాంతంలో శుక్రవారం రాత్రి సుమారు 11:30 గంటలకు ఈ ఘోర ప్రమాదం జరిగింది. మారుతి XL6 కారు బావిలో పడిపోవడంతో ఇండోర్ గ్రామానికి చెందిన దర్గోడే కుటుంబానికి చెందిన తొమ్మిది మంది దుర్మరణం చెందారు. దిండోరిలోని శివాజీనగర్లో ఉన్న రాజే బాంకెట్ హాల్లో వాడ్జే క్లాసెస్ వార్షికోత్సవాన్ని నిర్వహించారు. ఇండోర్ గ్రామానికి చెందిన సునీల్ దత్తాత్రేయ దర్గోడే ఈ కార్యక్రమానికి తన కుటుంబంతో వచ్చారు. కార్యక్రమం అనంతరం దర్గోడే కుటుంబం దిండోరి నుంచి కారులో ఇంటికి తిరిగి వెళ్తుండగా డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో కారు రోడ్డు పక్కన ఉన్న బావిలో పడిపోయింది.
ప్రమాదం గురించి సమాచారం అందిన వెంటనే పరిపాలన యంత్రాంగం, పోలీసులు, సామాజిక కార్యకర్తలు, నగర పంచాయతీ అగ్నిమాపక దళం, పోలీసులు, విపత్తు నిర్వహణ నిర్వహణ బృందాలు సంఘటనా స్థలానికి చేరుకుని తక్షణమే సహాయక చర్యలు ప్రారంభించాయి. బావి పూర్తిగా నీటితో నిండి ఉండటంతో సహాయక చర్యలకు ఆటంకాలు ఏర్పడ్డాయి. అర్ధరాత్రి రెండు క్రేన్ల సహాయంతో కారును బయటకు తీశారు.
కారులో నుంచి తొమ్మిది మృతదేహాలను వెలికితీశారు. కారు నుంచి దిగి బావిలో మునిగిపోయిన బాలిక మృతదేహం కోసం ప్రత్యేక గాలింపు చర్యలు చేపట్టారు. మృతులు సునీల్ దత్తాత్రేయ దర్గోడే (34), అతని భార్య రేష్మా సునీల్ దర్గోడే (30), కుమార్తె రాఖీ అలియాస్ గుణ్వంతి (10), మేనకోడలు సమృద్ధి రాజేష్ దర్గోడే (7) కూడా మరణించారు. దిండోరి పోలీసులు ప్రమాదంగా కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు ప్రారంభించారు.
नाशिकच्या दिंडोरीमध्ये विहिरीत कार कोसळून झालेल्या दुर्दैवी अपघातात एकाच कुटुंबातील ९ जणांचा मृत्यू झाल्याचं वृत्त हे अत्यंत दुःखद आणि वेदनादायी आहे. त्यांच्या कुटुंबावर कोसळलेल्या या डोंगराएवढ्या दुःखात आम्ही सर्वजण सहभागी आहोत. या दुःखातून सावरण्याची शक्ती त्यांच्या कुटुंबाला…
— Rohit Pawar (@RRPSpeaks) April 4, 2026
తాజావార్తలు
-
Bangkok Pub Fire: అర్థరాత్రి పబ్లో మంటల బీభత్సం.. 27 మంది మృతి (వీడియో)
-
Kitchen Hacks : ఉల్లిపాయలు కోసేటప్పుడు కన్నీళ్లకు బైబై.. కళ్లమంటను తగ్గించే సింపుల్ చిట్కాలు.!
-
Congress: తుంగతుర్తి కాంగ్రెస్ పంచాయితీకి తెర.. జగ్గారెడ్డితో ఎమ్మెల్యే మందుల సామెల్ భేటీ.!
-
National Mourning: ఖతార్ మాజీ ఎమిర్ కన్నుమూత.. భారత్ కీలక నిర్ణయం..
-
Varanasi: రూమరా? నిజమా? రాజమౌళి – మహేష్ బాబు సినిమాతో ఎన్టీఆర్ కొడుకు ఎంట్రీ!
ట్రెండింగ్
-
Health Tips : వర్షాకాలంలో అల్లం-పసుపు టీ ఎందుకు తాగాలి.?
-
Team India Coach: టీమిండియా కోచింగ్ స్టాఫ్ నుంచి ఒకరు అవుట్.. నెక్స్ట్ ఎవరు?.. భారీ ప్రక్షాళన తప్పదా?
-
Shreyas Iyer: ఆ తప్పిదాలే మా కొంపముంచాయి.. చాలా చెత్తగా ఆడాం.. ఓటమిని నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్!
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..