Maharashtra: నాసిక్లో ఘోరం.. బావిలో పడ్డ కారు.. ఒకే కుటుంబానికి చెందిన 9 మంది మృతి
- నాసిక్లో ఘోరం
- బావిలో పడ్డ కారు
- ఒకే కుటుంబానికి చెందిన 9 మంది మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహారాష్ట్రలోని నాసిక్లో ఘోర విషాదం చోటుచేసుకుంది. శుభకార్యానికి వెళ్లి తిరిగి వస్తుండగా కారు బావిలో పడిపోయింది. దీంతో ఒకే కుటుంబానికి చెందిన 9 మంది దుర్మరణం చెందారు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనాస్థలికి చేరుకుని కారును బయటకు తీశారు. పెద్ద ఎత్తున స్థానికులు గుమిగూడారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
ఇది కూడా చదవండి: US-Iran War: ‘‘మనం యుద్ధంలో ఉన్నాం’’.. పైలట్ గల్లంతుపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు
Also Read
- Modi-Putin: మోడీ, రాష్ట్రపతికి పుతిన్ సందేశం.. యూపీ తుఫాన్ మృతులకు సంతాపం
- PM Modi: రష్యా, ఇరాన్ విదేశాంగ మంత్రులతో మోడీ భేటీ.. ఇంధన సంక్షోభంపై చర్చ
- Pakistan: ఢిల్లీని టార్గెట్ చేసే మిస్సైల్ను పరీక్షించిన పాకిస్తాన్..
- Delhi: 2 రోజులు వర్క్ ఫ్రమ్ హోమ్.. విదేశీ టూర్లు రద్దు.. పొదుపు మంత్రం ప్రకటించిన ఢిల్లీ సర్కార్
నాసిక్కు 40 కిలోమీటర్ల దూరంలోని దిండోరి తాలూకాలోని శివాజీనగర్ ప్రాంతంలో శుక్రవారం రాత్రి సుమారు 11:30 గంటలకు ఈ ఘోర ప్రమాదం జరిగింది. మారుతి XL6 కారు బావిలో పడిపోవడంతో ఇండోర్ గ్రామానికి చెందిన దర్గోడే కుటుంబానికి చెందిన తొమ్మిది మంది దుర్మరణం చెందారు. దిండోరిలోని శివాజీనగర్లో ఉన్న రాజే బాంకెట్ హాల్లో వాడ్జే క్లాసెస్ వార్షికోత్సవాన్ని నిర్వహించారు. ఇండోర్ గ్రామానికి చెందిన సునీల్ దత్తాత్రేయ దర్గోడే ఈ కార్యక్రమానికి తన కుటుంబంతో వచ్చారు. కార్యక్రమం అనంతరం దర్గోడే కుటుంబం దిండోరి నుంచి కారులో ఇంటికి తిరిగి వెళ్తుండగా డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో కారు రోడ్డు పక్కన ఉన్న బావిలో పడిపోయింది.
ప్రమాదం గురించి సమాచారం అందిన వెంటనే పరిపాలన యంత్రాంగం, పోలీసులు, సామాజిక కార్యకర్తలు, నగర పంచాయతీ అగ్నిమాపక దళం, పోలీసులు, విపత్తు నిర్వహణ నిర్వహణ బృందాలు సంఘటనా స్థలానికి చేరుకుని తక్షణమే సహాయక చర్యలు ప్రారంభించాయి. బావి పూర్తిగా నీటితో నిండి ఉండటంతో సహాయక చర్యలకు ఆటంకాలు ఏర్పడ్డాయి. అర్ధరాత్రి రెండు క్రేన్ల సహాయంతో కారును బయటకు తీశారు.
కారులో నుంచి తొమ్మిది మృతదేహాలను వెలికితీశారు. కారు నుంచి దిగి బావిలో మునిగిపోయిన బాలిక మృతదేహం కోసం ప్రత్యేక గాలింపు చర్యలు చేపట్టారు. మృతులు సునీల్ దత్తాత్రేయ దర్గోడే (34), అతని భార్య రేష్మా సునీల్ దర్గోడే (30), కుమార్తె రాఖీ అలియాస్ గుణ్వంతి (10), మేనకోడలు సమృద్ధి రాజేష్ దర్గోడే (7) కూడా మరణించారు. దిండోరి పోలీసులు ప్రమాదంగా కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు ప్రారంభించారు.
नाशिकच्या दिंडोरीमध्ये विहिरीत कार कोसळून झालेल्या दुर्दैवी अपघातात एकाच कुटुंबातील ९ जणांचा मृत्यू झाल्याचं वृत्त हे अत्यंत दुःखद आणि वेदनादायी आहे. त्यांच्या कुटुंबावर कोसळलेल्या या डोंगराएवढ्या दुःखात आम्ही सर्वजण सहभागी आहोत. या दुःखातून सावरण्याची शक्ती त्यांच्या कुटुंबाला…
— Rohit Pawar (@RRPSpeaks) April 4, 2026
తాజావార్తలు
-
Trigun: ప్రధాని మాటే మా సినిమాకు బలం.. ‘మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్’ టీమ్!
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
Marksheet Cake: ముంబై టు సోషల్ మీడియా.. నెట్టింట వైరల్ అవుతున్న ‘మార్క్షీట్’ సెలబ్రేషన్!
-
LayOffs: మరో దిగ్గజ కంపెనీలో భారీగా లే ఆఫ్స్.. 4000 మంది ఉద్యోగుల తొలగింపు..
-
UAE-Iran: యూఏఈలో నెతన్యాహూ పర్యటన.. ఇరాన్ తీవ్ర ఆగ్రహం..
ట్రెండింగ్
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?