US-Iran War: ‘‘మనం యుద్ధంలో ఉన్నాం’’.. పైలట్ గల్లంతుపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు
- ‘‘మనం యుద్ధంలో ఉన్నాం’’
- పైలట్ గల్లంతుపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు
- తప్పిపోయిన పైలట్ కోసం అమెరికా గాలింపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మనం యుద్ధంలో ఉన్నామన్న సంగతి గుర్తుంచుకోవాలని అధ్యక్షుడు ట్రంప్ సూచించారు. ప్రస్తుతం ఇరాన్.. అమెరికా యుద్ధ విమానాలు టార్గెట్ చేసుకుంది. నిన్న ఇరాన్ గగనతలంలో అమెరికా ఎఫ్-15ను కూల్చేసింది. అయితే ఒకరు సేఫ్గా బయటపడగా.. ఇంకొకరి ఆచూకీ గల్లంతైంది. ఈ నేపథ్యంలో ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు.
ఇది కూడా చదవండి: Iran-US War: పశ్చిమాసియాలో యుద్ధం తీవ్రం.. హార్ముజ్ దగ్గర కూలిన మరో అమెరికా యుద్ధ విమానం
Also Read
- Pakistan: యూనిఫాం విడిచి, రాజకీయాల్లోకి రా.. పాక్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్కు సవాల్..
- Trump: ఇరాన్పై భీకర దాడులకు ప్రణాళిక.. సిచ్యుయేషన్ రూమ్లో ట్రంప్ ఎమర్జెన్సీ మీటింగ్
- Trump-Iran: ట్రంప్ సంచలన ప్రకటన.. హార్ముజ్ కార్గో ఫీజు రద్దు.. ఇరాన్ నౌకలపై దిగ్బంధం అమలు
- StepX Neo: ప్రపంచంలోనే తొలి ఐఏ స్టార్మ్ఫోన్ వచ్చేసింది.. చిటికెలో అన్ని పనులు ఫినిష్!
ఇది యుద్ధమని.. మన యుద్ధంలో ఉన్న సంగతి మరిచిపోవద్దని వ్యాఖ్యానించారు. ఇది ఇరాన్తో జరుగుతున్న చర్చలపై ఎలాంటి ప్రభావం ఉండదని తెలిపారు. ప్రస్తుతం ఇరాన్ గగనతలంలో కూల్చివేయబడిన ఎఫ్-15ఈ స్ట్రైక్ ఈగుల్ యుద్ధ విమానం నుంచి బయటకు దూకిన సిబ్బందిలో ఒకరి కోసం అమెరికా, ఇజ్రాయెల్ దళాలు తీవ్రంగా గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయి. అయితే ఈ ఆపరేషన్కు సంబంధించిన వివరాలను వెల్లడించేందుకు ట్రంప్ నిరాకరించారు. ఇది సున్నితమైన సైనిక చర్య అని.. మీడియా దీనిపై అతిగా ప్రచారం చేస్తోందని ధ్వజమెత్తారు.
ఇదిలా ఉండగా ఇరాన్లోని హార్ముజ్ జలసంధి దగ్గర కూలిపోయిన మరో అమెరికా యుద్ధ విమానం నుంచి పైలట్ను సురక్షితంగా రక్షించినట్లు అమెరికా వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం అతడు చికిత్స పొందుతున్నట్లు సమాచారం.
ఇది కూడా చదవండి: Kamal Haasan: ఎన్నికల వేళ కమల్హాసన్కు చేదు అనుభవం
ఇరాన్ విడుదల చేసిన చిత్రాలను విశ్లేషించిన అమెరికా మీడియా సంస్థలు.. అవి ఎఫ్-15 విమాన శకలాలేనని గుర్తించాయి. ఖుజెస్తాన్ ప్రావిన్స్ ప్రాంతంలో గాలింపు చర్యలు కొనసాగుతున్నట్లు సమాచారం. ప్రస్తుత ఘర్షణలో అమెరికా యుద్ధ విమానం కూల్చివేయబడటం ఇదే మొదటిసారి కావడం గమనార్హం. ఇదే సమయంలో యుద్ధ చర్యలతో పాటు ఇరాన్తో చర్చలు కూడా కొనసాగుతున్నప్పటికీ.. టెహ్రాన్ చర్చలకు దూరంగా ఉండటంతో శాంతి ప్రయత్నాలు నిలిచిపోయినట్లు తెలుస్తోంది. దీంతో పశ్చిమాసియాలో పరిస్థితులు రోజురోజుకు ఉద్రిక్తంగా మారుతున్నాయి.
ఇది కూడా చదవండి: Earthquake: ఢిల్లీలో భూకంపం.. ప్రాణ భయంతో వీధుల్లోకి పరుగులు పెట్టిన జనాలు..
తాజావార్తలు
-
IRCTC: రైల్వే ప్రయాణికులకు గుడ్న్యూస్.. ఇక వేగంగా తత్కాల్!
-
Mudragada Padmanabham: ముద్రగడ పాడె మోసిన వైఎస్ జగన్.. అంత్యక్రియల్లో ఉద్రిక్తత
-
World’s First Motorcycle: ప్రపంచంలో మొట్టమొదటి బైక్ను ఎవరు కనిపెట్టారు? షాకింగ్ హిస్టరీ ఇదే!
-
PM Modi: దేశ చరిత్రలో మరో కీలక ఘట్టం.. తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించనున్న మోడీ
-
TTD Donations: నిబంధనల మార్పు ఎఫెక్ట్.. టీటీడీకి ఒక్కరోజే రూ.97 కోట్ల విరాళాలు
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!