NTV Telugu Site icon

ప్రధాని మోదీ హ్యాట్రిక్.. వరుసగా మూడో ఏడాది నంబర్‌వన్

ప్రధాని మోదీ వరుసగా మూడో ఏడాది కూడా ప్రపంచ నంబర్ వన్ నేతగా నిలిచారు. మార్నింగ్ కన్సల్ట్ అనే అమెరికా సంస్థ నిర్వహించిన సర్వేలో ప్రపంచ దేశాధినేతల్లో అత్యంత పాపులారిటీ ఉన్న నేతగా మోదీ నిలిచారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ను అధిగమించి మరోసారి మోదీ టాప్ ప్లేస్ కొట్టేశారు. సర్వేలో మొత్తం 72 శాతం మంది మోదీకి పట్టం కట్టారు. ఈ జాబితాలో మోదీ తర్వాతి స్థానంలో మెక్సికో అధ్యక్షుడు లోపెజ్ ఓబ్రడార్ ఉన్నారు. ఆయనకు 64 శాతం మంది మద్దతు ప్రకటించారు. 57 శాతం మంది ఆమోదంతో ఇటలీ ప్రధాని మారియో ద్రాగ్చి మూడో ర్యాంకులో నిలిచారు

Read Also: వెరైటీగా వెడ్డింగ్ రిసెప్షన్.. ఆసియాలోనే తొలిసారి

అటు జపాన్ ప్రధాని నాలుగో స్థానంలో ఉన్నారు. జపాన్ ప్రధాని ఫ్యూమియో కిషిదాకు 47 శాతం మంది మద్దతు ప్రకటించారు. ఐదో స్థానంలో జర్మనీ చాన్స్ లర్ ఒలాఫ్ షూల్జ్ (42%) నిలిచారు. బైడెన్ ఆరో స్థానంలో నిలవడం గమనార్హం. ఆయనకు కేవలం 41 శాతం మందే ఓటేశారు. దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ జే ఇన్, ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్, కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడూలకూ 41 శాతం మందే మద్దతు తెలపడంతో.. బైడెన్‌తో పాటు సంయుక్తంగా ఆరో స్థానాన్ని పంచుకున్నారు. 37 శాతం ఓట్లతో స్పెయిన్ ప్రధాని పెడ్రో శాంచెజ్ ఏడో స్థానం సంపాదించారు. 36 శాతం ఓట్లతో బ్రెజిల్ అధ్యక్షుడు జయర్ బోల్సోనారో 8వ ర్యాంకు, 35 శాతం ఓట్లతో ఫ్రాన్స్ ప్రధాని ఇమ్మాన్యుయేల్ మెక్రాన్ 9వ ర్యాంకు, 30 శాతం మంది ఆమోదంతో బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ 10వ ర్యాంకు సాధించారు.