Karnataka: మైసూర్ పబ్లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి.. పలువురికి సీరియస్
- మైసూర్ పబ్లో ఘోర అగ్నిప్రమాదం
- ఇద్దరు మృతి.. పలువురికి సీరియస్
- ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కర్ణాటకలోని మైసూరులో పబ్లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. రెస్టోపబ్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా.. యజమానితో సహా ఆరుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. మృతులు 26 ఏళ్ల సాహిన్ (డార్జిలింగ్), 24 ఏళ్ల ప్రకాశ్ (నేపాల్)గా గుర్తించారు. ప్రమాద సమయంలో పబ్లో ఉన్న వీరు మంటల్లో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు.
అగ్నిప్రమాదంలో గాయపడిన వారిలో వినియోగదారులు సోను, రమేశ్, మహదేవ్ ప్రసాద్, ప్రజ్వల్, అవినాష్తో పాటు పబ్ యజమాని ప్రీతమ్ పుమీత్ ఉన్నారు. వీరిని వెంటనే సమీప ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అయితే ప్రమాదం సంభవించే సమయానికి పబ్లో పలువురు ఉండటంతో కొంతసేపు భయాందోళనలు నెలకొన్నాయి. ఈ అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. షార్ట్సర్క్యూట్ లేదా ఇతర కారణాల వల్ల మంటలు చెలరేగి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. ఘటనపై పోలీసులు, అగ్నిమాపక శాఖ అధికారులు సంయుక్తంగా దర్యాప్తు చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించగా, ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు వెలుగులోకి రావాల్సి ఉంది.
Also Read
- Tamil Nadu CM Vijay: సీఎం విజయ్ భారీ ప్యాకేజీ.. ఎమ్మెల్యేలకు కొత్త కార్లు, రూ.1 లక్ష భత్యం, రూ.25 లక్షల ఆరోగ్య బీమా
- Khandwa Stray Dog Menace: ‘డాగీ బ్రదర్’ వినూత్న నిరసన.. కుక్క వేషధారణలో కలెక్టరేట్కు.. అసలు కారణం ఇదే! (వీడియో)
- Notifications Cancelled: సంచలన నిర్ణయం తీసుకున్న జార్ఖండ్ ప్రభుత్వం.. 44 నియామక పరీక్షలు రద్దు..
- Punjab Politics: ఆప్పై బీజేపీ డెడ్లీ స్కెచ్.. కేంబ్రిడ్జ్ సైంటిస్ట్ చుట్టూ పంజాబ్ రాజకీయం.. ఎవరీ సందీప్ పాఠక్?
ప్రమాదం జరిగిన సమయంలో బార్లో 25 మందికి పైగా ఉన్నారని వర్గాలు తెలిపాయి. దట్టమైన పొగ భవనం అంతటా వేగంగా వ్యాపించడంతో చాలా మంది అందులో చిక్కుకుపోయారు. అగ్నిమాపక, అత్యవసర సేవల సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. అగ్నిమాపక దళం మండుతున్న భవనం నుంచి ఏడుగురిని విజయవంతంగా రక్షించింది. దట్టమైన పొగ కారణంగా దృశ్యమానత తగ్గి, బయటకు వెళ్లే మార్గాలు మూసుకుపోవడంతో లోపల ఉన్నవారిలో భయాందోళనలు నెలకొన్నాయని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. తమను తాము కాపాడుకునే తీవ్ర ప్రయత్నంలో, కొందరు నివాసితులు భవనం పై అంతస్తు నుంచి దూకారని, దీని ఫలితంగా అదనపు గాయాలు అయ్యాయని సమాచారం.
తాజావార్తలు
-
Nandamuri Mokshagna : వశిష్ఠ డైరెక్షన్లో నందమూరి సింబా మోక్షజ్ఞ సినిమా ఫిక్స్?
-
Rohit Sharma-Team India: అగార్కర్తో విభేదాలు.. గంభీర్పై అసంతృప్తి.. టీమిండియాలో లుకలుకలు?
-
Jr NTR: జూనియర్ ఎన్టీఆర్ భావోద్వేగ పోస్ట్… పెంపుడు కుక్క బఘీరాకు కన్నీటి వీడ్కోలు
-
Green Chillies at Home: మార్కెట్ మిరపకాయలకు బై.. బై.. ఇంటి కుండీలోనే తాజా పచ్చిమిరపకాయలు పెంచండి ఇలా.!
-
Tamil Nadu CM Vijay: సీఎం విజయ్ భారీ ప్యాకేజీ.. ఎమ్మెల్యేలకు కొత్త కార్లు, రూ.1 లక్ష భత్యం, రూ.25 లక్షల ఆరోగ్య బీమా
ట్రెండింగ్
-
కొత్త కలర్స్, TFT డిస్ప్లే, నావిగేషన్తో Yamaha 125cc 2026 మోడల్స్ స్కూటర్లలో కీలక అప్డేట్స్..!
-
గూర్ఖా రెజిమెంట్కు నివాళిగా కొత్త Royal Enfield Classic 350 Gorkha ఎడిషన్ విడుదల.. ధర, ఫీచర్లు ఇవే!
-
Vijaysai Reddy: కొత్త రాజకీయ పార్టీ పెడుతున్నా.. త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తా!
-
India All-Time Test XI: భారత్ ఆల్టైమ్ బెస్ట్ టెస్టు ఎలెవన్.. కెప్టెన్గా కింగ్.. ధోనీ, జడేజాలకు షాక్!
-
9,100mAh బ్యాటరీ, 2K 144Hz డిస్ప్లే, Dimensity 9500Mతో iQOO Neo11 Ultra లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!