Devendra Fadnavis: నెహ్రూ, కాంగ్రెస్ ఎన్నడూ శివాజీ మహారాజ్ని గౌరవించలేదు..
- శివాజీ విగ్రహం చుట్టూ మహారాష్ట్ర రాజకీయాలు..
- సింధుదుర్గ్లో కూలిపోయిన శివాజీ మహారాజ్ విగ్రహం..
- నిరసనగా ఈ రోజు కాంగ్రెస్ కూటమి నిరసన..
- కాంగ్రెస్..నెహ్రూ శివాజీని ఎన్నడూ గౌరవించలేదన్న ఫడ్నవీస్..
- ఈ అంశంపై రాజకీయాలు మానుకోవాలన్న డిప్యూటీ సీఎం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Devendra Fadnavis: మహారాష్ట్ర రాజకీయాలు ప్రస్తుతం శివాజీ మహారాజ్ విగ్రహం చుట్టూ తిరుగుతున్నాయి. ఇటీవల సింధుదుర్గ్ జిల్లాలో శివాజీ విగ్రహం కూలిపోవడంపై ఏక్నాథ్ షిండే-బీజేపీ-ఎన్సీపీ(అజిత్ పవార్)ల సర్కార్ ‘మహాయుతి’పై విపక్ష కూటమి మహావికాస్ అఘాడీ( కాంగ్రెస్- ఉద్ధవ్ ఠాక్రే- ఎన్సీపీ శరద్ పవార్)ల కూటమి విరుచుకుపడుతోంది. ఈ రోజు ఎంవీఏ కూటమి ఆందోళనలకు పిలుపునిచ్చింది. విగ్రహం కూలిపోవడంపై ప్రభుత్వాన్ని నిందిస్తోంది.
ఇదిలా ఉంటే, ప్రతిపక్ష పార్టీల రాజకీయాలపై డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ కానీ ఎంవీఏ నాయకులు ఎన్నడూ శివాజీ మహారాజ్ని గౌరవించలేదని అన్నారు. ఈ ఆందోళనలు పూర్తిగా రాజకీయమని నెహ్రూ జీ ఛత్రపతి శివాజీ మహారాజ్ని డిస్కవరీ ఆఫ్ ఇండియాలో అవమానించారని ఎత్తిచూపారు. కాంగ్రెస్, ఎంవీఏ దీనికి క్షమాపణలు చెబుతాయా..? అని ప్రశ్నించారు. మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ సీఎం కమల్ నాథ్ శివాజీ విగ్రహాన్ని బుల్డోజర్లతో కూల్చేశారని, స్వతంత్ర్యం వచ్చిన తర్వాత కూడా ఇదే కాంగ్రెస్ పార్టీ శివజీ సూరత్ని దోచుకున్నారని బోధించారని, వీటికి కాంగ్రెస్ క్షమాపణలు చెబుతుందా..? అని అడిగారు.
Also Read
Read Also: Crime: 13 ఏళ్ల బాలికపై స్కూల్ ప్యూన్ అత్యాచారం.. గర్భం దాల్చడంతో వెలుగులోకి దారుణం..
ఈ ఘటనను రాజకీయం చేయడం సరికాదని ఎన్సీపీ(అజిత్ పవార్) ప్రధాన కార్యదర్శి, ఎంపీ సునీల్ తట్కరే ఫడ్నవీస్కి మద్దతు తెలిపారు. ఈ ఘటన జరగడం దురదృష్టకరమని, మహా వికాస్ అఘాడీ(ఎంవీఏ) దీన్ని రాజకీయం చేస్తున్నాయని మండిపడ్డారు. ప్రధాని మోడీ, ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రులు ఈ ఘటనకు క్షమాపణలు చెప్పారు. కాబట్టి దీనిని రాజకీయం చేయడం మానుకోవాలని హితవు చెప్పారు.
ఎంపీఏ కూటమి ఆందోళనల నేపథ్యంలో ముంబై పోలీసులు మరింత సిబ్బందిని మోహరించారు. ఎంవీఏ నేతల మార్చ్ చర్చ్గేట్ స్టేషన్ సమీపంలోని హుటాత్మా చౌక్ నుంచి ప్రారంభమై గేట్వే ఆఫ్ ఇండియా వద్ద ముగుస్తుంది. ఆగస్టు 26న సింధుదుర్గ్ జిల్లాలోని శివాజీ మహారాజ్ విగ్రహం కూలిపోవడంతో ఈ అంశం రాజకీయంగా మారింది. కొద్ది నెలల క్రితమే ఈ విగ్రహాన్ని ప్రధాని నరేంద్రమోడీ ఆవిష్కరించారు. విగ్రహం కూలిపోయిన అంశంపై ప్రధాని నరేంద్రమోడీ క్షమాపణలు చెప్పారు.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: బుడ్డోడికి మళ్లీ నిరాశే.. ఇంగ్లండ్తో తొలి టీ20లోనూ ‘నో ఛాన్స్’.!
-
ENG vs IND 1st T20: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్! ప్లేయింగ్ XI లో ఎవరెవరంటే?
-
Kayadu Lohar: అందుకే హిట్లున్నా లేకున్నా వరుస ఆఫర్లు!
-
Pawan Kalyan: సోషల్ మీడియా దుర్వినియోగంపై ఉక్కుపాదం మోపుతాం.. ‘ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్’ పేరుతో దూషణలు ఇక కుదరవు.!
-
US: అమెరికాలో విషాదం.. ఆకస్మిక వరదల్లో ఏపీ యువకుడు మృతి
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!
-
Fluffy Omelette: రెగ్యులర్ ఆమ్లెట్కు బదులుగా.. స్పాంజీలా ఉండే ‘ఫ్లఫీ ఆమ్లెట్’ చేసేయండి ఇలా.! లొట్టలేసుకుని తింటారంతే.!
-
Air Fryer vs Stove Cooking: ఎయిర్ ఫ్రయర్ Vs స్టవ్ వంట.. ఆరోగ్యానికి ఏది మంచిది.?
-
అందుబాటులోకి Aadhaar App కొత్త వెర్షన్..ఫేస్ ఆథెంటికేషన్, మొబైల్ నంబర్ అప్డేట్లతో పాటు మరిన్ని సేవలు.!