Devendra Fadnavis: నెహ్రూ, కాంగ్రెస్ ఎన్నడూ శివాజీ మహారాజ్ని గౌరవించలేదు..
- శివాజీ విగ్రహం చుట్టూ మహారాష్ట్ర రాజకీయాలు..
- సింధుదుర్గ్లో కూలిపోయిన శివాజీ మహారాజ్ విగ్రహం..
- నిరసనగా ఈ రోజు కాంగ్రెస్ కూటమి నిరసన..
- కాంగ్రెస్..నెహ్రూ శివాజీని ఎన్నడూ గౌరవించలేదన్న ఫడ్నవీస్..
- ఈ అంశంపై రాజకీయాలు మానుకోవాలన్న డిప్యూటీ సీఎం..
Devendra Fadnavis: మహారాష్ట్ర రాజకీయాలు ప్రస్తుతం శివాజీ మహారాజ్ విగ్రహం చుట్టూ తిరుగుతున్నాయి. ఇటీవల సింధుదుర్గ్ జిల్లాలో శివాజీ విగ్రహం కూలిపోవడంపై ఏక్నాథ్ షిండే-బీజేపీ-ఎన్సీపీ(అజిత్ పవార్)ల సర్కార్ ‘మహాయుతి’పై విపక్ష కూటమి మహావికాస్ అఘాడీ( కాంగ్రెస్- ఉద్ధవ్ ఠాక్రే- ఎన్సీపీ శరద్ పవార్)ల కూటమి విరుచుకుపడుతోంది. ఈ రోజు ఎంవీఏ కూటమి ఆందోళనలకు పిలుపునిచ్చింది. విగ్రహం కూలిపోవడంపై ప్రభుత్వాన్ని నిందిస్తోంది.
ఇదిలా ఉంటే, ప్రతిపక్ష పార్టీల రాజకీయాలపై డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ కానీ ఎంవీఏ నాయకులు ఎన్నడూ శివాజీ మహారాజ్ని గౌరవించలేదని అన్నారు. ఈ ఆందోళనలు పూర్తిగా రాజకీయమని నెహ్రూ జీ ఛత్రపతి శివాజీ మహారాజ్ని డిస్కవరీ ఆఫ్ ఇండియాలో అవమానించారని ఎత్తిచూపారు. కాంగ్రెస్, ఎంవీఏ దీనికి క్షమాపణలు చెబుతాయా..? అని ప్రశ్నించారు. మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ సీఎం కమల్ నాథ్ శివాజీ విగ్రహాన్ని బుల్డోజర్లతో కూల్చేశారని, స్వతంత్ర్యం వచ్చిన తర్వాత కూడా ఇదే కాంగ్రెస్ పార్టీ శివజీ సూరత్ని దోచుకున్నారని బోధించారని, వీటికి కాంగ్రెస్ క్షమాపణలు చెబుతుందా..? అని అడిగారు.
Also Read
- India Defense Budget: సాహో భారత్.. పాకిస్థాన్ను గజగజలాడిస్తున్న ఇండియా రక్షణ బడ్జెట్.. చైనా సాయం ఉన్నా దాయాదికి వణుకు పుట్టాల్సిందే!
- SAD: బిర్యానీ తిన్న తర్వాత పుచ్చకాయ తిని.. ఒకే కటుంబానికి చెందిన 4 గురు మృతి..
- Producing States in India: భారత్లో 'పెట్రోల్' బావులు ఏయే రాష్ట్రాల్లో ఉన్నాయో తెలుసా?
- Amrit Bharat Express: రైల్వే ప్రయాణికులు శుభవార్త.. పట్టాలపైకి మరో రెండు అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు..
Read Also: Crime: 13 ఏళ్ల బాలికపై స్కూల్ ప్యూన్ అత్యాచారం.. గర్భం దాల్చడంతో వెలుగులోకి దారుణం..
ఈ ఘటనను రాజకీయం చేయడం సరికాదని ఎన్సీపీ(అజిత్ పవార్) ప్రధాన కార్యదర్శి, ఎంపీ సునీల్ తట్కరే ఫడ్నవీస్కి మద్దతు తెలిపారు. ఈ ఘటన జరగడం దురదృష్టకరమని, మహా వికాస్ అఘాడీ(ఎంవీఏ) దీన్ని రాజకీయం చేస్తున్నాయని మండిపడ్డారు. ప్రధాని మోడీ, ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రులు ఈ ఘటనకు క్షమాపణలు చెప్పారు. కాబట్టి దీనిని రాజకీయం చేయడం మానుకోవాలని హితవు చెప్పారు.
ఎంపీఏ కూటమి ఆందోళనల నేపథ్యంలో ముంబై పోలీసులు మరింత సిబ్బందిని మోహరించారు. ఎంవీఏ నేతల మార్చ్ చర్చ్గేట్ స్టేషన్ సమీపంలోని హుటాత్మా చౌక్ నుంచి ప్రారంభమై గేట్వే ఆఫ్ ఇండియా వద్ద ముగుస్తుంది. ఆగస్టు 26న సింధుదుర్గ్ జిల్లాలోని శివాజీ మహారాజ్ విగ్రహం కూలిపోవడంతో ఈ అంశం రాజకీయంగా మారింది. కొద్ది నెలల క్రితమే ఈ విగ్రహాన్ని ప్రధాని నరేంద్రమోడీ ఆవిష్కరించారు. విగ్రహం కూలిపోయిన అంశంపై ప్రధాని నరేంద్రమోడీ క్షమాపణలు చెప్పారు.
తాజావార్తలు
-
Off The Record : ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీలో నిర్లిప్తత పెరుగుతోందా?
-
Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
-
Off The Record : ఉమ్మడి రంగారెడ్డి కాంగ్రెస్లో వలస నేతల డామినేషన్
-
Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
-
RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!