BJP MLA: “ముస్తఫాబాద్” పేరుని “శివపురి”గా మారుస్తాం.. ఢిల్లీ బీజేపీ ఎమ్మెల్యే..
- ముస్తఫాబాద్ని ‘‘శివపురి’’గా మారుస్తా..
- ఢిల్లీ బీజేపీ ఎమ్మెల్యే బిష్త్ సంచలన వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BJP MLA: ఢిల్లీలో 27 ఏళ్ల తర్వాత బీజేపీ అధికారాన్ని చేపట్టబోతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో 70 స్థానాలకు గానూ 48 సీట్లలో బీజేపీ గెలిచింది. ఆప్ 22 స్థానాలకే పరిమితమైంది. గత పదేళ్ల ఆప్ అధికారానికి బీజేపీ బ్రేకులు వేసింది. ఇదిలా ఉంటే, తాజాగా ముస్తఫాబాద్ నుంచి గెలిచిన బీజేపీ ఎమ్మెల్యే మోహన్ సింగ్ బిష్త్ సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే ముస్తఫాబాద్ పేరుని ‘‘శివపురి’’ లేదా ‘‘శివ విహార్’’గా మారుస్తామని ప్రకటించారు.
40 శాతం ముస్లిం ఓటర్లు ఉన్న ఈ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థి గెలుపొందారు. బిష్త్ ఆప్ అభ్యర్థి అదీల్ అహ్మద్ ఖాన్, ఎంఐఎం తాహిర్ హుస్సేన్లను ఓడించారు. కరవాల్ నగర్ నుంచి 5 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన బిష్త్, ఈ సారి ముస్తఫాబాద్ నుంచి పోటీ చేశారు. ముస్లింలు ఎక్కువగా ఉండే ఈ స్థానం నుంచి పోటీ చేయమని కోరిన సందర్భంలో తాను అంత సంతోషంగా లేనని బిష్త్ అన్నారు.
Also Read
- Irctc Tickets Booking: OpenAI మరో సంచలనం.. ఏఐతో ఆటోమేటిక్గా రైలు టికెట్లు బుకింగ్
- Rahul Gandhi: యూపీఐ ఛార్జీలపై రాహుల్గాంధీ విమర్శలు
- Katihar Fish Smuggling: భారీగా నిషేధిత చేపలు స్వాధీనం.. 50 క్వింటాళ్ల చైనీస్ థాయ్ మాంగూర్ పట్టివేత
- Nandigram Bypoll 2026: నందిగ్రామ్ ఉపఎన్నికలో బీజేపీ సంచలన నిర్ణయం.. శుభేందు అధికారి దివంగత పీఏ తల్లికి టికెట్
Read Also: Congress: తమ ఓటమి బాధ కన్నా, ఆప్ ఓటమితో కాంగ్రెస్ ఆనందం.. కారణం ఏంటంటే…
“నా సీటు (కారావాల్ నగర్) మారినప్పుడు నేను బాధపడ్డాను ఎందుకంటే ఐదుసార్లు ఎన్నికల్లో గెలిచిన తర్వాత కూడా నా ప్రజల కోసం నేను చాలా కష్టపడ్డాను. నేను 17 సంవత్సరాల తర్వాత ఈ స్థానానికి (ముస్తఫాబాద్) తిరిగి వచ్చాను. పోటీ తీవ్రంగా ఉన్నప్పటికీ నేనే గెలుస్తానని తెలుసు’’ అని బిష్త్ అన్నారు. ముస్తఫాబాద్ పేరు కారణంగా ఇక్కడ వేరే వారు, చదువుకున్న వ్యక్తులు ఇక్కడికి వచ్చి స్థిరపడేందుకు ఇష్టపడరని చెప్పారు. అందుకే దీని పేరుని శివపురి లేదా శివ విహార్గా మారుస్తానని చెప్పారు.
నిజానికి అధికారిక డేటా ప్రకారం.. ఇక్కడ 45 శాతం ముస్లింలు ఉన్నారని, అయితే గ్రౌండ్ లెవల్లో ఇది 60 శాతం ముస్లింలు, 40 శాతం హిందువలు ఉన్నట్లుగా గుర్తించానని బిష్త్ చెప్పారు. పౌరసత్వ సవరణ చట్టం (CAA) ప్రవేశపెట్టడం ద్వారా చెలరేగిన 2020 ఢిల్లీ అల్లర్ల సమయంలో ముస్తఫాబాద్ అత్యంత ప్రభావితమైన ప్రాంతాలలో ఒకటి. చాలా ఇళ్లు, దుకాణాలు, మతపరమైన ప్రదేశాలపై దాడులు జరిగాయి. చాలా మంది ఈ ప్రాంతం నుంచి బయటకు వెళ్లారు.
తాజావార్తలు
-
The Paradise: నాని ‘ది ప్యారడైజ్’ టికెట్ రేట్ల భారీ పెంపు.. అసలు నిజమిదే!
-
Agni veer Rally: సైనిక కల కల్లైంది.. విశాఖ అగ్నివీర్ ర్యాలీలో విషాద ఛాయలు..
-
Tarique Rahman: బ్రిక్స్కు దూరం.. యూఎన్ భేటీకి న్యూయార్క్ వెళ్తున్న తారిఖ్ రెహమాన్
-
Erravalli Case : ఎర్రవల్లి పసుపు నీళ్ల వివాదంలో ప్రభుత్వానికి షాక్
-
ICC Rankings: ఆసియా కప్ దెబ్బకు ఐసీసీ ర్యాంకింగ్స్ తారుమారు.. టాప్లోకి దూసుకెళ్లిన ఇండియన్ ప్లేయర్స్..
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?