Russia: చైనా వ్యతిరేక కుట్రతో భారత్ను నాటో ఆకర్షిస్తోంది.. ఆర్ఐసీ పునరుద్ధరణపై రష్యా..
- రష్యా-భారత్-చైనా (ఆర్ఐసీ) పునరుద్ధరణకు రష్యా యత్నాలు..
- చైనా వ్యతిరేకతను చూపి భారత్ని నాటో ఆకర్షిస్తోంది..
- రష్యా విదేశాంగ మంత్రి సంచలన వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Russia: రష్యా-భారతదేశం-చైనా (RIC) ఫార్మాట్లోని కార్యకలాపాల పునరుద్ధరణకు రష్యా ప్రయత్నిస్తోందని ఆ దేశ విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ గురువారం అన్నారు. చైనా వ్యతిరేక కుట్రలోకి భారతదేశాన్ని ఆకర్షించడానికి నాటో బహిరంగంగా ప్రయత్నిస్తోందని ఆరోపించారు. మాజీ రష్యన్ ప్రధాని యెవ్జెనీ ప్రియాకోవ్ చాలా ఏళ్ల క్రితమే రష్యా, భారత్, చైనా అనే త్రయం ఫార్మాట్కి చొరవ చూపారాని, దీని పునఃప్రారంభంపై మాకు ఆసక్తి ఉందని ఆయన వెల్లడించారు. దీనిపై మంత్రుల స్థాయిలో అప్పటి నుంచి 20 సార్ల కంటే ఎక్కువగా సమావేశాలు నిర్వహించామని, విదేశాంగ విధాన ముఖ్యుల స్థాయిలో మాత్రమే కాకుండా, మూడు దేశాల ఇతర ఆర్థిక, వాణిజ్య మరియు ఆర్థిక సంస్థల అధిపతులతో కూడా సమావేశం జరిగినట్లు లావ్రోవ్ అన్నారు.
Read Also: IPL 2025 Final: ఐపీఎల్ ఫైనల్ కు ఆర్సీబీ.. క్వాలిఫయర్-1లో తడబడిన పంజాబ్
Also Read
- Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
- India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
- No Petrol: సంచలన తీర్పు ఇచ్చిన సుప్రీం కోర్టు.. థర్డ్ పార్టీ ఇన్సురెన్స్ లేకపోతే ఇంధనం బంద్..
- Kangana Ranaut: త్రిషపై ఉదయనిధి వ్యాఖ్యలపై కంగనా రనౌత్ ఏమన్నారంటే..!
పెర్మ్ నగరంలోని యూరేషియా భద్రత, సహకారం కోసం ఒకే సమానమైన వ్యవస్థను ఏర్పాటు చేయడంపై జరిగిన అంతర్జాతీయ సామాజిక, రాజకీయ సమావేశంలో లావ్రోవ్ ప్రసంగించారు. ‘‘ భారత్, చైనా మధ్య సరిహద్దు అవగాహన కుదిరిందని నేను ఈ రోజు అర్థం చేసుకున్నాను. ఈ RIC త్రయం యొక్క పునరుద్ధరణకు సమయం ఆసన్నమైందని నాకు అనిపిస్తోంది’’ అని ఆయన చెప్పారు. చైనా వ్యతిరేక కుట్రల్లోకి భారతదేశాన్ని ఆకర్షించడానికి నాటో స్పష్టంగా ప్రయత్నిస్తోందని లావ్రోవ్ ఆరోపించారు. మా భారతీయ మిత్రులు, వారి రహస్య సంభాషణల ఆధారంగా తాను ఈ విషయం చెబుతున్నట్లు వెల్లడించారు.
జూన్ 2020లో గాల్వాన్ సంక్షోభం తర్వాత RIC త్రయం నిలిచిపోయింది. అయితే, 2024 అక్టోబర్లో రష్యా కజాన్లో జరిగిన బ్రిక్స్ సమావేశంలో ప్రధాని మోడీ, చైనా ప్రెసిడెంగ్ జి జిన్పింగ్ మధ్య ద్వైపాక్షిక సమావేశం జరిగింది. ఇరు దేశాల మధ్య సంబంధాలు మెరుగుపడాల్సిన అవసరాన్ని ఇరు దేశాల నేతలు వ్యక్తం చేశారు. ఈ సమావేశానికి ముందు సరిహద్దు వద్ద ఒక అవగాహన కుదిరింది. ఇరు దేశాల సైన్యాలు ఉద్రిక్త ప్రాంతాల నుంచి వెనక్కి వెళ్లాయి.
తాజావార్తలు
-
India Flagged Cargo Ship Attack: యెమెన్ తీరంలో భారత కార్గో నౌకపై దాడి.. ఘటన సమయంలో 14 మంది సిబ్బంది..!
-
CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
-
Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
-
Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
-
India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!