Site icon NTV Telugu

Russia: చైనా వ్యతిరేక కుట్రతో భారత్‌ను నాటో ఆకర్షిస్తోంది.. ఆర్ఐసీ పునరుద్ధరణపై రష్యా..

Russia

Russia

Russia: రష్యా-భారతదేశం-చైనా (RIC) ఫార్మాట్‌లోని కార్యకలాపాల పునరుద్ధరణకు రష్యా ప్రయత్నిస్తోందని ఆ దేశ విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ గురువారం అన్నారు. చైనా వ్యతిరేక కుట్రలోకి భారతదేశాన్ని ఆకర్షించడానికి నాటో బహిరంగంగా ప్రయత్నిస్తోందని ఆరోపించారు. మాజీ రష్యన్ ప్రధాని యెవ్జెనీ ప్రియాకోవ్ చాలా ఏళ్ల క్రితమే రష్యా, భారత్, చైనా అనే త్రయం ఫార్మాట్‌కి చొరవ చూపారాని, దీని పునఃప్రారంభంపై మాకు ఆసక్తి ఉందని ఆయన వెల్లడించారు. దీనిపై మంత్రుల స్థాయిలో అప్పటి నుంచి 20 సార్ల కంటే ఎక్కువగా సమావేశాలు నిర్వహించామని, విదేశాంగ విధాన ముఖ్యుల స్థాయిలో మాత్రమే కాకుండా, మూడు దేశాల ఇతర ఆర్థిక, వాణిజ్య మరియు ఆర్థిక సంస్థల అధిపతులతో కూడా సమావేశం జరిగినట్లు లావ్రోవ్ అన్నారు.

Read Also: IPL 2025 Final: ఐపీఎల్ ఫైనల్ కు ఆర్సీబీ.. క్వాలిఫయర్-1లో తడబడిన పంజాబ్

పెర్మ్ నగరంలోని యూరేషియా భద్రత, సహకారం కోసం ఒకే సమానమైన వ్యవస్థను ఏర్పాటు చేయడంపై జరిగిన అంతర్జాతీయ సామాజిక, రాజకీయ సమావేశంలో లావ్రోవ్ ప్రసంగించారు. ‘‘ భారత్, చైనా మధ్య సరిహద్దు అవగాహన కుదిరిందని నేను ఈ రోజు అర్థం చేసుకున్నాను. ఈ RIC త్రయం యొక్క పునరుద్ధరణకు సమయం ఆసన్నమైందని నాకు అనిపిస్తోంది’’ అని ఆయన చెప్పారు. చైనా వ్యతిరేక కుట్రల్లోకి భారతదేశాన్ని ఆకర్షించడానికి నాటో స్పష్టంగా ప్రయత్నిస్తోందని లావ్రోవ్ ఆరోపించారు. మా భారతీయ మిత్రులు, వారి రహస్య సంభాషణల ఆధారంగా తాను ఈ విషయం చెబుతున్నట్లు వెల్లడించారు.

జూన్ 2020లో గాల్వాన్ సంక్షోభం తర్వాత RIC త్రయం నిలిచిపోయింది. అయితే, 2024 అక్టోబర్‌లో రష్యా కజాన్‌లో జరిగిన బ్రిక్స్ సమావేశంలో ప్రధాని మోడీ, చైనా ప్రెసిడెంగ్ జి జిన్‌పింగ్ మధ్య ద్వైపాక్షిక సమావేశం జరిగింది. ఇరు దేశాల మధ్య సంబంధాలు మెరుగుపడాల్సిన అవసరాన్ని ఇరు దేశాల నేతలు వ్యక్తం చేశారు. ఈ సమావేశానికి ముందు సరిహద్దు వద్ద ఒక అవగాహన కుదిరింది. ఇరు దేశాల సైన్యాలు ఉద్రిక్త ప్రాంతాల నుంచి వెనక్కి వెళ్లాయి.

Exit mobile version