Mood of the Nation: ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఎన్డీయేకి 300+ సీట్లు.. బీజేపీకి ఎన్నంటే..?
- ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఎన్డీయేదే అధికారం..
- బీజేపీకి సొంతగా మెజారిటీ..
- మిత్రపక్షాలతో కలిసి 343 సీట్లు..
- మూడ్ ఆఫ్ ది నేషన్ పోల్లో వెల్లడి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mood of the Nation: మూడ్ ఆఫ్ ది నేషన్(MOTN) పోల్లో సంచలన ఫలితాలు వెల్లడవుతున్నాయి. ఇప్పటికి ఇప్పుడు లోక్సభకు ఎన్నికలు జరిగితే బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమికి 343 సీట్లు గెలుచుకుంటుందని అంచనా వేసింది. 2024 లోక్సభ ఎన్నికల్లో 232 సీట్లు గెలుచుకున్న కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి 188 సీట్లకు పడిపోతుందని చెప్పింది.
ఇండియా టుడే-సివోటర్ మూడ్ ఆఫ్ ది నేషన్ (MOTN) పోల్ను జనవరి 2 మరియు ఫిబ్రవరి 9, 2025 మధ్య నిర్వహించారు, అన్ని లోక్సభ నియోజకవర్గాలలో 125,123 మంది వ్యక్తులను సర్వే చేశారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో 293 సీట్లు గెలుచుకున్న ఎన్డీయే కూటమికి, మ్యాజిక్ ఫిగర్(272) కన్నా కొన్ని సీట్లు మాత్రమే అధికంగా గెలుచుకుని మూడోసారి అధికారాన్ని సాధించింది. తాజా పోల్ ప్రకారం, మరో 3 శాతం పాయింట్లు పెరిగి ఎన్డీయే కూటమికి ఓట్ల శాతం 47 శాతానికి చేరుకుంటుందని అంచనా వేసింది. ఇండియా కూటమికి 1 శాతం ఓట్లు తగ్గుతాయని చెప్పింది.
Also Read
- CM Vijay and Trisha Controversy: ఆలయ ఉత్సవాల్లో త్రిష, విజయ్ ఫొటోలతో వివాదాస్పద ఫ్లెక్సీ.. ఇద్దరిపై కేసు
- Cyber Crime: 11వ తరగతి డ్రాపౌట్.. రూ. 64 కోట్ల సైబర్ దోపిడీ.. 18 ఏళ్ల మాస్టర్మైండ్ అరెస్ట్!
- CM Vijay: సీఎం విజయ్కు హైకోర్టు షాక్.. మూడు వారాల్లో వివరణ ఇవ్వాలని నోటీసులు
- Dharmendra Pradhan: నీట్పై చర్చకు సిద్ధం.. విద్యార్థుల పేరుతో రాజకీయాలు వద్దు రాహుల్..
Read Also: Kids Using Mobile: మీ పిల్లలు ఫోన్ ఎక్కువగా చూస్తున్నారా? అయితే వారికి మాటలు రావు..
ఈ సర్వే బీజేపీకి గణనీయమైన పెరుగుదలను సూచించింది. నేడు ఎన్నికలు జరిగితే బీజేపీకి సొంతగా 281 సీట్లు వస్తాయని అంచనా వేసింది. కాంగ్రెస్ పార్టీకి 99 నుంచి 78 సీట్లకు పడిపోయే అవకాశం ఉందని చెప్పింది. బీజేపీకి 3 శాతం ఓట్లు పెరిగి 41 శాతానికి చేరుకుంటుందని అంచనా వేసింది.
2024 ఎన్నికల్లో ఎన్డీయే కూటమి, ముఖ్యంగా ‘‘400 పార్’’ నినాదం ఇచ్చింది. చివరకు ఈ నినాదమే ప్రతిపక్ష ఇండియా కూటమికి కలిసి వచ్చింది. 400 సీట్లు వస్తే బీజేపీ రాజ్యాంగాన్ని మారుస్తుందని ప్రచారం చేసింది. చివరకు ఎన్డీయే కూటమి మిత్రపక్షాలైన టీడీపీ, నితీష్ కుమార్ జేడీయూ సాయంతో 293 సీట్లను సాధించింది. బీజేపీ కేవలం 240 సీట్లలో గెలుపొందింది. సొంతగా మ్యాజిక్ ఫిగర్ దాటలేకపోయింది.
తాజావార్తలు
-
NBK : ట్రీట్మెంట్ కోసం హైదరాబాద్కు బాలయ్య.. షూటింగ్ కు బ్రేక్
-
India Test Squad: శ్రీలంకతో టెస్టు సిరీస్.. టీమిండియాలోకి మరో కొత్త ప్లేయర్!
-
CM Vijay and Trisha Controversy: ఆలయ ఉత్సవాల్లో త్రిష, విజయ్ ఫొటోలతో వివాదాస్పద ఫ్లెక్సీ.. ఇద్దరిపై కేసు
-
Yamaha Electric Scooter: యమహా నుంచి కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. కీ-లెస్ ఇగ్నిషన్, మార్చుకోగల బ్యాటరీతో త్వరలో ఎంట్రీ?
-
Lalit Kumar Modi: ఐపీఎల్ 2009 ఫెమా కేసులో క్లీన్ చిట్.. ఆనందంతో డాన్స్ చేస్తూ రచ్చ రచ్చ.!
ట్రెండింగ్
-
10 రోజుల బ్యాటరీ, 80+ స్పోర్ట్స్ మోడ్లు.! స్క్రీన్ లేకుండానే హెల్త్ ట్రాకింగ్.. Garmin CIRQA స్మార్ట్ బ్యాండ్ లాంచ్.!
-
OLED డిస్ప్లే, RTX 5090 GPUతో పవర్ఫుల్ పనితీరుతో Dell కొత్త Alienware గేమింగ్ ల్యాప్టాప్లు లాంచ్..! ఫీచర్స్, ధరలు ఇలా..!
-
Best Camera Phones: DSLRకు పోటీగా ఫొటోగ్రఫీ అనుభవం..! బెస్ట్ కెమెరా ఫోన్ల లిస్ట్ ఇదిగో..!
-
Cleaning Hacks : తుప్పు పట్టిన ఇనుప అల్మారా కొత్తదానిలా మెరవాలా? ఈ 4 చిట్కాలు చాలు.!
-
Remote Cleaning : వర్షాల్లో టీవీ రిమోట్ పనిచేయడం లేదా? ఈ 4 ట్రిక్స్తో కొత్తదానిలా మారుతుంది.!