Mood of the Nation: ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఎన్డీయేకి 300+ సీట్లు.. బీజేపీకి ఎన్నంటే..?
- ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఎన్డీయేదే అధికారం..
- బీజేపీకి సొంతగా మెజారిటీ..
- మిత్రపక్షాలతో కలిసి 343 సీట్లు..
- మూడ్ ఆఫ్ ది నేషన్ పోల్లో వెల్లడి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mood of the Nation: మూడ్ ఆఫ్ ది నేషన్(MOTN) పోల్లో సంచలన ఫలితాలు వెల్లడవుతున్నాయి. ఇప్పటికి ఇప్పుడు లోక్సభకు ఎన్నికలు జరిగితే బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమికి 343 సీట్లు గెలుచుకుంటుందని అంచనా వేసింది. 2024 లోక్సభ ఎన్నికల్లో 232 సీట్లు గెలుచుకున్న కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి 188 సీట్లకు పడిపోతుందని చెప్పింది.
ఇండియా టుడే-సివోటర్ మూడ్ ఆఫ్ ది నేషన్ (MOTN) పోల్ను జనవరి 2 మరియు ఫిబ్రవరి 9, 2025 మధ్య నిర్వహించారు, అన్ని లోక్సభ నియోజకవర్గాలలో 125,123 మంది వ్యక్తులను సర్వే చేశారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో 293 సీట్లు గెలుచుకున్న ఎన్డీయే కూటమికి, మ్యాజిక్ ఫిగర్(272) కన్నా కొన్ని సీట్లు మాత్రమే అధికంగా గెలుచుకుని మూడోసారి అధికారాన్ని సాధించింది. తాజా పోల్ ప్రకారం, మరో 3 శాతం పాయింట్లు పెరిగి ఎన్డీయే కూటమికి ఓట్ల శాతం 47 శాతానికి చేరుకుంటుందని అంచనా వేసింది. ఇండియా కూటమికి 1 శాతం ఓట్లు తగ్గుతాయని చెప్పింది.
Also Read
- Ram Mandir Trust First CEO: రామ మందిర ట్రస్ట్ సీఈవో రేసులో ఆ నలుగురు.. తొలి CEOపై తుది నిర్ణయం రేపే..
- Mahua Moitra: ఎంపీ మహువా మొయిత్రా భద్రతపై కలకత్తా హైకోర్టు కీలక ఆదేశాలు.. కారణమిదే!
- Nitin Nabin: రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసిన నితిన్ నబిన్
- Chirag Paswan Death Threat: కేంద్రమంత్రి చిరాగ్ పాస్వాన్కు ముప్పు?.. కేంద్రం అలర్ట్
Read Also: Kids Using Mobile: మీ పిల్లలు ఫోన్ ఎక్కువగా చూస్తున్నారా? అయితే వారికి మాటలు రావు..
ఈ సర్వే బీజేపీకి గణనీయమైన పెరుగుదలను సూచించింది. నేడు ఎన్నికలు జరిగితే బీజేపీకి సొంతగా 281 సీట్లు వస్తాయని అంచనా వేసింది. కాంగ్రెస్ పార్టీకి 99 నుంచి 78 సీట్లకు పడిపోయే అవకాశం ఉందని చెప్పింది. బీజేపీకి 3 శాతం ఓట్లు పెరిగి 41 శాతానికి చేరుకుంటుందని అంచనా వేసింది.
2024 ఎన్నికల్లో ఎన్డీయే కూటమి, ముఖ్యంగా ‘‘400 పార్’’ నినాదం ఇచ్చింది. చివరకు ఈ నినాదమే ప్రతిపక్ష ఇండియా కూటమికి కలిసి వచ్చింది. 400 సీట్లు వస్తే బీజేపీ రాజ్యాంగాన్ని మారుస్తుందని ప్రచారం చేసింది. చివరకు ఎన్డీయే కూటమి మిత్రపక్షాలైన టీడీపీ, నితీష్ కుమార్ జేడీయూ సాయంతో 293 సీట్లను సాధించింది. బీజేపీ కేవలం 240 సీట్లలో గెలుపొందింది. సొంతగా మ్యాజిక్ ఫిగర్ దాటలేకపోయింది.
తాజావార్తలు
-
Elephant Death: విద్యుత్ షాక్తో ఏనుగు మృతి.. పవన్ కల్యాణ్ సీరియస్.. కీలక ఆదేశాలు
-
Sofa Cleaning Tips: సోఫాపై మొండి మరకలా? ఈ ఇంటి చిట్కాతో సులభంగా క్లీన్ చేయండి
-
OTR: కవిత మాటలు నిజామాబాద్ పాలిటిక్స్లో మంటలు రేపుతున్నాయా..?
-
Off The Record: వైసీపీ నేతలకు రిపోర్ట్ కార్డ్స్ పెట్టారా..? ఫెయిల్ అయిన నేతలకు నో టికెట్..?
-
US-Iran: రెండేళ్లలో ‘హార్ముజ్’ విలువలేనిదిగా మారొచ్చు.. ఇరాన్పై కఠిన ఆంక్షలకు అమెరికా ప్లాన్
ట్రెండింగ్
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!
-
AMOLED డిస్ప్లే, 66W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరాతో Lava AGNI 4N లాంచ్.!
-
IBPS RRB Recruitment: ఉద్యోగార్థులకు శుభవార్త.. బ్యాంకింగ్ రంగంలో 13,706 ఉద్యోగాల జాతర.!
-
Navagraha Pradakshina: నవగ్రహాలకు ప్రదక్షిణలు చేశాక కాళ్లు కడుక్కోవాలా? అసలు రహస్యం ఇదే..!