Mohan Bhagwat: పాకిస్థాన్కు నష్టం కలిగేలా భారత్ ఓడించాలి..
- పాకిస్థాన్కు అర్థమయ్యే భాషలోనే భారత్ సమాధానం చెప్పాలి..
- భారత్కు సహకరించటం ద్వారానే దాయాదికి మేలు జరుగుతుంది..
- భారత్ను ఏమీ చేయలేమనే విషయం పాకిస్థాన్కు అర్థం అయ్యేలా చేయాలి: మోహన్ భగవత్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mohan Bhagwat: రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ఆవిర్భవించి వందేళ్లు పూర్తైన సందర్భంగా బెంగళూరులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ మాట్లాడుతూ.. పాకిస్థాన్కు నష్టం కలిగించేలా భారత్ ప్రతి సారి ఓడిస్తునే ఉండాలని, అప్పుడు వారు శాశ్వతంగా పశ్చాత్తాపం చెందక తప్పదన్నారు. ఎల్లప్పుడూ మనం శాంతినే కోరుకోవడం మంచిది కాదు.. పాకిస్థానే మనతో శాంతి కావాలని కోరుకోవడం లేదు.. మనకు హాని చేయటంతోనే సంతృప్తి చెందుతుంది.. కాబట్టి, శాంతిని పాకిస్థాన్ ఉల్లంఘిస్తే అది ఎప్పటికీ విజయం సాధించలేదన్నారు. 1971లో పాక్ దండయాత్ర చేసి.. 90వేల మంది సైనికులను కోల్పోయినప్పటికీ.. ఇంకా బుద్ది రాలేదు.. అందుకే భారత్ను ఏమీ చేయలేమనే విషయం ఆ దేశానికి అర్థం అయ్యేలా దాడులు చేయాలన్నారు. పాక్ కుట్రలను ఎదుర్కొనేందుకు మనం నిరంతరం అప్రమత్తంగా ఉండాలని మోహన్ భగవత్ వెల్లడించారు.
Read Also: Cold Wave’s: తెలంగాణలో భారీగా పెరిగిన చలి.. ఆదిలాబాద్, హైదరాబాద్ లో.. !
Also Read
- Parliament Monsoon Session: నేటి నుంచి పార్లమెంట్ సమావేశాలు.. నిలదీసేందుకు ప్రతిపక్షం.. కీలక చట్టాలకు ఎన్డీఏ సిద్ధం..
- Supreme Court : ప్రైవేట్ వర్సిటీల ఇష్టారాజ్యంపై సుప్రీంకోర్టు సీరియస్.!
- Geetanjali Angmo: సుప్రీంకోర్టు మెట్లెక్కిన సోనమ్ వాంగ్చుక్ భార్య.. హైకోర్టు తీర్పుపై సవాల్!
- Sonam Wangchuk: సోనమ్ వాంగ్చుక్ను ఆస్పత్రికి తరలించడం సరైనదే: ఢిల్లీ హైకోర్టు
అలాగే, ఆర్ఎస్ఎస్ను ఇప్పటి వరకు అధికారికంగా ఎందుకు రిజిస్టర్ చేయలేదని విపక్షాలు అడిగిన క్వశ్చన్ పై ఆర్ఎస్ఎస్ చీఫ్ భగవత్ స్పందిస్తూ.. హిందూ ధర్మం ఎక్కడా రిజిస్ట్రర్ కాలేదు.. మేం కూడా ప్రత్యేకంగా నమోదు చేసుకోవాల్సిన అవసరం లేదన్నారు. కాగా, పలు రాష్ట్రాల ప్రభుత్వాలు తమ సంఘ్ ను గుర్తింపులేని సంస్థగా పేర్కొన్నాయి.. గుర్తింపే లేని సంస్థను గతంలో ఎలా నిషేధించారు? మా సంస్థ గుర్తింపు పొందింది అనడానికి ఇంతకంటే ఆధారాలు ఏం కావాలి?.. 1925లో ఆర్ఎస్ఎస్ను స్థాపించినట్లుగా అప్పటి బ్రిటిష్ సర్కార్ తో అధికారికంగా రిజిస్ట్రర్ చేయించాలా? ఏంటి అని ప్రశ్నించారు. ఇక, దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత అధికారికంగా రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ను నమోదు చేసుకోవడాన్ని ఇండియన్ గవర్నమెంట్ తప్పనిసరి చేయలేదనే విషయాన్ని గుర్తు చేశారు. ఆదాయపు పన్ను శాఖ, కోర్టులు ఆర్ఎస్ఎస్ను వ్యక్తుల సంఘంగా మాత్రమే గుర్తించాయి. దానిలో భాగంగానే పన్నుల నుంచి మినహాయించాయని మోహన్ భగవత్ తెలియజేశారు.
తాజావార్తలు
-
NBK 111 : బాలయ్య మాస్ ర్యాంపేజ్.. ఫ్యాన్సీ రేటుకి NBK 111 ఓటీటీ డీల్ క్లోజ్
-
Rohit Sharma Last ODI: రోహిత్ శర్మ చివరి వన్డే ఆడేశాడా?.. కెప్టెన్ శుభ్మన్ గిల్ ఆసక్తికర సమాధానం!
-
Rohit Sharma: రోహిత్ శతకం వెనుక ఆసక్తికర రహస్యం.. మ్యాచ్ తర్వాత బ్యాట్ స్టోరీ వైరల్..
-
Khadgam Re Release: దేశభక్తి సినిమాలకే బాస్.. ‘ఖడ్గం’ మళ్లీ థియేటర్లలోకి వస్తోంది!
-
FIFA World Cup Prize Money: ఛాంపియన్ స్పెయిన్కు ఎన్ని కోట్ల ప్రైజ్ మనీ లభించిందంటే.?
ట్రెండింగ్
-
Shubman Gill: అప్పటివరకు పోటీలోనే ఉన్నాం.. ఆ ముగ్గురే ముంచారు.. లార్డ్స్ ఓటమిపై శుభ్మన్ గిల్ షాకింగ్ కామెంట్స్!
-
Jagannath Prasadam Recipe : జగన్నాథుడి ప్రసాదం మాల్పువా.. ఇంట్లోనే ఇలా చేస్తే రుచి అదుర్స్.!
-
Rainy Season Tips: వర్షాకాలంలో గోడలకు, మెట్లకు పాకురు పట్టిందా.? ఈ చిట్కా ట్రై చేయండి.!
-
Virat Kohli Retirement: తప్పుకుంటా.. బీసీసీఐకి విరాట్ కోహ్లీ వార్నింగ్.. వీడియో వైరల్!
-
Rohit Sharma: టెన్షన్ అవసరం లేదు.. రోహిత్ శర్మ ఆడుతాడు: మోర్కెల్