Mohan Bhagwat: పాకిస్థాన్కు నష్టం కలిగేలా భారత్ ఓడించాలి..
- పాకిస్థాన్కు అర్థమయ్యే భాషలోనే భారత్ సమాధానం చెప్పాలి..
- భారత్కు సహకరించటం ద్వారానే దాయాదికి మేలు జరుగుతుంది..
- భారత్ను ఏమీ చేయలేమనే విషయం పాకిస్థాన్కు అర్థం అయ్యేలా చేయాలి: మోహన్ భగవత్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mohan Bhagwat: రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ఆవిర్భవించి వందేళ్లు పూర్తైన సందర్భంగా బెంగళూరులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ మాట్లాడుతూ.. పాకిస్థాన్కు నష్టం కలిగించేలా భారత్ ప్రతి సారి ఓడిస్తునే ఉండాలని, అప్పుడు వారు శాశ్వతంగా పశ్చాత్తాపం చెందక తప్పదన్నారు. ఎల్లప్పుడూ మనం శాంతినే కోరుకోవడం మంచిది కాదు.. పాకిస్థానే మనతో శాంతి కావాలని కోరుకోవడం లేదు.. మనకు హాని చేయటంతోనే సంతృప్తి చెందుతుంది.. కాబట్టి, శాంతిని పాకిస్థాన్ ఉల్లంఘిస్తే అది ఎప్పటికీ విజయం సాధించలేదన్నారు. 1971లో పాక్ దండయాత్ర చేసి.. 90వేల మంది సైనికులను కోల్పోయినప్పటికీ.. ఇంకా బుద్ది రాలేదు.. అందుకే భారత్ను ఏమీ చేయలేమనే విషయం ఆ దేశానికి అర్థం అయ్యేలా దాడులు చేయాలన్నారు. పాక్ కుట్రలను ఎదుర్కొనేందుకు మనం నిరంతరం అప్రమత్తంగా ఉండాలని మోహన్ భగవత్ వెల్లడించారు.
Read Also: Cold Wave’s: తెలంగాణలో భారీగా పెరిగిన చలి.. ఆదిలాబాద్, హైదరాబాద్ లో.. !
Also Read
- Eknath Shinde: బ్రిటిష్ విమానంలో ఏక్నాథ్ షిండే ‘ఐఫోన్’ మిస్సింగ్.. అర్ధరాత్రి ఏం జరిగిందంటే..!
- Amit shah: అమిత్ షాకు అస్వస్థత.. అధికారిక కార్యక్రమాలు రద్దు
- Punjab: మాజీ కేంద్ర మంత్రి అరెస్ట్.. పంజాబ్లో హై-వోల్టేజ్ డ్రామా..
- Ajit Doval: సినిమాను మించిన థ్రిల్లర్! అజిత్ డోవల్ పంచుకున్న అత్యంత ప్రమాదకరమైన సీక్రెట్ మిషన్..
అలాగే, ఆర్ఎస్ఎస్ను ఇప్పటి వరకు అధికారికంగా ఎందుకు రిజిస్టర్ చేయలేదని విపక్షాలు అడిగిన క్వశ్చన్ పై ఆర్ఎస్ఎస్ చీఫ్ భగవత్ స్పందిస్తూ.. హిందూ ధర్మం ఎక్కడా రిజిస్ట్రర్ కాలేదు.. మేం కూడా ప్రత్యేకంగా నమోదు చేసుకోవాల్సిన అవసరం లేదన్నారు. కాగా, పలు రాష్ట్రాల ప్రభుత్వాలు తమ సంఘ్ ను గుర్తింపులేని సంస్థగా పేర్కొన్నాయి.. గుర్తింపే లేని సంస్థను గతంలో ఎలా నిషేధించారు? మా సంస్థ గుర్తింపు పొందింది అనడానికి ఇంతకంటే ఆధారాలు ఏం కావాలి?.. 1925లో ఆర్ఎస్ఎస్ను స్థాపించినట్లుగా అప్పటి బ్రిటిష్ సర్కార్ తో అధికారికంగా రిజిస్ట్రర్ చేయించాలా? ఏంటి అని ప్రశ్నించారు. ఇక, దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత అధికారికంగా రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ను నమోదు చేసుకోవడాన్ని ఇండియన్ గవర్నమెంట్ తప్పనిసరి చేయలేదనే విషయాన్ని గుర్తు చేశారు. ఆదాయపు పన్ను శాఖ, కోర్టులు ఆర్ఎస్ఎస్ను వ్యక్తుల సంఘంగా మాత్రమే గుర్తించాయి. దానిలో భాగంగానే పన్నుల నుంచి మినహాయించాయని మోహన్ భగవత్ తెలియజేశారు.
తాజావార్తలు
-
Eknath Shinde: బ్రిటిష్ విమానంలో ఏక్నాథ్ షిండే ‘ఐఫోన్’ మిస్సింగ్.. అర్ధరాత్రి ఏం జరిగిందంటే..!
-
Zodiac Signs : అదృష్టం తలుపు తట్టబోతోంది.. ఆ 4 రాశులేవో తెలుసా?
-
Rashmika Mandanna: తమిళ తంబీలకు రష్మిక నచ్చలేదా? షూటింగ్ మొదలవ్వకముందే ఇంత రచ్చ ఎందుకు!
-
TPCC Mahesh Goud : ఉప ఎన్నికలైనా గెలుపు మనదే.. మహేష్ గౌడ్ ధీమా
-
Amit shah: అమిత్ షాకు అస్వస్థత.. అధికారిక కార్యక్రమాలు రద్దు
ట్రెండింగ్
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!