Odisha: మానవత్వం చాటుకున్న ఎమ్మెల్యే.. మహిళ మృతదేహాన్ని తరలించేందుకు సాయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MLA help to carry the dead body of the woman in odisha:శవాలు తరలించేందుకు కనీసం అంబులెన్సులు ఇవ్వని ప్రభుత్వాసుపత్రులు, సొంతూళ్లకు తమ తల్లుల శవాన్ని, కుమారుల శవాలను తీసుకెళ్లేందుకు బైకులను ఆశ్రయించిన ఘటనలను ఎన్నో చూశాం. చివరకు అనారోగ్యం పాలైన తమ బంధువులను తోపుడు బండ్లలో ప్రభుత్వాసుపత్రులకు తీసుకెళ్లిన ఘటనలు ఇటీవల వెలుగులోకి వచ్చాయి. అయితే ఓ ఎమ్మెల్యే మాత్రం.. ఓ కుటుంబానికి సాయం చేయడాన్ని అందరూ ప్రశంసిస్తున్నారు. తన భార్య మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించేందుకు కనీసం డబ్బులు లేని ఓ వ్యక్తికి దగ్గరుండి వాహనం సదుపాయాన్ని ఏర్పాటు చేశాడు సదరు ఎమ్మెల్యే.
ఈ ఘటన ఒడిశా రాష్ట్రం గంజామ్ జిల్లాలో జరిగింది. గంజాం జిల్లా బెర్హంపూర్ లో చికిత్స పొందుతూ.. 30 ఏళ్ల మహిళ మరణించింది. అయితే మహిళ మృతదేహాన్ని తీసుకెళ్లడానికి బిజూ జనతాదళ్ (బీజేడీ) ఎమ్మెల్యే బిక్రమ్ కుమార్ పాండా సహాయం చేశారు. వివరాల్లోకి వెళితే.. కోరాపుట్ జిల్లాకు చెందిన రోజీ శాంతా అనే మహిళ ఇటీవల పురిటి నొప్పులతో కోరాపుట్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి రిఫర్ చేశారు. అక్కడ నుంచి ఐదురోజుల క్రితం బెర్హంపూర్ మహారాజా కృష్ణ చంద్ర గజపతి మెడికల్ కాలేజీకి తరలించారు. చికిత్స పొందుతున్న క్రమంలో రోజీ శాంతా పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చి శుక్రవారం ఉదయం మరణించింది.
Also Read
- MEA: కరాచీ దాడిని భారత్పై నెట్టొద్దు.. పాక్పై ఘాటు వ్యాఖ్యలు..
- Ketan Agarwal Murder Case: కేతన్ హత్యలో పట్టుబడకుండా 10 గంటల మాస్టర్ ప్లాన్.. చివరకు అదే పట్టించింది!
- Sharmistha Mukherjee: "రాజకీయం పార్ట్ టైమ్ కాదు".. రాహుల్ గాంధీపై ప్రణబ్ కుమార్తె ఘాటు విమర్శలు..
- PM Modi: మోదీకి మరో అంతర్జాతీయ గౌరవం.. సీషెల్స్ నుంచి అత్యున్నత అవార్డు
Read Also: Madhya Pradesh: తల గాయానికి “కండోమ్ ప్యాక్” తో డ్రెస్సింగ్..
కాగా అత్యంత దుర్భరమైన ఆర్థిక పరిస్థితి ఉన్న రోజీ శాంతా భర్త నరుల శాంత మృతదేహాన్ని 370 కిలోమీటర్ల దూరంలో ఉన్న సొంత గ్రామం బగ్దేరికి ఎలా తీసుకెళ్లాలని ఆందోళన చెందాడు. గంటల తరబడి ఆస్పత్రిలోనే మృతదేహం ఉంది. అయతే ఈ విషయాన్ని తెలుసుకున్న ఎమ్మెల్యే బిక్రమ్ కుమార్ పాండా ఆస్పత్రికి చేరుకున్నారు. మృతదేహాన్ని తరలించేందుకు బెర్హంపూర్ మున్సిపల్ కార్పొరేషన్ వ్యాన్ ఏర్పాటు చేశారు. దాదాపుగా 370 కిలోమీటర్ల దూరంలో ఉన్న సొంతూరు వెళ్లడానికి దారి ఖర్చులను కూడా ఇచ్చి..పసికందుకు ఆహారం ఏర్పాటు చేశారు. నాలుగు శవాలను శ్మశాన వాటికకు తీసుకెళ్లడానికి తన ఎమ్మెల్యే నిధుల నుంచి విరాళం కూడా ఇచ్చారు బిక్రమ్ కుమార్ పాండా. కోవిడ్ లాక్ డౌన్ సమయంలో కోవిడ్ వల్ల మరణించిన శవాలను తీసుకునేందుకు వారి బంధువులు ముందుకు రాకపోవడంతో ఎమ్మెల్యేనే దహనసంస్కారాలకు సహాయం చేశారు. ఓ ప్రజాప్రతినిధిగా ఇలా చేయడం తన కర్తవ్యం అని చెప్పుకొచ్చారు ఎమ్మెల్యే బిక్రమ్ కుమార్ పాండా.
తాజావార్తలు
-
Diabetes: షుగర్ కంట్రోల్కు ఈ 3 కూరగాయలు బెస్ట్.. నిపుణుల సూచనలు ఇవే
-
Vaibhav Sooryavanshi: ‘వైభవ్ సూర్యవంశీకి అన్యాయం.. రెండో టీ20లో కూడా అదే తప్పు’..
-
Ben Stokes: క్రికెట్ ప్రపంచాన్ని షాక్కు గురిచేసిన బెన్ స్టోక్స్.. రిటైర్మెంట్ ప్రకటన..
-
KTR: మోసపోతే గోసపడుతాం అంటే ఇదే.. 2028లో మళ్లీ కేసీఆరే సీఎం
-
AB de Villiers: ‘నా లైఫ్లో చూసిన అత్యుత్తమ బ్యాట్స్మెన్స్ వీరే’.. టాప్ 3లో ఎవరెవరంటే..
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!