హిందీపై తమిళనాడు-కేంద్ర ప్రభుత్వం మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. తమిళనాడుపై కేంద్రం బలవంతంగా హిందీ రుద్దుతోందని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ధ్వజమెత్తారు. దక్షిణాది రాష్ట్రాలపై బలవంతంగా హిందీ రుద్దీ.. బీజేపీ గెలవాలని చూస్తోందని ఇటీవల డీఎంకే నేతృత్వంలో జరిగిన అఖిలపక్ష సమావేశంలో నేతలు పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: IPL 2025 Tickets: ఆన్లైన్లో ఐపీఎల్ టికెట్స్.. ఈ సీజన్లోనూ బ్లాక్ దందా! హెచ్సీఏ తీరు మారదా?
శుక్రవారం కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. తమిళనాడులో పర్యటించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి స్టాలిన్పై విమర్శలు గుప్పించారు. ఎల్కేజీ స్టూడెంట్.. పీహెచ్డీ హోల్డర్కు బోధించినట్లుగా ఉందని వ్యాఖ్యానించారు. తమిళ భాష కోసం ముఖ్యమంత్రిగా స్టాలిన్ చేసింది ఏమీలేదన్నారు. ప్రాంతీయ భాషలకు అనుగుణంగా కీలక మార్పులు చేసింది ప్రధాని మోడీ ప్రభుత్వమేనన్నారు.
ఇది కూడా చదవండి: Sunil Gavaskar: జట్టులో మార్పులు వద్దు.. ఓపెనర్లు రాణించాలి.. కొత్త బంతితో వికెట్లు తీస్తే చాలు!
ఇప్పటి వరకు సీఏపీఎఫ్ నియామకాల్లో మాతృభాషకు స్థానం లేదన్నారు. కానీ యువత భవిష్యత్ను దృష్టిలో పెట్టుకుని ఎనిమిదవ షెడ్యూల్లో మార్పులు చేశామని.. దీంతో సీఏపీఎఫ్ పరీక్షను ఇప్పుడు తమిళంలో కూడా రాయగల్గుతున్నారని పేర్కొన్నారు. స్టాలిన్.. ప్రాంతీయ భాషకు ఎందుకు ప్రాధాన్యత ఇవ్వలేదని అడిగారు. వైద్య, ఇంజనీరింగ్ కోర్సుల పాఠ్యాంశాలను వీలైనంత త్వరగా తమిళ భాషలో ప్రవేశపెట్టే దిశగా చర్యలు తీసుకోవాలని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ను కోరుతున్నట్లు అమిత్ షా తెలిపారు.
ఇది కూడా చదవండి: Israel: పాలస్తీనాలో బందీలుగా ఉన్న 10 మంది భారతీయుల్ని రక్షించిన ఇజ్రాయెల్