Bangladesh: బెదిరింపులతో బంగ్లా నుంచి భారత్ పారిపోయి వచ్చిన హిందూ బాలిక..
- మైనర్ హిందూ బాలికకు మతోన్మాదుల బెదిరింపులు..
- బంగ్లాదేశ్ నుంచి ఇండియాకు పారిపోయి వచ్చిన బాలిక..
Bangladesh: బంగ్లాదేశ్లో హిందువులపై అకృత్యాలు ఆడగం లేదు. ముఖ్యంగా ఇస్కాన్ సంస్థను టార్గెట్ చేస్తు్న్నారు. ఇప్పటికే ఈ సంస్థలో సంబంధం ఉన్న ప్రముఖ హిందూ నేత చిన్మోయ్ కృష్ణదాస్ని, మరికొందరు హిందూ మత గురువుల్ని అక్కడి అధికారులు అరెస్ట్ చేశారు. చిన్మోయ్ తరుపున వాదించే లాయర్లను కూడా అక్కడి ఇస్లామిస్ట్ రాడికల్స్ బెదిరిస్తు్న్నారు. హిందువుల ఆస్తులు, ఆలయాలు, వ్యాపారాలు, ఇళ్లపై దాడులు చేస్తున్నారు. అక్కడి మహ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం ఈ దాడుల్ని అరికట్టలేకపోతోంది.
Read Also: Chhattisgarh Encounter: భారీ ఎన్కౌంటర్.. 7 మంది నక్సలైట్లు హతం
Also Read
- Janasena Party: కర్ణాటకలో జనసేన విస్తరణకు శ్రీకారం.. పార్టీలో భారీగా చేరికలు
- What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
- West Bengal Assembly Election 2026: చివరి దశ ఓటింగ్కు సిద్ధమైన బెంగాల్.. భవానీపుర్లో మమతా-సువేందు ఫేస్ ఆఫ్
- The Lalit Hotel: ఢిల్లీలోని లగ్జరీ హోటల్కు వెయ్యి కోట్ల పెనాల్టీ! ఎందుకో తెలుసా?
ఇదిలా ఉంటే, తాజాగా ఇస్కాన్ భక్తురాలైన 17 ఏళ్ల మైనర్ బాలికను అక్కడి మత ఛాందసవాదులు బెదిరించారు. దీంతో ఆమె బంగ్లాదేశ్ నుంచి భారత్ పారిపోయి వచ్చింది. రాత్రి వేళల్లో పరిగెత్తుకుంటూ భారత సరిహద్దులోకి వచ్చింది. బీఎస్ఎఫ్ అధికారులు అదుపులోకి తీసుకుని బాలికనున పశ్చిమ బెంగాల్కి అప్పగించారు. గత కొంత కాలంలో తమ కుటుంబం బెదిరింపుల్ని ఎదుర్కొంటోందని, తమ కుటుంబాన్ని కిడ్నాప్ చేసి చంపేస్తామని బెదిరిస్తున్నారని, అందుకే దేశం వదిలి పారిపోయి వచ్చినట్లు చెప్పింది. భారత్ చేరడానికి ఎంత సమయంల పడుతుందో ఖచ్చితంగా తెలియకున్నా పరిగెత్తుకుంటూ సరిహద్దు వైపు వచ్చానని చెప్పింది. బాలికను బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్(బీఎస్ఎఫ్) అధికారులు పట్టుకుని జువైనల్ కస్టడీకి అప్పగించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పశ్చిమ బెంగాల్లోని దినాజ్పూర్ జిల్లా సరిహద్దు నుంచి టీనేజ్ యువతి అక్రమంగా సరిహద్దు దాటిందని, కొంతమంది బంధువులు భారత్లో నివసిస్తున్నారని, వారి ఇంటికి వెళ్తున్నట్లు చెప్పిందని పేర్కొన్నారు. బాలిక చెప్పిన విషయాలను అధికారులు పరిశోధిస్తున్నారు. సరిహద్దు దాటేందుకు ఎవరైనా సాయం చేశారా..? అనే కోణంలో విచారిస్తున్నారు. అమ్మాయికి జల్పాయిగురిలో బంధువులు ఉన్నట్లుగా తేలింది. బాలిక బంగ్లాదేశ్లోని పంచగఢ్ జిల్లా వాసి. కాలినడకన ఉత్తర దినాజ్పూర్ చోప్రా బ్లాక్లోని ఫతేపూర్ బోర్డర్ అవుట్పోస్ట్ సమీపానికి వచ్చిన సమయంలో బీఎస్ఎఫ్ అధికారులు గుర్తించారు.
It is heartbreaking and deeply distressing to learn about a minor girl from Bangladesh who, in sheer desperation, tried to cross into India alone, only to be arrested by the BSF and thrown into juvenile custody.
Her parents, both gravely ill, urged her to cross over to India… pic.twitter.com/3ZKnoA7yub
— Radharamn Das राधारमण दास (@RadharamnDas) December 11, 2024
తాజావార్తలు
-
Dacoit: ఓటీటీలోకి అడివి శేష్ ‘డెకాయిట్’.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్!
-
Ali Pervaiz Malik: పాక్ మంత్రి షాకింగ్ వ్యాఖ్యలు.. మా దగ్గర ఒక్క రోజుకు కూడా పెట్రోల్ లేదు.. భారత్తో మనం పోల్చుకోలేము
-
Aadarsha-kutumbam: వెంకీ మామ ‘ఆదర్శ కుటుంబం’లో వీరమల్లు బ్యూటీ..
-
Woman Assaulted in Train: కదిలే ట్రైన్లో దారుణం.. విశాఖ ఎక్స్ప్రెస్లో వివాహితపై అత్యాచారం..
-
Riyan Parag: వరుస వివాదాల్లో రాజస్థాన్ రాయల్స్.. డ్రెస్సింగ్ రూమ్లో రెడ్హ్యాండెడ్గా పట్టుబడ్డ కెప్టెన్..
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో