G20 Speakers Meet: అక్టోబర్ 12 నుంచి జీ20 పార్లమెంట్ స్పీకర్ల భేటీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
G20 Speakers Meet: ఈ నెల 8 నుంచి 10 వరకు దేశ రాజధాని న్యూఢిల్లీలో జీ-20 దేశాల సమ్మిట్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో దేశ రాజధాని ఢిల్లీలో ఈ నెల 8 నుంచి 10 వరకు మూడు రోజులు ప్రభుత్వ, ప్రైవేటు ఆఫీసులకు సైతం సెలవులు ప్రకటించారు. జీ-20 దేశాల సమావేశాల అనంతరం మరో అంతర్జాతీయ కార్యక్రమం నిర్వహించడానికి కేంద్రం సిద్ధమయింది. అదే పీ-20 పార్లమెంట్ స్పీకర్ల సమావేశం. జీ-20 కూటమి దేశాల పార్లమెంట్ స్పీకర్ల సమావేశం వచ్చే నెలలో ఢిల్లీలో జరగనుంది. అక్టోబర్ 12, 13, 14వ తేదీల్లో పార్లమెంట్ నూతన భవనం పీ–20 పార్లమెంట్ స్పీకర్ల భేటీకి వేదిక కానుందని జీ20 ఇండియా స్పెషల్ సెక్రటరీ ముక్తేశ్ పర్దేశి చెప్పారు. జీ20 సభ్య దేశాలు, ఆహ్వానిత దేశాల పార్లమెంట్ ప్రిసైడింగ్ అధికారులు పాల్గొని చర్చలు జరుపుతారని తెలిపారు.
Read Also: Software Deepthi: సాఫ్ట్వేర్ దీప్తి కేసు.. అదుపులో చెల్లి చందన, ఆమె ప్రియుడు
Also Read
- Vande Mataram Bill: వందేమాతరానికి అవమానం జరిగితే 3 ఏళ్ల జైలు శిక్ష.. కేంద్రం సరికొత్త బిల్లు!
- Marriage Bureau: 9 ఏళ్లుగా వధువు దొరకలేదు.. మ్యారేజ్ బ్యూరోకు కోర్టు ఫైన్..
- EPFO: ‘విశ్వాస్’ పథకాన్ని ప్రారంభించిన ఈపీఎఫ్వో.. ఎవరి కోసమంటే..!
- Rajasthan: ప్రియుడి ప్రైవేట్ పార్ట్ కోసేసిన ప్రియురాలు.. అద్భుతం చేసిన వైద్యులు..
“ఇది అన్ని G20 దేశాలు మరియు ఆహ్వానిత దేశాల నుండి పార్లమెంటు స్పీకర్లు మరియు ప్రిసైడింగ్ అధికారులకు సంబంధించిన సమావేశం. ఇది అక్టోబర్ 12 మరియు 14 మధ్య కొత్త పార్లమెంటు భవనంలో జరుగుతుంది” అని ఆయన చెప్పారు. “ప్రజాస్వామ్యానికి తల్లిగా భారతదేశం ప్రధాన కథనాల్లో ఒకటి. కాబట్టి, ఆ రోజుల్లో ఢిల్లీలో పార్లమెంటు స్పీకర్లు దిగినప్పుడు, మా చర్చల ద్వారా కీలక సందేశం రూపొందించనున్నామని.. దానిని బహిర్గతపరుస్తామని పరదేశి అన్నారు.‘పార్లమెంటేరియన్లు సంబంధిత ప్రభుత్వాలకు మార్గనిర్దేశం చేయడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తారు కాబట్టి, పీ20 సమావేశాలు ప్రపంచ పాలనకు పార్లమెంటరీ కోణాన్ని తీసుకురావడం, అవగాహన పెంచడం, అంతర్జాతీయ నిబంధనలకు రాజకీయ మద్దతును సాధించడం, వీటిని సమర్థంగా కార్యరూపం దాల్చేలా చేయడమే ఈ సమావేశాల లక్ష్యం’అనిముక్తేశ్ వివరించారు. భారత్ను ప్రజాస్వామ్యానికి తల్లిగా చూపేందుకు ఉద్దేశించిన ఒక ఎగ్జిబిషన్ను కూడా ఏర్పాటు చేశామన్నారు. 2010లో జీ20 అధ్యక్ష స్థానంలో కెనడా ఉన్నప్పటి నుంచి పీ20 గ్రూప్ భేటీలు జరుగుతున్నాయని గుర్తు చేసిన ఆయన .. ఆ క్రమంలో ఇది 9వ సమావేశం అని తెలిపారు.
తాజావార్తలు
-
FIFA Final: 96 ఏళ్ల సాకర్ చరిత్రలో తొలిసారి.. వరల్డ్ కప్ ఫైనల్ విజేతలకు ‘ఛాంపియన్షిప్ రింగ్స్’..
-
Earthquake: మెక్సికోలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
-
Rohit-Kohli Retirement: లార్డ్స్ వేదికగా రోహిత్, కోహ్లీ ఇద్దరూ గుడ్ బై చెప్పేస్తారా..? క్రీడా వర్గాల్లో కలకలం..
-
Pakistan: కువైట్తో రక్షణ ఒప్పందానికి పాక్ ప్రయత్నాలు.. సౌదీ తర్వాత కొత్త వ్యూహం?
-
Sir Garfield Sobers: ఇక సెలవు.. 6 బంతుల్లో 6 సిక్సర్లు కొట్టిన తొలి మొనగాడు.. రికార్డులు చూస్తే షాక్ అవ్వాల్సిందే!
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?