తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్కు బిగ్ షాక్ తగిలింది. రాజ్యసభ ఆశలు ఆవిరయ్యాయి. కాంగ్రెస్ చేస్తున్న ప్రయత్నాలు చిత్తులయ్యాయి. ఊహించని రీతిలో మధ్యప్రదేశ్లో ముగ్గురు బీజేపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లుగా రిటర్నింగ్ అధికారి ప్రకటించారు. దీంతో మీనాక్షి నటరాజన్కు, కాంగ్రెస్కు గట్టి దెబ్బ తగిలినట్లైంది.
మధ్యప్రదేశ్ నుంచి మీనాక్షి నటరాజన్ రాజ్యసభకు నామినేషన్ దాఖలు చేశారు. అనూహ్యంగా రిటర్నింగ్ అధికారి నామినేషన్ తిరస్కరించారు. దీంతో కాంగ్రెస్ ఒక్కసారిగా షాక్ అయింది. హైదరాబాద్లో నమోదైన ఒక కేసు విషయాన్ని అఫిడవిట్లో ప్రస్తావించలేదని అధికారి పేర్కొన్నారు. అయితే తనపై ఎలాంటి క్రిమినల్ కేసులు లేవని మీనాక్షి నటరాజన్ వాదించారు. అయినా కూడా అధికారి పరిగణనలోకి తీసుకులేదు. దీంతో కాంగ్రెస్ ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. కానీ ఈసీ నుంచి ఎటువంటి స్పందన రాలేదు. దీంతో గురువారం మీనాక్షి నటరాజన్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే పిటిషన్ను శుక్రవారం విచారించనుంది. మరోవైపు రాష్ట్రపతి అపాయింట్మెంట్ను మధ్యప్రదేశ్ ఎమ్మెల్యేలు కోరారు. నిరసన తెలిపేందుకు రెడీ అవుతున్నారు. కానీ ఇంతలోనే ముగ్గురు బీజేపీ అభ్యర్థులు గెలిచినట్లుగా రిటర్నింగ్ అధికారి ప్రకటించడంతో కాంగ్రెస్ నేతలు అవాక్కయ్యారు.
BJP leader Tarun Chugh receives the certificate of election from Returning Officer Arvind Sharma after being elected to the Rajya Sabha from Madhya Pradesh. pic.twitter.com/qCxFecpNOG
— ANI (@ANI) June 11, 2026

