Amit Shah: కాశ్మీర్కి ‘‘ఋషి కశ్యప’’ పేరు.. అమిత్ షా కీలక వ్యాఖ్యలు..
- కాశ్మీర్కి ఋషి కశ్యపుడి పేరు పెట్టవచ్చు..
- సంచలన ప్రకటన చేసిన కేంద్రమంత్రి అమిత్ షా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Amit Shah: కాశ్మీర్కి హిందూమతంలో గౌరవనీయులైన ఋషి కశ్యపుడి పేరు పెట్టడం సాధ్యమేనని కేంద్ర హోం మంత్రి అమిత్ షా గురువారం అన్నారు. ఢిల్లీలో ‘‘జమ్మూ కాశ్మీర్ అండ్ లడఖ్ త్రూ ది ఏజెస్’’ పుస్తకాన్ని విడుదల చేసిన సందర్భంగా ఆయన మాట్లాడారు. కాశ్మీరు కశ్యపుడి భూమి అని మనందరకి తెలుసు, కాశ్మీర్కు ఋషి కశ్యపుడి పేరు పెట్టే అవకాశం ఉంది అని అన్నారు. దేశానికి స్వాతంత్రం వచ్చిందని, సరైన విషయాలను ప్రజలకు అందించాలని అన్నారు. “భారతదేశ అభివృద్ధికి జమ్మూ కాశ్మీర్ గణనీయంగా దోహదపడింది. మేము కాశ్మీర్ యొక్క సాంస్కృతిక వైభవాన్ని సాధిస్తాము,” అని చెప్పారు.
Read Also: Adani bribery case: అదానీకి అమెరికా షాక్.. సంయుక్త విచారణకు ఆదేశం..
Also Read
- Cockroach Janta Party: ఎంతకీ వదలని కాక్రోజ్.. ఎక్స్ అకౌంట్ బ్లాక్ చేసిన వెంటనే కొత్త అకౌంట్ ప్రత్యక్షం!
- Cabinet Meeting: ప్రధాని మోడీ నేతృత్వంలో 4.5 గంటల కేబినెట్ భేటీ.. ఏం చర్చించారంటే..?
- What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
- Pulwama Attack: పాక్ ఆక్రమిత కాశ్మీర్లో పుల్వామా దాడి సూత్రధారి.. హమ్జా బుర్హాన్ను కాల్చి చంపిన దుండగులు
భౌగోళిక, రాజకీయ సరిహద్దులు కాకుండా సాంస్కృతిక సరిహద్దులు ఉన్న ఏకైక దేశం భారతదేశమే అని అమిత్ షా అన్నారు. కాశ్మీర్లో శంకరాచార్య, సిల్క్ రూట్, హేమిష్ మఠం భారతీయ సంస్కృతితో ముడిపడి ఉందని చెప్పారు. కశ్మీర్ ఎప్పటికీ భారత్లో అంతర్భాగమేనని, అలాగే ఉంటుందని షా పునరుద్ఘాటించారు. లడఖ్లోని దేవాలయాలను ధ్వంసం చేయడం, కాశ్మీర్లో సంస్కృతం ఉపయోగించడం భారతీయ నాగరికతతో ఈ ప్రాంతానికి ఉన్న లోతైన సంబంధానికి నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. స్వాతంత్య్రానంతరం జరిగిన పొరపాట్లను కూడా ఈ పుస్తకం ప్రస్తావించిందని చెప్పారు.
కాశ్మీర్లో ప్రత్యేక హక్కులను కల్పించిన ఆర్టికల్ 370, ఆర్టికల్ 35ఏని అమిత్ షా విమర్శించారు. ఈ నిబంధనలు దేశం ఐక్యంగా ఉండకుండా నిరోధించాయని చెప్పారు. ఈ నిబంధనలను నరేంద్రమోడీ నేతృత్వంలోని ప్రభుత్వం తొలగించి, కాశ్మీర్ అభివృద్ధికి మార్గం సుగమం చేసిందని అన్నారు. ఆర్టికల్ 370 కశ్మీరీలలో వేర్పాటువాద బీజాన్ని నాటిందని, వీటి తొలగింపు తర్వాత లోయలో ఉగ్రవాదం తగ్గిందని అమిత్ షా చెప్పారు. కేంద్రం ప్రభుత్వం 2019 ఆగస్టులో ఈ రెండు ప్రత్యేక ఆర్టికల్స్ని తొలగించింది.
తాజావార్తలు
-
ITR Filing Deadline Alert: పన్ను చెల్లింపుదారులకు అలర్ట్.. ఈ తేదీ తర్వాత ITR దాఖలు చేస్తే రూ. 5,000 జరిమానా!
-
Shubman Gill: “ఆ ఒక్క విజయం మమ్మల్ని మార్చేసింది”.. గుజరాత్ విజయరహస్యం చెప్పిన కెప్టెన్ గిల్
-
Cockroach Janta Party: ఎంతకీ వదలని కాక్రోజ్.. ఎక్స్ అకౌంట్ బ్లాక్ చేసిన వెంటనే కొత్త అకౌంట్ ప్రత్యక్షం!
-
Rakul Preet Singh: “మోసం చేస్తే వదిలేస్తా”.. పెళ్లి తర్వాత రిలేషన్పై రకుల్ షాకింగ్ కామెంట్స్!
-
Dog Nanny Jobs: ఆశ్చర్యంగా అనిపించినా ఇది నిజం.. కుక్కను చూసుకుంటే చాలు.. లక్షల్లో జీతం..!
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!