Math Teacher Thrashed By Students: తక్కువ మార్కులు ఇచ్చిన మాథ్స్ టీచర్.. చెట్టుకట్టేసి చితకబాదిన విద్యార్థులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Math Teacher Thrashed By Students in Jharkhand: తక్కువ మార్కులు ఇచ్చాడని ఏకంగా ఉపాధ్యాయుడినే చెట్టుకు కట్టేసి చితకబాదారు విద్యార్థులు. టీచర్ తో పాటు క్లర్కును కూడా విద్యార్థులు వదిలిపెట్టలేదు. ఇద్దర్ని చెట్టుకు కట్టేసి చితక్కొట్టారు. ఈ ఘటన జార్ఖండ్ రాష్ట్రం దుమ్కా జిల్లాలో సోమవారం జరిగింది. 9 వ తరగతి ప్రాక్టికల్ పరీక్షలో తక్కువ మార్కులు వేశాడని.. మాథ్స్ టీచర్ తో పాటు గుమాస్తాను చెట్టుకు కట్టేసి కొట్టినట్లు పోలీసులు మంగళవారం తెలిపారు. అయితే ఈ ఘటనపై స్కూల్ యాజమాన్యం నుంచి ఎలాంటి ఫిర్యాదు అందలేదని.. పోలీసులు వెల్లడించారు.
జార్ఖండ్ దుమ్కా జిల్లా గోపికందర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రభుత్వ షెడ్యూల్డ్ ట్రైబ్ రెసిడెన్షియల్ స్కూల్ లో విద్యార్థులు గణిత ఉపాధ్యాయుడిని కొట్టారు. జార్ఖండ్ అకడమిక్ కౌన్సిల్ ( జేఏసీ) శనివారం విడుదల చేసిన ఫలితాల్లో 9వ తరగతి చదువుతున్న 32 మందిలో 11 మంది విద్యార్థులు గ్రేడ్-డీడీ పొందారు. వీరంతా ఫెయిల్ అయ్యారు. అయతే తమకు ప్రాక్టికల్స్ లో గణిత ఉపాధ్యాయుడు తక్కువ మార్కులు వేశాడని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. తమకు తక్కువ మార్కులను క్లర్క్ అప్ లోడ్ చేశాడని విద్యార్థులు చెబుతున్నారు.
Also Read
- VB-G RAM G Scheme: వీబీ-జీ రామ్ జీ పథకం.. తొలి నెలలోనే 50% తగ్గిన గ్రామీణ ఉపాధి..!
- Maggi Noodles Case: మ్యాగీ లీడ్ వివాదానికి మరో ట్విస్ట్.. కేసులు కొట్టేసిన ఢిల్లీ హైకోర్టు
- Jharkhand JPSC Exam Scam: జార్ఖండ్ JPSC పరీక్షలో అవకతవకలు.. రంగంలోకి ఈడీ, దర్యాప్తు ముమ్మరం
- PM Modi: ‘జో ఖేలేగా, వో ఖిలేగా’.. కామన్వెల్త్ పతక విజేతలతో మోడీ భేటీ, వీడియో వైరల్
Read Also: COVID 19: ఇండియాలో కొత్తగా 7 వేల కరోనా కేసులు.. కేరళలోనే ఎక్కువ మరణాలు
ఈ సంఘటనపై పాఠశాల యాజమాన్యం ఎలాంటి ఫిర్యాదు ఇవ్వలేదని పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అయితే విద్యార్థుల భవిష్యత్ పాడవుతుందనే ఉద్దేశ్యంతో పాఠశాల యాజమాన్యం ఫిర్యాదు చేయలేదు. దెబ్బలు తిన్న ఉపాధ్యాయుడిని సుమన్ కుమార్, క్లర్క్ సోనే రామ్ చౌరేగా గుర్తించారు. రెసిడెన్షియల్ పాఠశాలలో మొత్తం 200 మంది విద్యార్థులు ఉన్నారని.. ఈ సంఘటనలో ఎక్కువ మంది విద్యార్థులు పాల్గొన్నట్లు తెలుస్తోంది. గతంలో ప్రిన్స్ పాల్ గా పనిచేసిన బాధిత ఉపాధ్యాయుడు సుమన్ కుమార్ ను కొన్ని ఆరోపణలపై ప్రధానోపాధ్యాయుడి నుంచి తొలగించారు. అయితే విద్యార్థులు ప్రాక్టికల్స్ లో తక్కువ మార్కులు సాధించినందుకే ఫెయిల్ అయ్యారా.. లేకపోతే థియరీ పేపర్ లో విఫలం అయ్యారా..? అనేది స్పష్టంగా తెలియరాలేదు.
తాజావార్తలు
-
Kollywood : శంకర్ దర్శకత్వంలో అజిత్ కుమార్ సినిమా?
-
India vs Sri Lanka: ఒకప్పుడు భారత్కు ప్రపంచకప్ అందించాడు.. ఇప్పుడు ఆ జట్టునే ఓడించేందుకు ప్లాన్..!
-
Haryana Viral Video: జుట్టు పట్టుకుని ఈడ్చి.. కింద పడేసి.. భార్యపై నడిరోడ్డుపైనే భర్త ఎలా దాడి చేశాడంటే?
-
VB-G RAM G Scheme: వీబీ-జీ రామ్ జీ పథకం.. తొలి నెలలోనే 50% తగ్గిన గ్రామీణ ఉపాధి..!
-
Maggi Noodles Case: మ్యాగీ లీడ్ వివాదానికి మరో ట్విస్ట్.. కేసులు కొట్టేసిన ఢిల్లీ హైకోర్టు
ట్రెండింగ్
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!