Math Teacher Thrashed By Students: తక్కువ మార్కులు ఇచ్చిన మాథ్స్ టీచర్.. చెట్టుకట్టేసి చితకబాదిన విద్యార్థులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Math Teacher Thrashed By Students in Jharkhand: తక్కువ మార్కులు ఇచ్చాడని ఏకంగా ఉపాధ్యాయుడినే చెట్టుకు కట్టేసి చితకబాదారు విద్యార్థులు. టీచర్ తో పాటు క్లర్కును కూడా విద్యార్థులు వదిలిపెట్టలేదు. ఇద్దర్ని చెట్టుకు కట్టేసి చితక్కొట్టారు. ఈ ఘటన జార్ఖండ్ రాష్ట్రం దుమ్కా జిల్లాలో సోమవారం జరిగింది. 9 వ తరగతి ప్రాక్టికల్ పరీక్షలో తక్కువ మార్కులు వేశాడని.. మాథ్స్ టీచర్ తో పాటు గుమాస్తాను చెట్టుకు కట్టేసి కొట్టినట్లు పోలీసులు మంగళవారం తెలిపారు. అయితే ఈ ఘటనపై స్కూల్ యాజమాన్యం నుంచి ఎలాంటి ఫిర్యాదు అందలేదని.. పోలీసులు వెల్లడించారు.
జార్ఖండ్ దుమ్కా జిల్లా గోపికందర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రభుత్వ షెడ్యూల్డ్ ట్రైబ్ రెసిడెన్షియల్ స్కూల్ లో విద్యార్థులు గణిత ఉపాధ్యాయుడిని కొట్టారు. జార్ఖండ్ అకడమిక్ కౌన్సిల్ ( జేఏసీ) శనివారం విడుదల చేసిన ఫలితాల్లో 9వ తరగతి చదువుతున్న 32 మందిలో 11 మంది విద్యార్థులు గ్రేడ్-డీడీ పొందారు. వీరంతా ఫెయిల్ అయ్యారు. అయతే తమకు ప్రాక్టికల్స్ లో గణిత ఉపాధ్యాయుడు తక్కువ మార్కులు వేశాడని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. తమకు తక్కువ మార్కులను క్లర్క్ అప్ లోడ్ చేశాడని విద్యార్థులు చెబుతున్నారు.
Also Read
- Kolkata Airport Mosque: ముగ్గురు సీఎంలు టచ్ చేయలేకపోయారు.. సువేందు రాకతో ఎయిర్పోర్టు మసీదు తరలింపు.!
- iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
- Raghav Chadha: రాఘవ్ చద్దాకు కీలక పదవి.. ప్రత్యేక బాధ్యతలు అప్పగించిన రాజ్యసభ ఛైర్మన్
- Sonam Wangchuk: "నేపాల్లో జరిగినట్లే భారత్లో కూడా".. ‘కాక్రోచ్’ ఉద్యమంపై సోనం వాంగ్చుక్ హెచ్చరిక
Read Also: COVID 19: ఇండియాలో కొత్తగా 7 వేల కరోనా కేసులు.. కేరళలోనే ఎక్కువ మరణాలు
ఈ సంఘటనపై పాఠశాల యాజమాన్యం ఎలాంటి ఫిర్యాదు ఇవ్వలేదని పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అయితే విద్యార్థుల భవిష్యత్ పాడవుతుందనే ఉద్దేశ్యంతో పాఠశాల యాజమాన్యం ఫిర్యాదు చేయలేదు. దెబ్బలు తిన్న ఉపాధ్యాయుడిని సుమన్ కుమార్, క్లర్క్ సోనే రామ్ చౌరేగా గుర్తించారు. రెసిడెన్షియల్ పాఠశాలలో మొత్తం 200 మంది విద్యార్థులు ఉన్నారని.. ఈ సంఘటనలో ఎక్కువ మంది విద్యార్థులు పాల్గొన్నట్లు తెలుస్తోంది. గతంలో ప్రిన్స్ పాల్ గా పనిచేసిన బాధిత ఉపాధ్యాయుడు సుమన్ కుమార్ ను కొన్ని ఆరోపణలపై ప్రధానోపాధ్యాయుడి నుంచి తొలగించారు. అయితే విద్యార్థులు ప్రాక్టికల్స్ లో తక్కువ మార్కులు సాధించినందుకే ఫెయిల్ అయ్యారా.. లేకపోతే థియరీ పేపర్ లో విఫలం అయ్యారా..? అనేది స్పష్టంగా తెలియరాలేదు.
తాజావార్తలు
-
Rahman : ‘పెద్ది’ ఆ కోరిక తీర్చింది!
-
Ram Charan: నా కెరీర్లోనే ‘పెద్ది’ నంబర్ వన్ చిత్రం
-
AP Film Corporation: ఏపీ ఫిల్మ్ కార్పొరేషన్ నూతన బోర్డు ఏర్పాటు
-
OTR : పాలమూరు కాంగ్రెస్లో రచ్చ రచ్చ.. సిటీ ప్రెసిడెంట్ పదవి కోసం కుమ్ములాట!
-
Wife Murder: బీమా డబ్బుల కోసం.. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను కొట్టి చంపేసిన కీచక భర్త..!
ట్రెండింగ్
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
-
Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?
-
Natural Home Remedy: తెల్ల జుట్టుకు సింపుల్ “హోమ్ రెమిడీ”.. ఆ మూడు పదార్థాలతో ఉంటే చాలు.. నేచురల్గా హెయిర్ కలర్ రెడీ.!
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?