Math Teacher Thrashed By Students: తక్కువ మార్కులు ఇచ్చిన మాథ్స్ టీచర్.. చెట్టుకట్టేసి చితకబాదిన విద్యార్థులు
Math Teacher Thrashed By Students in Jharkhand: తక్కువ మార్కులు ఇచ్చాడని ఏకంగా ఉపాధ్యాయుడినే చెట్టుకు కట్టేసి చితకబాదారు విద్యార్థులు. టీచర్ తో పాటు క్లర్కును కూడా విద్యార్థులు వదిలిపెట్టలేదు. ఇద్దర్ని చెట్టుకు కట్టేసి చితక్కొట్టారు. ఈ ఘటన జార్ఖండ్ రాష్ట్రం దుమ్కా జిల్లాలో సోమవారం జరిగింది. 9 వ తరగతి ప్రాక్టికల్ పరీక్షలో తక్కువ మార్కులు వేశాడని.. మాథ్స్ టీచర్ తో పాటు గుమాస్తాను చెట్టుకు కట్టేసి కొట్టినట్లు పోలీసులు మంగళవారం తెలిపారు. అయితే ఈ ఘటనపై స్కూల్ యాజమాన్యం నుంచి ఎలాంటి ఫిర్యాదు అందలేదని.. పోలీసులు వెల్లడించారు.
జార్ఖండ్ దుమ్కా జిల్లా గోపికందర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రభుత్వ షెడ్యూల్డ్ ట్రైబ్ రెసిడెన్షియల్ స్కూల్ లో విద్యార్థులు గణిత ఉపాధ్యాయుడిని కొట్టారు. జార్ఖండ్ అకడమిక్ కౌన్సిల్ ( జేఏసీ) శనివారం విడుదల చేసిన ఫలితాల్లో 9వ తరగతి చదువుతున్న 32 మందిలో 11 మంది విద్యార్థులు గ్రేడ్-డీడీ పొందారు. వీరంతా ఫెయిల్ అయ్యారు. అయతే తమకు ప్రాక్టికల్స్ లో గణిత ఉపాధ్యాయుడు తక్కువ మార్కులు వేశాడని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. తమకు తక్కువ మార్కులను క్లర్క్ అప్ లోడ్ చేశాడని విద్యార్థులు చెబుతున్నారు.
Also Read
- What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
- India Defense Budget: సాహో భారత్.. పాకిస్థాన్ను గజగజలాడిస్తున్న ఇండియా రక్షణ బడ్జెట్.. చైనా సాయం ఉన్నా దాయాదికి వణుకు పుట్టాల్సిందే!
- SAD: బిర్యానీ తిన్న తర్వాత పుచ్చకాయ తిని.. ఒకే కటుంబానికి చెందిన 4 గురు మృతి..
- Producing States in India: భారత్లో 'పెట్రోల్' బావులు ఏయే రాష్ట్రాల్లో ఉన్నాయో తెలుసా?
Read Also: COVID 19: ఇండియాలో కొత్తగా 7 వేల కరోనా కేసులు.. కేరళలోనే ఎక్కువ మరణాలు
ఈ సంఘటనపై పాఠశాల యాజమాన్యం ఎలాంటి ఫిర్యాదు ఇవ్వలేదని పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అయితే విద్యార్థుల భవిష్యత్ పాడవుతుందనే ఉద్దేశ్యంతో పాఠశాల యాజమాన్యం ఫిర్యాదు చేయలేదు. దెబ్బలు తిన్న ఉపాధ్యాయుడిని సుమన్ కుమార్, క్లర్క్ సోనే రామ్ చౌరేగా గుర్తించారు. రెసిడెన్షియల్ పాఠశాలలో మొత్తం 200 మంది విద్యార్థులు ఉన్నారని.. ఈ సంఘటనలో ఎక్కువ మంది విద్యార్థులు పాల్గొన్నట్లు తెలుస్తోంది. గతంలో ప్రిన్స్ పాల్ గా పనిచేసిన బాధిత ఉపాధ్యాయుడు సుమన్ కుమార్ ను కొన్ని ఆరోపణలపై ప్రధానోపాధ్యాయుడి నుంచి తొలగించారు. అయితే విద్యార్థులు ప్రాక్టికల్స్ లో తక్కువ మార్కులు సాధించినందుకే ఫెయిల్ అయ్యారా.. లేకపోతే థియరీ పేపర్ లో విఫలం అయ్యారా..? అనేది స్పష్టంగా తెలియరాలేదు.
తాజావార్తలు
-
Divya Sathyaraj: పెళ్లి లేకుండానే తల్లిని అవుతా.. కట్టప్ప కూతురు సెన్సేషనల్ కామెంట్స్!
-
YSRCP Protest: డీజిల్, పెట్రోల్ కొరత.. ఆందోళనలకు వైసీపీ పిలుపు..
-
Nandamuri Balakrishna : బాలయ్య నీ స్పీడ్ ఏంటయ్యా.. ఒకేసారి రెండు సినిమాలు
-
Virat Kohli: ఆకాశమే హద్దుగా కోహ్లీ రికార్డుల వేట.. ఐపీఎల్లో ఈ ఘనత సాధించిన ఏకైక ప్లేయర్ విరాట్..
-
Indonesia: ఇండోనేషియాలో రెండు రైళ్లు ఢీ.. నలుగురు మృతి
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!