Yogi Adityanath: “అతను ఎలాగైనా చావాల్సిందే”.. గ్యాంగ్స్టర్ అన్సారీ మరణంపై సీఎం యోగి కామెంట్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Yogi Adityanath: ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మార్చి 28న బండా జైలులో గ్యాంగ్ స్టర్ ముఖ్తార్ అన్సారీ మరణించడంపై ఆయన వ్యాఖ్యానించారు. నేషనల్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, ‘అతను ఎలాగైనా చనిపోవాలి’ అని అన్నారు. అన్సారీ మరణంపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. జైలులో అతనికి పాయిజన్ ఇచ్చి చంపారని అతని కొడుకుతో పాటు ఇతర కుటుంబ సభ్యులు ఆరోపించారు. అయితే, పోస్టుమార్టం నివేదికలో మాత్రం అతను గుండెపోటుతో మరణించినట్లు తేలింది.
Read Also: Tamil Nadu: మహిళను చంపి, గొయ్యి తవ్వుతుండగా రెండ్ హ్యాండెడ్గా పట్టుబడ్డ నిందితులు..
Also Read
- Hindu Rate of Growth: ప్రధాని మోడీ ప్రస్తావించిన 'హిందూ గ్రోత్ రేట్' అంటే ఏంటి? షాకింగ్ నిజాలు..
- Excise Duty: వాహనదారులకు బంపర్ ఆఫర్.. ఆ పెట్రోల్పై ఎక్సైజ్ డ్యూటీ పూర్తిగా రద్దు చేసిన కేంద్రం!
- Asaduddin Owaisi: ‘‘ఆరుగురు పిల్లలు ఉన్నంత మాత్రాన..’’ ఓటర్ల జాబితా మ్యాపింగ్పై ఓవైసీ ఆగ్రహం..
- Success Story: వయసు 23 ఏళ్లు.. ఏకంగా 19 ప్రభుత్వ ఉద్యోగాలు.. ఆమె విజయ రహస్యం ఇదే..
గ్యాంగ్ స్టర్ మరణానికి సంబంధించిన ప్రశ్నపై యోగి ఆదిత్యనాథ్ స్పందిస్తూ, అతను ఎలాగైనా చనిపోవాల్సిందే, మీరే చెప్పండి, వందలాది మందిని చంపిన వ్యక్తి ఎంతకాలం తప్పించుకుంటాడు..? అని అన్నారు. అన్సారీ మరణంపై ప్రతిపక్షాలు ప్రశ్నలు లేవనెత్తిన తరుణంలో ఆ పార్టీపై యోగి ఫైర్ అయ్యారు. ‘‘ కాంగ్రెస్ పార్టీ నేతలు అతడిని రక్షించేందుకు తమ శాయశక్తులా ప్రయత్నించారు. సమాజ్వాదీ పార్టీ నేతలు ఆయన రక్షకులు, ప్రతిపక్షాల నుంచి ఇంకేం ఆశించగలం..?’’ అని అన్నారు.
యూపీ మాజీ సీఎం, రామభక్తుడు కళ్యాణ్ సింగ్ మరణించినప్పుడు సమాజ్వాదీ, కాంగ్రెస్ పార్టీ నేతలు సంతాపం వ్యక్తం చేయలేదు, కానీ ఓ మాఫియా డాన్ చనిపోతే మొసలి కన్నీరు కారుస్తున్నారని యోగి మండిపడ్డారు. ఉత్తర్ ప్రదేశ్ నుంచి 5 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన అన్సారీ మార్చి 28న బండా జైలులో గుండెపోటుతో మరణించాడు. అతని మరణం తర్వాత ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీతో పాటు యూపీ మాజీ సీఎం, ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్, ఇతర నేతలు ఆయన ఇంటికి వెళ్లి పరామర్శించారు.
Had to die anyway !
The criminals who have killed hundreds of innocent people and committed mass crimes
(Mukhtar special) pic.twitter.com/s7J4dAbG87
— Megh Updates 🚨™ (@MeghUpdates) May 11, 2024
తాజావార్తలు
-
EDLI Scheme: పీఎఫ్ ఖాతా ఉందా? ఉచితంగా రూ.7 లక్షల జీవిత బీమా.. EPF అందించే ఈ ప్రయోజనం గురించి తెలుసా?
-
Women’s T20 World Cup 2026 టైటిల్ గెలిచే సత్తా ఉందా.? హర్మన్ప్రీత్ సేన బలాలు, బలహీనతలు ఇవే.!
-
Hindu Rate of Growth: ప్రధాని మోడీ ప్రస్తావించిన ‘హిందూ గ్రోత్ రేట్’ అంటే ఏంటి? షాకింగ్ నిజాలు..
-
Ravi Mohan Reunion Rumors : గర్ల్ ఫ్రెండ్ తో రవి మోహన్ ప్యాచప్… అసలేం జరుగుతోంది ?
-
2027 ODI World Cup: ఇక అంతా వారి చేతుల్లోనే.. 2027 వన్డే ప్రపంచకప్లో రో-కో ఆడతారా?
ట్రెండింగ్
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!