NTV Telugu Site icon

Nithish kumar: బిహార్ సీఎం కార్యాలయానికి బాంబు బెదిరింపు.. కోల్‌కతాలో నిందితుడి అరెస్ట్..!

Bihar

Bihar

Nithish kumar: బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ కార్యాలయాన్ని పేల్చి వేస్తామని బెదిరింపు ఈ మెయిల్ పంపిన వ్యక్తిని కోల్‌కతాలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని బిహార్‌లోని బెగూసరాయ్‌కు చెందిన జాహిద్‌గా గుర్తించినట్లు తెలిపారు. ఈ నెల 3న బిహార్ సీఎం క్యాంప్ ఆఫీస్ ను పేల్చి వేస్తామని ఈ మెయిల్ ద్వారా హెచ్చరిస్తూ వచ్చింది. ఉగ్రవాద సంస్థ అల్-ఖైదా పేరుతో ఈ ఇన్ఫర్మెషన్ పంపించారు. దీంతో వెంటనే అలర్ట్ అయినా పోలీసులు తనిఖీలు చేపట్టారు. దీనిపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఈ నేపథ్యంలోనే తాజాగా కోల్‌కతాలో బౌబజార్ ప్రాంతంలో జాహిద్‌ను అరెస్టు చేశారు.

Read Also: Nandamuri : ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు.. నందమూరి ఫ్యాన్స్ కు పండగే..

కాగా, జాహిద్ కోల్‌కతాలో ఓ పాన్ షాప్ నడిపిస్తూ జీవనం కొనసాగిస్తు్న్నట్టు పేర్కొన్నారు. ఆయన దగ్గర నుంచి ఓ మొబైల్ ఫోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే అల్-ఖైదాతో సంబంధం ఉన్నట్లు ఈ మెయిల్‌లో పేర్కొన్నప్పటికీ.. అతడికి ఏ టెర్రరిస్ట్ సంస్థతోనూ సంబంధాలు లేవని స్పష్టం చేశారు. రిమాండ్ పొందిన తర్వాత నిందితుడిని పాట్నాకు తీసుకు వచ్చి ఎంక్వైరీ చేస్తున్నారు. అయితే, ఈ మెయిల్ పంపడానికి గల కారణం ఇప్పటి వరకు తెలియరాలేదు. తన బంధువులను ఇరికించడానికే జాహిద్ బెదిరింపు ఈ- మెయిల్ పంపినట్టు పలు వార్తలు పేర్కొన్నాయి.