TMC Crisis: తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) వర్గపోరు కీలక మలుపు తీసుకుంది. పార్టీకి చెందిన అసలు పేరు, ఎన్నికల గుర్తును కేంద్ర ఎన్నికల సంఘం తాత్కాలికంగా ఫ్రీ్ చేసింది. ఈ నేపథ్యంలో మమతా బెనర్జీ నేతృత్వంలోని వర్గానికి ‘మమతా ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్’ అనే పేరుతో పాటు ‘ఫుట్బాల్ ప్లేయర్’ గుర్తును కేటాయించింది. ఇక తిరుగుబాటు వర్గమైన రిటబ్రత బెనర్జీ వర్గానికి డెమోక్రటిక్ తృణమూల్ కాంగ్రెస్’ అనే పేరు, ‘ఎన్వలప్/కవర్’ గుర్తును ఇచ్చింది. అక్టోబర్ 6న పశ్చిమ బెంగాల్లో జరగబోయే ఉప ఎన్నికల్లో ఈ గుర్తులపైనే పోటీ చేయబోతున్నారు.
దీనికి ముందు తృణమూల్ కాంగ్రెస్కు మూడు దశాబ్ధాలుగా ఉన్న ‘ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్’ పేరును, దాని రెండు ఆకుల గుర్తును ఈసీ ఫ్రీజ్ చేసింది. దీంతో రెండు వర్గాలు ఈ పేరు, గుర్తు వాడకుండా బరిలోకి దిగాల్సిన పరిస్థితి ఏర్పడింది. మమతా వర్గం ఈసీ చర్యల్ని తీవ్రంగా వ్యతిరేకించింది. టీఎంసీ ఎంపీ కళ్యాణ్ బెనర్జీ మాట్లాడుతూ.. ఈ ఉత్తర్వులు చట్టవిరుద్ధమని విమర్శించారు. మరోవైపు తిరుగుబాటు వర్గం ఈ నిర్ణయాన్ని స్వాగతించింది. తమకు ‘పువ్వులు-గడ్డి’ గుర్తే కావాలని, తుది నిర్ణయం తమకు పార్టీ పేరు, గుర్తును అందిస్తుందని ఆశాభావం వ్యక్తం చేసింది.
2026 పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ ఘోర ఓటమి తర్వాత, తృణమూల్ రెండుగా విడిపోయింది. మొత్తం 80 మంది ఎమ్మెల్యేలు గెలిస్తే, 58 మంది రిటబ్రత బెనర్జీ నేతృత్వంలో మమతా బెనర్జీపై తిరుగుబాటు చేశారు. వీరికి అసెంబ్లీ స్పీకర్ గుర్తింపు కూడా లభించింది. ఇదిలా ఉంటే, లోక్సభ ఎంపీలు కూడా తిరుగుబాటు చేశారు. 20 మంది ఎంపీలు సీనియర్ నేత కాకోలి ఘోష్ దస్తిదార్ నేతృత్వంలో NCPIలో చేరి, బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే మద్దతు ప్రకటించారు.

