Mamata Banerjee: నేను ఓడిపోలేదు.. రాజీనామా చేసే ప్రసక్తేలేదు.. మమత సంచలన ప్రకటన
- మమత సంచలన ప్రకటన
- ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయనని ప్రకటన
- దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసే ప్రసక్తేలేదని మమతా బెనర్జీ ప్రకటించారు. పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఫలితాల తర్వాత మమత మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘నేను ఓడిపోలేదు.. రాజీనామా చేయను. లోక్భవన్కు వెళ్లి గవర్నర్ను కూడా కలవను. తన ఓటమికి ఎన్నికల సంఘమే కారణం. 100 సీట్లను బీజేపీ దొంగిలించింది. కౌంటింగ్ కేంద్రానికి వచ్చినప్పుడు తనపై దాడి కూడా జరిగింది.’’ అని మమత ఆరోపించారు.
ఎన్నికల సంఘంపై మమతా బెనర్జీ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ‘‘మేము ఎన్నికల్లో ఓడిపోలేదు. గెలవడానికి బీజేపీ ఎన్నికల సంఘాన్ని ఉపయోగించుకుంది. ఎన్నికల సంఘమే అతి పెద్ద విలన్.’’ అంటూ సంచలన ఆరోపణలు చేశారు.
Also Read
- Shocking Love Story: ముసలోడికి దసరా పండగ.. 22 ఏళ్ల యువతితో పెళ్లి చేసిన గ్రామస్తులు..
- Gas Pipeline: భారత్ మాస్టర్ ప్లాన్.. సముద్రగర్భంలో భారీ గ్యాస్ పైప్లైన్..
- Kamal Haasan: పొదుపు మంత్రంపై కమల్హాసన్ కీలక వ్యాఖ్యలు
- 1991 India Gold Crisis: రాత్రికి రాత్రి బ్రిటన్కు 47,000 కిలోల బంగారం తరలింపు.. అసలు ఆ రోజు ఏం జరిగిందంటే!
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ 207 స్థానాలు గెలుచుకోగా.. టీఎంసీ 80 స్థానాలు, కాంగ్రెస్ 5 స్థానాల్లో గెలిచింది. ఈ ఫలితాలపై మమత మీడియా వేదికగా మాట్లాడుతూ ఈసీపై మండిపడ్డారు. ఎన్నికల్లో గెలిచేందుకు బీజేపీ ఎన్నికల సంఘాన్ని ఉపయోగించుకుందని వ్యాఖ్యానించారు.
‘‘మా పోరాటం బీజేపీతో కాదు. ఎన్నికల సంఘంతో. నా జీవితంలో ఇలాంటి ఎన్నికను చూడలేదు. 2004 తర్వాత ఇంతటి అఘాయిత్యాలను చూడలేదు. ఎన్నికల సంఘమే ప్రధాన విలన్. ఎస్ఐఆర్ నుంచి 90 లక్షల ఓట్లను తొలగించారు. బీజేపీ 100 సీట్లను దొంగిలించింది. మమ్మల్ని ఓడించడానికి ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షా కుట్ర పన్నారు. మమ్మల్ని ఓడించడానికి బీజేపీ సాధ్యమైన ప్రతీ ఎత్తుగడను ఉపయోగించింది. బీజేపీ కార్యకర్తలు మా కార్యకర్తలపై దాడి చేశారు.’’ అని ఆరోపించారు.
కూటమి అండ..
‘‘ఇండియా కూటమి నాకు అండగా ఉంది. సోనియా గాంధీ, రాహుల్, అరవింద్ కేజ్రీవాల్, ఉద్ధవ్ థాకరే, హేమంత్ సోరెన్, తేజస్వి యాదవ్ అందరూ నాకు ఫోన్ చేశారు. కూటమి నాకు అండగా ఉంది. అఖిలేష్ యాదవ్ రేపు బెంగాల్ వస్తున్నారు.’’ అని పేర్కొన్నారు.
‘‘ఇప్పుడు నేను స్వేచ్ఛా పక్షిలా ఉన్నాను. నాకు చేయాల్సిన పని ఉంది. కానీ మేము పోరాటం ఆపం. బీజేపీ అప్పుడే ప్రజలను హింసించడం మొదలుపెట్టింది. వారు షెడ్యూల్డ్ కుల, షెడ్యూల్డ్ తెగల కుటుంబాలపై కూడా దాడి చేశారు. వారిపై అత్యాచారం చేస్తామని బీజేపీ బెదిరించింది. బీజేపీ తన గూండాలతో దాడులు మొదలుపెట్టింది. పోలీసులు చేతులు కట్టుకుని కూర్చున్నారు. మాకు మార్పు కావాలి. ప్రతీకారం కాదు అనే నినాదాన్ని మేము లేవనెత్తాము. ఇది సైనికుల దళమా లేక గూండాల దళమా?.’’ అని మమత ప్రశ్నించారు.
మీడియాపై ధ్వజం
మొదటి విడత ఓట్ల లెక్కింపు తర్వాత… బీజేపీ ఇన్ని స్థానాల్లో ఆధిక్యంలో ఉందంటూ మీడియా వార్తలు ప్రసారం చేయడం మొదలుపెట్టిందని.. అంతే వెంటేనే బీజేపీ గూండాలు తనపై దాడి చేశారని ఆరోపించారు. ‘‘నా వీపుపైనా, కడుపుపైనా తన్నారు.’’ అని మమత పేర్కొన్నారు.
#WATCH | Kolkata: Outgoing West Bengal CM Mamata Banerjee says, "After first round of counting, they started saying that BJP is getting 195-200. You didn't wait for the final result. You didn't even wait for 5-6 rounds. After that campaign with the press media, BJP went inside… pic.twitter.com/e72Bcs8Dpj
— ANI (@ANI) May 5, 2026
#WATCH | Kolkata: Outgoing West Bengal CM Mamata Banerjee says, "Sonia ji, Rahul Gandhi, Arvind Kejriwal, Uddhav Thackeray, Akhilesh Yadav, Tejashwi Yadav, Hemant Soren rang me up. All the allies of INDIA Alliance told me that they are totally and absolutely with me. I think our… pic.twitter.com/W8ZRWMP1d2
— ANI (@ANI) May 5, 2026
#WATCH | Kolkata: Outgoing West Bengal CM Mamata Banerjee says, "Sad to say, CEC became the villain of this election to loot the democratic rights of the people and to loot the EVM. Can you tell me that after voting EVM has 80-90% charge? How is it possible? Two days before the… pic.twitter.com/b9Dc1npwWq
— ANI (@ANI) May 5, 2026
తాజావార్తలు
-
Lift Accident : తెగిపడ్డ అపార్ట్మెంట్ లిఫ్ట్.. ఆరుగురు బీఆర్ఎస్ నాయకులకు గాయాలు.!
-
Off The Record : పొలిటికల్ డబుల్ యాక్షన్తో రోజా ఇరుకున పడ్డారా?
-
Shocking Love Story: ముసలోడికి దసరా పండగ.. 22 ఏళ్ల యువతితో పెళ్లి చేసిన గ్రామస్తులు..
-
Story Board : ఫ్యూచర్ కోసం ఆర్థిక సూత్రం..? సంక్షోభం ముంచుకొచ్చాక ప్రభుత్వం మేల్కోందా ?
-
Hyderabad: గుడ్డిగా నమ్మితే ప్రాణాలు గాల్లో కలిసినట్టేనా? హైదరాబాద్ మర్డర్ నేర్పిస్తున్న పాఠమిదేనా?
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..