Mamata Banerjee: “ఓట్లను దోచుకున్నారు”.. బీజేపీపై మమతా తీవ్ర విమర్శలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mamata Banerjee: వెస్ట్ బెంగాల్ ఎన్నికల్లో బీజేపీ భారీ విజయం సాధిస్తోంది. ఈ సమయంలో సీఎం మమతా బెనర్జీ బయటకు వచ్చారు. బీజేపీ ఒక ప్రణాళిక ప్రకారం వ్యవహరిస్తోందని, ఇందులో భాగంగా బీజేపీ ముందుగా తమకు అనుకూలమైన ఫలితాలను చూపిస్తుందని తనకు ముందే తెలుసని, ఆ విషయాన్ని తాను ముందే ఊహించానని ఆమె అన్నారు. అయినప్పటికీ తాను, తన పార్టీ కార్యకర్తలు పులిపిల్లల వలే పోరాడుతామని చెప్పారు.
ఒక వీడియో ప్రకటనలో ఆమె మాట్లాడుతూ.. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(ఎస్ఐఆర్)పై తీవ్ర విమర్శలు ఎక్కుపెట్టారు. సీట్లు గెలుచుకోవడానికి ఎస్ఐఆర్ పేరుతో ఓట్లను దోచుకున్నారని ఆరోపించారు. కేంద్ర బలగాలతో కుమ్మకై తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారని, రాష్ట్ర పోలీసలుు పూర్తిగా కేంద్ర బలగాల ఆధీనంలోకి వెళ్లి, వారికి అనుకూలంగా పనిచేస్తున్నారని ఆరోపించారు.
Also Read
Read Also: Tamilanadu : తమిళనాడులో విజయ్ విక్టరీ.. సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా జూనియర్ ఎన్టీఆర్
టీఎంసీ ఏజెంట్లు కౌంటింగ్ ప్రాంతాలను విడిచి వెళ్లోద్దని మమతా కోరారు. ఇది బీజేపీ పన్నాగమని, మొదటి రెండు మూడు రౌండ్లలో వారి ఫలితాలను ముందే చూపించి, మా ఫలితాలను తర్వాత చూపిస్తారని తాను ఎప్పటి నుంచో ఇదే చెబుతున్నారని మమతా ఆరోపించారు. సుమారు 100 చోట్ల రెండు మూడు రౌండ్ల లెక్కింపు తర్వాత కౌంటింగ్ ప్రక్రియ నిలిపేశారని అన్నారు. టీఎంసీని అణిచివేయడానికి పార్టీ కార్యాలయాలను ధ్వంసం చేస్తున్నారని, బలవంతంగా ఆక్రమించుకోవడానికి కేంద్ర బలగాలను దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు.
సాయంత్రం తర్వాత మేమే గెలుస్తామని, మూడు లేదా నాలుగు రౌండ్ల లెక్కింపు పూర్తయినా, మొత్తం 14-18 రౌండ్లు ఉన్నాయి కదా అని కార్యకర్తలు, ఏజెంట్లు ఆందోళన చెందొద్దని ధైర్యం చెప్పారు. అన్ని రౌండ్లు పూర్తయ్యే సరికి విజయం తృణమూల్ వశమవుతుందని అన్నారు.
#WATCH | Kolkata: TMC candidate from Bhabanipur and West Bengal CM Mamata Banerjee says, "Counting agents and candidates should not leave the counting centre. This is the BJP's plan, I have been saying this since yesterday that they will be shown ahead first. They have stopped… pic.twitter.com/jdU9OqxWEJ
— ANI (@ANI) May 4, 2026
తాజావార్తలు
-
Vishwambhara: మెగా ఫ్యాన్స్కు గుడ్ న్యూస్.. మెగాస్టార్ ‘విశ్వంభర’ రిలీజ్ డేట్ లాక్? ఎప్పుడంటే..
-
Women Commission : తెలంగాణ మహిళా కమిషన్లో ఉద్యమ కుటుంబాలకు చోటు.. రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం.!
-
CM Revanth Reddy : ప్రభుత్వ విద్యలో తెలంగాణను దేశానికే నంబర్ వన్ చేస్తాం
-
PM Modi: పొదుపుగా జీవించండి.. వడోదరలో పౌరులకు మోడీ పిలుపు
-
HAM Projects : తెలంగాణలో రహదారుల విప్లవం.. ‘హ్యామ్’ ప్రాజెక్టులపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కీలక సమీక్ష
ట్రెండింగ్
-
204HP పవర్, ADAS ఫీచర్లతో 2026 Skoda Kodiaq భారత్ లో లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా..
-
Ginger Candy: తాటి బెల్లం + అల్లం: గొంతు నొప్పి నుండి జీర్ణ సమస్యలకు.. చెక్ పెట్టే అద్భుత ఔషధం ‘అల్లం మురబ్బా’ ఇంట్లోనే చేసుకోండి ఇలా..
-
8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, యాక్టివ్ కూలింగ్తో గేమింగ్ మాన్స్టర్.. REDMAGIC 11S Pro రాక!
-
PM Modi: ఆడంబరాలు వద్దు.. పొదుపు ముద్దు.! దేశాభివృద్ధి కోసం ప్రధాని 10 కీలక సూచనలు..
-
Kathmandu: రన్వేపై మంటల్లో చిక్కుకున్న విమానం.. 278 మంది ప్రయాణికులు.?