Mamata Banerjee: “ఓట్లను దోచుకున్నారు”.. బీజేపీపై మమతా తీవ్ర విమర్శలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mamata Banerjee: వెస్ట్ బెంగాల్ ఎన్నికల్లో బీజేపీ భారీ విజయం సాధిస్తోంది. ఈ సమయంలో సీఎం మమతా బెనర్జీ బయటకు వచ్చారు. బీజేపీ ఒక ప్రణాళిక ప్రకారం వ్యవహరిస్తోందని, ఇందులో భాగంగా బీజేపీ ముందుగా తమకు అనుకూలమైన ఫలితాలను చూపిస్తుందని తనకు ముందే తెలుసని, ఆ విషయాన్ని తాను ముందే ఊహించానని ఆమె అన్నారు. అయినప్పటికీ తాను, తన పార్టీ కార్యకర్తలు పులిపిల్లల వలే పోరాడుతామని చెప్పారు.
ఒక వీడియో ప్రకటనలో ఆమె మాట్లాడుతూ.. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(ఎస్ఐఆర్)పై తీవ్ర విమర్శలు ఎక్కుపెట్టారు. సీట్లు గెలుచుకోవడానికి ఎస్ఐఆర్ పేరుతో ఓట్లను దోచుకున్నారని ఆరోపించారు. కేంద్ర బలగాలతో కుమ్మకై తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారని, రాష్ట్ర పోలీసలుు పూర్తిగా కేంద్ర బలగాల ఆధీనంలోకి వెళ్లి, వారికి అనుకూలంగా పనిచేస్తున్నారని ఆరోపించారు.
Also Read
- Ayodhya: అయోధ్య మెడికల్ కాలేజీలో బాంబు తయారీ పత్రం కలకలం.. విద్యార్థి అరెస్ట్!
- Indore: పెళ్లైన కొన్ని గంటలకే విడాకులు.. ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ ఏంటంటే..!
- Anti Paper Leak Amendment Bill: పబ్లిక్ ఎగ్జామినేషన్స్ అమెండ్మెంట్ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం..
- Rahul Gandhi: నీట్ బాధిత కుటుంబాలకు రాహుల్ గాంధీ ఓదార్పు.. ఎక్స్లో ఫొటోలు పోస్ట్
Read Also: Tamilanadu : తమిళనాడులో విజయ్ విక్టరీ.. సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా జూనియర్ ఎన్టీఆర్
టీఎంసీ ఏజెంట్లు కౌంటింగ్ ప్రాంతాలను విడిచి వెళ్లోద్దని మమతా కోరారు. ఇది బీజేపీ పన్నాగమని, మొదటి రెండు మూడు రౌండ్లలో వారి ఫలితాలను ముందే చూపించి, మా ఫలితాలను తర్వాత చూపిస్తారని తాను ఎప్పటి నుంచో ఇదే చెబుతున్నారని మమతా ఆరోపించారు. సుమారు 100 చోట్ల రెండు మూడు రౌండ్ల లెక్కింపు తర్వాత కౌంటింగ్ ప్రక్రియ నిలిపేశారని అన్నారు. టీఎంసీని అణిచివేయడానికి పార్టీ కార్యాలయాలను ధ్వంసం చేస్తున్నారని, బలవంతంగా ఆక్రమించుకోవడానికి కేంద్ర బలగాలను దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు.
సాయంత్రం తర్వాత మేమే గెలుస్తామని, మూడు లేదా నాలుగు రౌండ్ల లెక్కింపు పూర్తయినా, మొత్తం 14-18 రౌండ్లు ఉన్నాయి కదా అని కార్యకర్తలు, ఏజెంట్లు ఆందోళన చెందొద్దని ధైర్యం చెప్పారు. అన్ని రౌండ్లు పూర్తయ్యే సరికి విజయం తృణమూల్ వశమవుతుందని అన్నారు.
#WATCH | Kolkata: TMC candidate from Bhabanipur and West Bengal CM Mamata Banerjee says, "Counting agents and candidates should not leave the counting centre. This is the BJP's plan, I have been saying this since yesterday that they will be shown ahead first. They have stopped… pic.twitter.com/jdU9OqxWEJ
— ANI (@ANI) May 4, 2026
తాజావార్తలు
-
OTR : ఆ ముగ్గురు ఎమ్మెల్యేలు పార్టీకి తలనొప్పిగా మారారా?
-
Story Board : బ్యాంక్ అకౌంట్ ఉంటే బాదుడు తప్పదా..?
-
Ponguleti Srinivas Reddy: ధరణి అక్రమాలు, భూ సమస్యలపై సెట్ విచారణ
-
Selling Racket: తల్లి ఒడిలో ఉండాల్సిన పసికందుకు ధర..
-
Operation Muskaan : ‘ఆపరేషన్ ముస్కాన్’ సక్సెస్.. 6,307 మంది చిన్నారులకు కొత్త జీవితం.!
ట్రెండింగ్
-
Onion Cleaning Hack : ఉల్లిపాయతో గ్లాస్ మెరుస్తుందా.? వైరల్ హ్యాక్లో నిజం ఎంత.!
-
Kitchen Tips : బియ్యం కేవలం వంటకే కాదు.. ఈ సీక్రెట్ హ్యాక్స్ తెలిస్తే ఆశ్చర్యపోతారు.!
-
Flipkart Pay Later: ఇప్పుడు కొనండి.. నిమ్మలంగా కట్టండి.. ఫ్లిప్కార్ట్లో ‘పే లేటర్’ సదుపాయం!
-
ITR Filing Deadline: ట్యాక్స్పేయర్లకు అలెర్ట్.. ITR ఫైల్ చేశారా? ఈరోజే చివరి గడువు.!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ అవసరమా?.. అసలు ఆ ఆలోచన ఏంటి?.. ప్రముఖ వ్యాఖ్యాత ఆసక్తికర వ్యాఖ్యలు!