Mamata Banerjee: “నేనూ న్యాయవాదినే.. ఎలా పోరాడాలో నాకు తెలుసు”.. బీజేపీపై యుద్ధం ప్రకటించిన దీదీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mamata Banerjee: పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రవీంద్రనాథ్ ఠాగోర్ జయంతిని పురస్కరించుకుని ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు, బీజేపీ నియంతృత్వ పోకడలను అడ్డుకునేందుకు ప్రతిపక్షాలన్నీ ఏకం కావాలని ఆమె పిలుపునిచ్చారు. ఠాగోర్ జయంతి వేడుకల నిర్వహణలో తనకు ఎదురైన చేదు అనుభవాన్ని మమత ఈ సందర్భంగా ప్రస్తావించారు. కాళీఘాట్ కూడలి, ముక్తదల్ వంటి ప్రాంతాల్లో వేడుకలకు అనుమతి కోరగా అధికారులు నిరాకరించారని ఆమె ఆరోపించారు. “ఇది టీఎంసీ గొంతు నొక్కే ప్రయత్నం. అందుకే పార్టీ కార్యాలయం బయటే జయంతిని నిర్వహిస్తున్నాం. మాతృభూమిని ప్రేమించే వారు భయం లేకుండా ఏకమవ్వాలి” అని ఆమె వ్యాఖ్యానించారు.
బెంగాల్లో భయంకర పాలన
రాష్ట్రంలో బీజేపీ వేధింపులు పెరిగిపోయాయని, దళితులు, మహిళలను కూడా వదలడం లేదని మమత ఆరోపించారు. తనతో ఉండే 92 ఏళ్ల వృద్ధురాలు వేధింపుల భయంతో ఇల్లు వదలాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. నూతన వధువులను కూడా ఇంటి నుంచి పంపిస్తున్నారని, పార్టీ కార్యకర్తల ఇళ్ల వద్ద గూండాయిజం జరుగుతున్నా పోలీసులు మౌనంగా ఉంటున్నారని మండిపడ్డారు. మాజీ ముఖ్యమంత్రి బుద్ధదేబ్ భట్టాచార్య భద్రత విషయంలో బీజేపీ తీరును ఆమె తప్పుబట్టారు. “నేను అధికారంలోకి వచ్చినప్పుడు బుద్ధదేబ్కు గౌరవం ఇచ్చాను, నా సొంత బుల్లెట్ప్రూఫ్ కారును ఆయన కోసం పంపాను. కానీ బీజేపీ అధికారంలోకి రాగానే ఆయనకు ఉన్న జెడ్ ప్లస్ సెక్యూరిటీని, ఇతర సేవలను తొలగించింది” అని ఆమె గుర్తు చేశారు.
Also Read
- UCC: 21 ఎన్డీయే పాలిత రాష్ట్రాల్లో ‘‘సివిల్ కోడ్’’.. అమిత్ షా కీలక ప్రకటన..
- PM Modi: ప్రధాని మోడీని కలిసిన స్కూల్ ఫ్రెండ్ అస్గర్ అలీ.. బీజేపీ ఎమ్మెల్యేపై ఫిర్యాదు..
- Maharashtra: జాయింట్ వీల్లో చిక్కుకున్న మహిళ జడ.. జట్టుతో సహా తల చర్మం ఊడి తీవ్ర గాయం..
- Rahul Gandhi: బ్రిక్స్ డిన్నర్ మెనూపై రాహుల్ రాజకీయం..
బీజేపీకి వ్యతిరేకంగా సాగుతున్న ఈ పోరాటంలో జాతీయ స్థాయి నాయకులంతా తనతో ఉన్నారని మమత స్పష్టం చేశారు. ఇప్పటికే సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఖర్గే, ఉద్ధవ్ థాకరే, అఖిలేష్ యాదవ్, కేజ్రీవాల్ వంటి నేతలతో మాట్లాడినట్లు ఆమె వెల్లడించారు. కపిల్ సిబల్ వంటి సీనియర్ న్యాయవాదులు కూడా మద్దతు ప్రకటించారని, తానే స్వయంగా న్యాయవాదిగా ఈ యుద్ధంలో ముందుంటానని పేర్కొన్నారు. టీఎంసీ ఎంపీ మహువా మోయిత్రా ఢిల్లీ వెళ్తుండగా విమానాశ్రయంలో వేధింపులకు గురయ్యారని మమత వెల్లడించారు. ఎన్నికల రిగ్గింగ్కు పాల్పడిన వారే ఆమెను వేధించారని, దీనికి సంబంధించిన వీడియో ఆధారాలు తమ వద్ద ఉన్నాయని పేర్కొన్నారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా ఈ రాజకీయ, నైతిక పోరాటాన్ని ఆపే ప్రసక్తే లేదని ఈ సందర్భంగా దీదీ స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
Bestselling 125cc Motorcycle: లక్షల్లో అమ్ముడవుతున్న బైక్… మైలేజ్ లెక్కల్లో ఊహించని ట్విస్ట్..
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Dhruv Vikram: మైత్రీ అడ్డాలోకి చియాన్ తనయుడు.. ధ్రువ్ విక్రమ్ ‘జాకీ’ అనౌన్స్మెంట్ చూశారా!
-
UCC: 21 ఎన్డీయే పాలిత రాష్ట్రాల్లో ‘‘సివిల్ కోడ్’’.. అమిత్ షా కీలక ప్రకటన..
-
TET Results Out: ఏపీ టెట్ ఫలితాలు విడుదల.. చెక్ చేసుకోండిలా..
ట్రెండింగ్
-
Head Coach: హెడ్ కోచ్గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్తో సెప్టెంబర్ 15న భారత్లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?