Kolkata: జూడాలకు సీఎం మమత చివరి ఆహ్వానం.. నెక్ట్స్ ఏంటి?
- జూడాలకు సీఎం మమత చివరి ఆహ్వానం
- ఈ సమావేశానికి కూడా జూడాలు డుమ్మాకొడితే..!
- బెంగాల్ ప్రభుత్వం తదుపరి చర్యలపై ఉత్కంఠ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కోల్కతాలో నిరసనలు కొనసాగిస్తున్న జూనియర్ డాక్టర్లను బెంగాల్ ప్రభుత్వం మరోసారి చర్చలకు ఆహ్వానించింది. ఇప్పటికే నాలుగు సార్లు మమత సర్కార్ చర్చలకు పిలిచింది. కానీ డాక్టర్లు మాత్రం చర్చలు నిరాకరించారు. దీంతో సోమవారం ఐదోసారి.. ఇదే చివరి ఆహ్వానం అంటూ జూడాలకు పశ్చిమ బెంగాల్ చీఫ్ సెక్రటరీ మనోజ్ పంత్ చర్చలకు ఆహ్వానించారు. సాయంత్రం 5 గంటలకు కాళీఘాట్ నివాసంలో సమావేశానికి రావాలని డాక్టర్లను సీఎం మమత పిలిచారని మనోజ్ పంత్ స్పష్టం చేశారు. ఆందోళన చేస్తున్న డాక్టర్లు ఓపెన్ మైండ్తో చర్చలకు రావాలని కోరారు.
ఇది కూడా చదవండి: Khairatabad Ganesh: ఖైరతాబాద్ వినాయకుడు వద్ద స్పీడ్ అందుకున్న కర్ర పనులు..
Also Read
- NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
- India-UK: అమల్లోకి భారత్-యూకే ఒప్పందం.. ఏవేవి ధరలు తగ్గాయంటే..!
- Bengal: బెంగాల్ రాజకీయాల్లో కొత్త చర్చ! మమతకు కాంగ్రెస్ ఆహ్వానం
- USA: "నువ్వు ముస్లింవా?" అని భారతీయుడిపై 15 సార్లు కత్తితో దాడి..
అయితే ఈ సమావేశానికి సంబంధించిన లైవ్ స్ట్రీమింగ్ లేదా వీడియో రికార్డింగ్ అనుమతించబడదని మనోజ్ పంత్ స్పష్టం చేశారు. సమావేశం యొక్క మినిట్స్ మాత్రం రికార్డ్ చేయబడతాయని వెల్లడించారు. ఇరు పక్షాల నుంచి సంతకాలు చేయబడతామని స్పష్టం చేశారు. సమావేశాన్ని లైవ్ టెలీకాస్ట్ చేయాలంటూ డాక్టర్లు పట్టుబడుతున్నారు.. దీంతో భేటీపై ప్రతిష్టంభన నెలకొంది. కనీసం టీ తాగేందుకైనా రావాలని ప్రభుత్వం ఆహ్వానించినా రాలేదు. న్యాయం జరిగాకే టీ తాగుతామని డాక్టర్లు స్పష్టం చేశారు.
ఇది కూడా చదవండి: Namo Bharat Rapid Rail: వందే మెట్రో రైల్ పేరు మారింది.. ఇకపై ఇలా పిలవాలి..
సోమవారం చివరి ఆహ్వానం అంటూ బెంగాల్ ప్రభుత్వం డాక్టర్లను హెచ్చరించింది. మరీ ఈ సమావేశానికైనా జూడాలు వస్తారా? ఎప్పటిలాగానే మొండిపట్టుపడతారా? చూడాలి. ఇప్పటికే నెల రోజులకు పైగా డాక్టర్లు ఆందోళన చేస్తున్నారు. దీంతో రోగులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒకవేళ ఈ సమావేశానికి డాక్టర్లు రాకపోతే.. తదుపరి బెంగాల్ ప్రభుత్వం ఏ చర్యలు తీసుకుంటుందో సర్వత్రా ఆసక్తి నెలకొంది.
ఆగస్టు 9న కోల్కతా ఆర్జీ కర్ ఆస్పత్రిలో జూనియర్ వైద్యురాలిపై అత్యంత క్రూరంగా హత్యాచారం జరిగింది. అనంతరం ఈ ఘటన దేశాన్ని కుదిపేసింది. పెద్ద ఎత్తున ఆందోళనలు, నిరసనలు చోటుచేసుకున్నాయి. దీంతో ఈ కేసును హైకోర్టు సీబీఐకి అప్పగించింది. ప్రస్తుతం సీబీఐ దర్యాప్తు చేస్తోంది.
ఇది కూడా చదవండి: Jani Master: మతం మారాలని దాడి.. పార్శిల్ వార్నింగ్.. వెలుగులోకి సంచలనాలు!!!
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణ బీజేపీలో ‘నో సింగిల్స్.. ఓన్లీ మింగిల్స్’
-
NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
-
Off The Record: విజయశాంతి తీరుపై తెలంగాణ పీసీసీ సీరియస్ గా ఉందా..?
-
Vaibhav Sooryavanshi: ఈసారి కొట్టాల్సిందే..! హనుమంతుడి ఆశీస్సులు తీసుకొని నెట్స్లోకి వైభవ్
-
OTR: కూటమి సర్కార్కే షాకిచ్చిన జనసేన ఎమ్మెల్యే
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!