Mallikarjun Kharge: కాంగ్రెస్ కార్యకర్తలకు భారత్ జోడో యాత్ర “సంజీవిని”
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mallikarjuna Kharge’s comments on Bharat Jodo Yatra: భారతదేశ ఆలోచనలు సవాల్ చేయబడుతున్నాయని.. ద్వేషానికి వ్యతిరేకంగా ప్రతీ ఒక్కరూ ఏకం కావాలని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. బుధవారం జరిగిన కాంగ్రెస్ పార్టీ 138వ వ్యవస్థాపక దినోత్సవాన్ని ఢిల్లీలో జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యలయంలో పార్టీ జెండాను ఎగరేశారు. అందర్నీ కలుపుకుని వెళ్లే కాంగ్రెస్ విధానం వల్లే భారతదేశం పురోగమిస్తోందని అన్నారు. భారతదేశమ బలమైన ప్రజాస్వామ్య దేశంగా అవతరించడమే కాకుండా కొన్ని దశాబ్ధాల్లో ఆర్థిక, అణు, వ్యూహాత్మక రంగాల్లో అగ్రస్థానంలో నిలుస్తుందని ఆయన అన్నారు. అయితే ఇదంత తనంతటతానుగా జరగలేదని.. కాంగ్రెస్ పార్టీకి సమ్మిళిత సిద్ధాంత, సమాన హక్కులు, రాజ్యాంగంపై ఉన్న నమ్మకం వల్లే ఇందతా జరిగిందని ఆయన అన్నారు.
Read Also: Russia: ఉక్రెయిన్ సంక్షోభానికి అమెరికానే కారణం..
Also Read
- West Bengal: బెంగాల్లో మదర్సా శాఖ మతపర పథకాలకు బ్రేక్.. సువేందు సర్కార్ కీలక నిర్ణయం
- DMK: సీఎం విజయ్ ప్రభుత్వం 6 నెలల్లోపే కూలిపోతుంది..
- CM Vijay: ముఖ్యమంత్రిగా ఢిల్లీ టూర్కు విజయ్.. ప్రధాని మోడీని ఎప్పుడు కలవబోతున్నారంటే..!
- GR Gopinath: రూపాయికే విమాన టికెట్.. సామాన్యుడి విమాన కల నిజం చేసిన వ్యక్తి కథ ఇది! ఆయన ఎవరో తెలుసా?
భారతదేశ ప్రాథమిక అంశాలపై బీజేపీ నిరంతరం దాడి చేస్తుందని విమర్శించారు. విద్వేషంతో సమాజం చీలిపోయిందని.. ధరలు పెరుగుదల, నిరుద్యోగంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. కాంగ్రెస్ కార్యకర్తలు, మహిళలు సమాజంలోని అణగారిన వర్గాలను ఏకం చేసి.. ధరలపెరుగుదల, నిరుద్యోగం, ద్వేషానికి వ్యతిరేకంగా పోరాడాలని సూచించారు.
రాహుల్ గాంధీ నేతృత్వంలోని భారత్ జోడోొ యాత్ర కాంగ్రెస్ కార్యకర్తలకు సంజీవిని వంటిదని అన్నారు. ఈ యాత్రకు దేశ ప్రజల నుంచి పెద్ద ఎత్తున మద్దతు వచ్చిందని అన్నారు. కాంగ్రెస్ ప్రత్యర్థులను ఉలిక్కిపడేలా చేసిందని తెలిపారు. రాహుల్ గాంధీ సత్యం, అహింస మార్గాన్ని ఎంచుకున్నానని.. ప్రజా సంక్షేమం కోసం పని చేసే కాంగ్రెస్ పార్టీలో భాగస్వామ్యం అయినందుకు గర్వపడుతున్నానంటూ రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు.
తాజావార్తలు
-
West Bengal: బెంగాల్లో మదర్సా శాఖ మతపర పథకాలకు బ్రేక్.. సువేందు సర్కార్ కీలక నిర్ణయం
-
Peddi Trailer: పెద్ది ట్రైలర్ వచ్చేసింది చూసేయండి!
-
DMK: సీఎం విజయ్ ప్రభుత్వం 6 నెలల్లోపే కూలిపోతుంది..
-
HCA Controversy: మరో వివాదంలో HCA.. కార్యదర్శి జీవన్ రెడ్డి ఎన్నికపై తీవ్ర ఆరోపణలు.. BCCIకి ఫిర్యాదు
-
AI Vs CRYPTO: రెచ్చిపోతున్న హ్యాకర్లు..వణికిపోతున్న ఇన్వెస్టర్లు.. క్రిప్టో కొంప కూల్చుతున్న ఏఐ..!
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..