Maldivian President Muizzu: ప్రధాని మోడీ ప్రమాణస్వీకారానికి వెళ్లడం గౌరవంగా భావిస్తున్నాను..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Maldivian President Muizzu: ప్రధానిగా నరేంద్రమోడీ మూడోసారి రేపు ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో మరోసారి ఎన్డీయే కూటమి అధికారం నిలుపుకుంది. ఈ ప్రమాణస్వీకార వేడుకులకు ఇండియా ఇరుగుపొరుగు దేశాల అధినేతలకు ఆహ్వానాలు అందాయి. మాల్దీవులు, బంగ్లాదేశ్, భూటాన్, నేపాల్, శ్రీలంక, మారిషస్, సీషెల్స్ ఇలా పలు దేశాధినేతలు ఈ కార్యక్రమానికి హాజరుకాబోతున్నారు. ఇప్పటికే బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా ఢిల్లీ చేరుకున్నారు. ఇరుగుపొరుగు దేశాలతో భారత సంబంధాలు మరింత బలపడేందుకు ఈ కార్యక్రమం వేదిక కాబోతోంది.
Read Also: AIADMK: బీజేపీతో పొత్తు ఉండదు.. తేల్చి చెప్పిన పళనిస్వామి..
Also Read
- Ayodhya: అయోధ్య రామాలయ విరాళాల కుంభకోణంలో కీలక పరిణామం.. ట్రస్ట్ కీలక సభ్యులు రాజీనామా..
- CM Yogi: "ఎవ్వరినీ వదిలి పెట్టను".. అయోధ్య విరాళాల దుర్వినియోగంపై సీఎం యోగి ఆగ్రహం..
- Ketan Murder Case: కేతన్ హత్య కేసులో కొత్త ట్విస్ట్.. ఇద్దరు తల్లుల మధ్య మాటల యుద్ధం!
- Bank Fraud: భారీ బ్యాంకు మోసం.. రూ.3.66 కోట్ల ఇన్సూరెన్స్ పాలసీలను అటాచ్ చేసిన ఈడీ.!
ఇదిలా ఉంటే ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రమాణస్వీకారానికి మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జూ కూడా రాబోతున్నారు. ఈ కార్యక్రమానికి హాజరుకావడం తనకు గౌరవంగా భావిస్తున్నాని, చారిత్రాత్మక ఘట్టం కోసం ఆయన తొలిసారిగా భారత్లో పర్యటించడం ద్వైపాక్షిక సంబంధాలు ‘సానుకూల దిశ’లో సాగుతున్నాయని నిరూపిస్తుందని శనివారం ముయిజ్జూ అన్నారు. భారత ఆహ్వానాన్ని ప్రెసిడెంట్ ముయిజ్జూ అంగీకరించిన తర్వాత ఆ వ్యాఖ్యలు చేశారు.
గతేడాది నవంబర్ 17న పదవీ బాధ్యతలు చేపట్టిన ముయిజ్జై భారత వ్యతిరేక, చైనా అనుకూల విధానాలతో వార్తల్లో ఉంటున్నాడు. మాల్దీవుల్లో మానవతా సాయం అందిస్తున్న భారత సైనికులను తమ దేశం వదిలి వెళ్లాలని ఆదేశించాడు. ఇదే కాకుండా ఈ ఏడాది ప్రధాని లక్షద్వీప్ పర్యటనకు వెళ్లిన సందర్భంలో ముయిజ్జూ కేబినెట్ మంత్రులు, ప్రధానిని ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేయడం కూడా వివాదాస్పదమైంది. అప్పటి నుంచి భారత్ నుంచి మాల్దీవులకు వెళ్లి పర్యాటకుల సంఖ్య గణనీయంగా పడిపోయింది. అసలే ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న ఈ ద్వీపదేశం సాయం కోసం భారత్ని అభ్యర్థించడం మొదలుపెట్టింది.
తాజావార్తలు
-
Ayodhya: అయోధ్య రామాలయ విరాళాల కుంభకోణంలో కీలక పరిణామం.. ట్రస్ట్ కీలక సభ్యులు రాజీనామా..
-
Women’s World Cup 2026: రన్రేట్ ప్లస్.. కానీ ఆసీస్తో నెక్స్ట్ మ్యాచ్! సెమీఫైనల్ చేరాలంటే భారత్కు ఉన్న అవకాశాలివే..
-
CM Yogi: “ఎవ్వరినీ వదిలి పెట్టను”.. అయోధ్య విరాళాల దుర్వినియోగంపై సీఎం యోగి ఆగ్రహం..
-
Online Shopping: ఒక్క పైసా ఖర్చు చేయకుండా ఆన్లైన్ షాపింగ్… కొరియాలో ఊపందుకుంటున్న కొత్త ట్రెండ్
-
RC17 Update: రామ్ చరణ్ కెరీర్లోనే తొలిసారి.. సుక్కు మాస్టర్ ప్లాన్ మాములుగా లేదుగా!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!
-
Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!
-
Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉండే రుచికరమైన స్నాక్ “పెసర గారెలు” చేసేయండి ఇలా.!
-
Baahubali 3 Announced: ఇండియన్ సినీ ప్రియులకు బిగ్ సర్ప్రైజ్.. ‘బాహుబలి 3′ వస్తోంది!