Mahua Moitra: ఎథిక్స్ కమిటీ ముందుకు మహువా మోయిత్రా.. 3 మంత్రిత్వ శాఖల నుంచి రిపోర్ట్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mahua Moitra: క్యాష్ ఫర్ క్వేరీ కేసులో తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మోయిత్రా రేపు పార్లమెంట్ ఎథిక్స్ కమిటీ ముందు హాజరుకాబోతున్నారు. పార్లమెంట్ లో ప్రశ్నలు అడిగేందుకు వ్యాపారవేత్త దర్శన్ హీరానందానీ నుంచి ముడుపులు తీసుకున్నారనే అభియోగాలు ఆమెపై ఉన్నారు. వీటిపై ఇప్పటికే బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే లోక్ సభ స్పీకర్ కి లేఖ రాశారు. ఆమె ఇండియాలో ఉన్న సమయంలో దుబాయ్ నుంచి ఆమె పార్లమెంట్ ఐడీ లాగిన్ అయిందని ఆరోపిస్తూ ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కి లేఖ రాశారు.
మరోవైపు దర్శన్ హీరానందానీ ఎథిక్స్ కమిటీ ముందు అఫిడవిట్ దాఖలు చేశారు. దీంట్లో మహువా మోయిత్రా తన నుంచి డబ్బులు, గిఫ్టులు తీసుకున్నట్లు ఆరోపించారు. దీంతో ఈ వివాదం పెద్దదైంది. మరోవైపు టీఎంసీ కూడా ఈ అంశంపై పెద్దగా స్పందించడం లేదు.
Also Read
- Cancer Vaccine Breakthrough: కొత్త క్యాన్సర్ వ్యాక్సిన్పై ఆశలు.. మోడెర్నా, మెర్క్ ట్రయల్స్లో ఆశాజనక ఫలితాలు
- Amit Shah: 1937 నిర్ణయంతోనే విభజనకు పునాది.. ‘వందే మాతరం’ను విభజించిన తప్పును మళ్లీ చేయొద్దు.. కాంగ్రెస్పై అమిత్ షా ఫైర్
- Youtube Videos: రీల్స్, యూట్యూబ్ వీడియోలు చేస్తే లక్ష రూపాయలు... క్రియేటర్లకు పండగలాంటి వార్త చెప్పిన ప్రభుత్వం..
- IT Raids: హైదరాబాద్ టు హాంగ్కాంగ్.. ఐటీ దాడుల్లో రూ.1000 కోట్ల హవా లావాదేవీల గుట్టురట్టు..
Read Also: Same-Sex Marriage Case: స్వలింగ వివాహాలపై సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్
ఇదిలా ఉంటే మహువా మోయిత్రా రేపు ఎథిక్స్ కమిటీ ముందు హాజరుకాబోతున్నారు. కమిటీ ముందున్న సాక్ష్యాలు, మూడు మంత్రిత్వ శాఖలు ఇచ్చిన నివేదికల ఆధారంగా ప్రశ్నించనున్నారు. హోం, ఇన్ఫర్మేషన్, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖల నివేదికలు కమిటీ ముందు ఉన్నాయి. అక్టోబర్ 26న జరిగిన సమావేశం తర్వాత ఎథిక్స్ కమిటీ ఈ మూడు శాఖలను సమాచారం కోరింది. ఆమె లాగిన్ వివరాలు, ఐపీ అడ్రస్ వివరాలను కోరింది.
దర్శన్ హీరానందానీ నుంచి డబ్బులు తీసుకుని అదానీ గ్రూపు ద్వారా ప్రధాని మోడీని టార్గెట్ చేయాలని అనుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆమె 60 ప్రశ్నలు అడిగితే అందులో 51 ప్రశ్నలు అదానీ గ్రూపుపైనే ఉన్నాయి. ఇదిలా ఉంటే దుబాయ్ నుంచి మహువా మోయిత్రా తన 47 సార్లు లాగిన్ అయ్యారని, వ్యాపారవేత్తకు సంబంధించిన ప్రదేశాల నుంచి లాగిన్ అయినట్లు బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే ఆరోపించారు. ఈ వార్త నిజమైతే దేశంలోని ఎంపీలంతా మహువా అవినీతికి వ్యతిరేకంగా నిలబడాలని ట్వీట్ చేశారు.
తాజావార్తలు
-
Cancer Vaccine Breakthrough: కొత్త క్యాన్సర్ వ్యాక్సిన్పై ఆశలు.. మోడెర్నా, మెర్క్ ట్రయల్స్లో ఆశాజనక ఫలితాలు
-
YS Jagan: పరీక్ష రాయకుండానే 372 మందికి ఉద్యోగాలు.. వారిని పీవీ సింధుతో పోల్చడం సరికాదు!
-
Shiva Nirvana: రవితేజ ‘ఇరుముడి’లో విలన్ ఎవరో కాదు.. షాక్ ఇచ్చిన డైరెక్టర్ డైరెక్టర్ శివ నిర్వాణ!
-
Holiday Changed: మిలాద్ ఉన్ నబీ సెలవు తేదీ మార్పు.. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం..
-
50 గంటల బ్యాటరీ, 42ms లో లేటెన్సీతో రూ.1,899కే iQOO Buds లాంచ్.. గేమర్లకు బెస్ట్ TWS.!
ట్రెండింగ్
-
రూ.1,999కే CMF Buds Neo.. 35dB ANC, 52 గంటల బ్యాటరీ లైఫ్తో అదిరిపోయే ఇయర్బడ్స్..!
-
144Hz AMOLED డిస్ప్లే, 7050mAh బ్యాటరీతో iQOO Z11 వచ్చేసిందోచ్.. ధర ఎంతంటే.?
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?
-
Lemon Plant: విత్తనం నుంచి నిమ్మ చెట్టు వరకు.. కుండీలో నిమ్మ మొక్క పెంచడం ఇంత సులువా.!
-
IND vs SL 2nd Test: శ్రీలంకకు ట్రిపుల్ షాక్.. రెండో టెస్టులో కూడా టీమిండియాదే విజయం!