Maharastra: లోయలో పడ్డ బస్సు.. 15 మందికి తీవ్రగాయాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహారాష్ట్రలో శుక్రవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ముంబై- అహ్మదాబాద్ హైవేపై పాల్ఘర్ జిల్లాలోని వాగోభా ఖిండ్ వద్ద బస్సు లోయలో పడింది. దాదాపు 25 అడుగుల లోతు లోయలో పడటంతో 15 మంది ప్రయాణికులు గాయపడ్డారు. ఇందులో ఐగుగురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడినట్లు పోలీసులు తెలిపారు.
మహారాష్ట్ర ఆర్టీసికి చెందిన బస్సు ఉత్తర మహారాష్ట్ర జల్గావ్ జిల్లాలోన భుసావల్ ననుంచి పాల్ఘర్ లోని బోయిసర్ కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. శుక్రవారం తెల్లవారుజామున 6 గంటల ప్రాంతంలో ప్రమాదం జరిగినట్లు పోలీసులు వెల్లడించారు. గాయపడిన వారిని స్థానికంగా ఉన్న ఆస్పత్రికి తరలించి, చికిత్స అందిస్తున్నారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు, రెస్క్యూ సిబ్బంది, ఇతర అధికారులు సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు. ప్రమాదం జరిగిన వెంటనే కొంతమంది అదే రోడ్డుపై ప్రయాణిస్తున్న ప్రయాణికులు గాయపడిన వారిని రక్షించే ప్రయత్నాలు చేశారు. బస్సు డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నాడని.. అతివేగంగా, అజాగ్రత్తగా బస్సును నడిపాడని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. డ్రైవర్ ని మార్చాలని ప్రయాణికులు కండక్టర్ ను కోరినప్పటకీ పట్టించుకోలేదని వెల్లడించారు. ఇదే ప్రమాదానికి కారణం అయిందని ప్రయాణికులు చెబుతున్నారు.
Also Read
#WATCH 15 passengers injured after a bus plunges into a roadside ditch near Waghoba Ghat in Palghar, Maharashtra
Police & local administration engaged in relief & rescue operation pic.twitter.com/UgXbXJx4V6
— ANI (@ANI) May 27, 2022
తాజావార్తలు
-
Trump: ‘విషమ స్థితిలో ఉన్న రోగిలా ఉంది’.. ఇరాన్ తీరును ఎండగట్టిన ట్రంప్
-
Gongura Pulihora: పక్కా పల్లెటూరి స్టైల్లో ‘గోంగూర పులిహోర’.. 10 నిమిషాల్లో ఐరన్ లోపానికి విరుగుడు!
-
PBKS vs DC : ఢిల్లీ ముందు 211 పరుగుల భారీ లక్ష్యం.. శ్రేయాస్, ప్రియాన్ష్ మెరుపులు.!
-
Punjab: బీజేపీలో చేరిన పంజాబ్ సీఎం బంధువు జ్ఞాన్ సింగ్
-
Bank Holidays: ఈ వారం బ్యాంకుల సెలవుల లిస్ట్ ఇదే.. ఓ లుక్కేయండి!
ట్రెండింగ్
-
204HP పవర్, ADAS ఫీచర్లతో 2026 Skoda Kodiaq భారత్ లో లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా..
-
Ginger Candy: తాటి బెల్లం + అల్లం: గొంతు నొప్పి నుండి జీర్ణ సమస్యలకు.. చెక్ పెట్టే అద్భుత ఔషధం ‘అల్లం మురబ్బా’ ఇంట్లోనే చేసుకోండి ఇలా..
-
8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, యాక్టివ్ కూలింగ్తో గేమింగ్ మాన్స్టర్.. REDMAGIC 11S Pro రాక!
-
PM Modi: ఆడంబరాలు వద్దు.. పొదుపు ముద్దు.! దేశాభివృద్ధి కోసం ప్రధాని 10 కీలక సూచనలు..
-
Kathmandu: రన్వేపై మంటల్లో చిక్కుకున్న విమానం.. 278 మంది ప్రయాణికులు.?