Maharashtra Political Crisis: మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ గా రాహుల్ నర్వేకర్ ఎన్నిక
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం తుది అంకానికి చేరుకుంది. ఈ రోజు, రేపు మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ ఎన్నిక, ఏక్ నాథ్ షిండే బలపరీక్ష కోసం ప్రత్యేక సమావేశాలను నిర్వహిస్తోంది. ఆదివారం మహారాష్ట్ర అసెంబ్లీ కొత్త స్పీకర్ గా బీజేపీ ఎమ్మెల్యే రాహుల్ నర్వేకర్ ఎన్నికయ్యారు. గత ఏడాది కాలంగా ఖాళీగా ఉన్న మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ స్థానాన్ని బీజేపీ కైవసం చేసుకుంది. తాజాగా ఏర్పడిన ఏక్ నాథ్ షిండే అసెంబ్లీలో తన సత్తాను నిరూపించుకుంది.
మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ పదవి కోసం బీజేపీ ఎమ్మెల్యే రాహుల్ నర్వేకర్, శివసేన ఎమ్మెల్యే రాజన్ సాల్వీ పోటీపడగా నర్వేకర్ మెజారిటీ సాధించారు. స్పీకర్ గా ఎన్నికయ్యారు. మొత్తం 288 స్థానాలు ఉన్న మహారాష్ట్ర అసెంబ్లీలో నర్వేకర్ 164 ఓట్లు రాగా.. వ్యతిరేకంగా 107 ఓట్లు వచ్చాయి. స్పీకర్ ఎన్నికకు సమాజ్ వాదీ(ఎస్పీ) పార్టీ దూరంగా ఉంది. ఆ పార్టీ ఇద్దరు ఎమ్మెల్యేలు అబూ అజ్మీ , రయీస్ షేక్ ఓటింగ్ లో పాల్గొనలేదు. ఇదే విధంగా ఎంఐఎం ఎమ్మెల్యేలు కూడా గైర్హాజరు అయ్యారు.
Also Read
- Karnataka: కేరళం పంచాయితీ ముగియకుండానే కర్ణాటకలో రేగిన వర్గపోరు.. వెలసిన డీకే.శివకుమార్ కటౌట్లు
- Amul milk: సామాన్యుడి జేబుకు 'అముల్' చిల్లు.. రేపటి నుంచే పాలకు కొత్త రేట్లు! ఎంత ధర పెరిగాయంటే..
- Keralam: కేరళం సీఎం ఎంపికపై తర్జనభర్జన.. నిర్ణయం రేపటికి వాయిదా
- AIADMK: ముదిరిన అన్నాడీఎంకే సంక్షోభం.. విజయ్కు మద్దతు ఇచ్చిన నేతలపై వేటు..
Read Also: Konda Vishweshwar Reddy: నేడు బీజేపీలోకి చేవెళ్ల మాజీ ఎంపీ
అయితే స్పీకర్ ఎన్నిక సమయంలో మహారాష్ట్ర అసెంబ్లీలో కొత్త నాటకీయత చోటుచేసుకుంది. ఎన్నిక కోసం సభ్యుల లెక్కింపు సమయంలో ఈడీ..ఈడీ అంటూ ప్రతిపక్ష ఎమ్మెల్యేలు నినాదాలు చేశారు. తాజాగా స్పీకర్ ఎన్నిక సమయంలో బీజేపీ, ఏక్ నాథ్ షిండే వర్గం స్పష్టమైన మెజారిటీని చూపింది. దీంతో రేపు జరగబోయే బలపరీక్షలో కూడా మెజారిటీ మార్క్ 144ను సీఎం ఏక్ నాథ్ షిండే ఖచ్చితంగా అధిగమించనున్నారు. 160కి పైగా ఎమ్మెల్యేల మద్దతు షిండే, బీజేపీ ప్రభుత్వానికి ఉంది.
తాజావార్తలు
-
IPL 2026: RCB Vs KKR మ్యాచ్కు వర్షం గండం.. మ్యాచ్ రద్దయితే వీరికి పండగే.. RCB పరిస్థితి..?
-
Naga Vamsi: డిస్ట్రిబ్యూటర్లను చంపి ఎగ్జిబిటర్లను కాపాడటం సాధ్యమా?:
-
Karnataka: కేరళం పంచాయితీ ముగియకుండానే కర్ణాటకలో రేగిన వర్గపోరు.. వెలసిన డీకే.శివకుమార్ కటౌట్లు
-
CM Chandrababu Naidu: వర్క్ ఫ్రం హోంపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు..
-
Amul milk: సామాన్యుడి జేబుకు ‘అముల్’ చిల్లు.. రేపటి నుంచే పాలకు కొత్త రేట్లు! ఎంత ధర పెరిగాయంటే..
ట్రెండింగ్
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!