ఒకే తప్పు ఓ మంత్రికి రెండు నెలల జైలు శిక్ష విధించేలా చేసింది.. జైలు శిక్షతో పాటు జరిమానా కూడా కట్టాల్సిన పరిస్థితి.. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మహారాష్ట్ర మంత్రి బచ్చు కడూకి అమ్రావతి కోర్టు జైలు శిక్ష, రూ.25 వేల జరిమానా విధించింది. దాని కారణంలో ఎన్నికల అఫిడవిట్లో ఆస్తుల వివరాలను దాచడం.. ఈ కేసులో ఆయన దోషిగా తేలడమే.. 2014లో జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బచ్చు కడూ.. అచల్పూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు.. ఈ ఎన్నికల్లో విజయం సాధించిన ఆయన మంత్రి పదవి కూడా చేపట్టారు..
Read Also: IND vs WI: టీ20 సిరీస్కు ఆ ఇద్దరు దూరం..
అయితే, పోటీ చేసిన సమయంలో దాఖలు చేసిన అఫిడవిట్లో ముంబైలో తనకు ఉన్న ఫ్లాట్ వివరాలను నమోదు చేయలేదు.. దీనిపై బీజేపీ కౌన్సిలర్ గోపాల్ తిరమరే కోర్టును ఆశ్రయించారు.. ఇక, ఎప్పటి నుంచో విచారణ జరుగుతుండగా.. ఇవాళ విచారణ ముగిచింది కోర్టు.. ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం పాఠశాల విద్యాశాఖ సహాయ మంత్రిగా ఉన్న బచ్చు కడూను దోషిగా తేలుస్తూ.. రెండు నెలల జైలు శిక్ష, రూ.25 వేల జరిమానా విధించింది. అయితే, దీనిపై పై కోర్టుకు వెళ్లేందుకు సమయం ఇవ్వాలని, బెయిల్ మంజూరు చేయాలంటూ బచ్చు కడూ పిటిషన్ దాఖలు చేయగా.. సానుకూలంగా స్పందించిన కోర్టు.. పై కోర్టులో అప్పీల్కు నెల రోజు సమయం ఇవ్వడంతో పాటు బెయిల్ మంజూరు చేసింది..