Selfie With Elephant: ఏనుగుతో సెల్ఫీ ప్రయత్నం.. వ్యక్తిని తొక్కి చంపేసింది..

  • ఏనుగుతో సెల్ఫీ తీసుకునే యత్నం..
  • అత్యుత్సాహం ప్రాణాలు తీసింది..
  • ఏనుగు దాడిలో యువకుడి మృతి..
  • మహారాష్ట్రలో ఘటన..
Selfie With Elephant

Selfie With Elephant

Selfie With Elephant: ఒక యువకుడి అత్యుత్సాహం అతడి ప్రాణాలను తీసింది. మహారాష్ట్రలో గడ్చిరోలి జిల్లాలో 23 ఏళ్ల వ్యక్తి ఏనుగుతో సెల్పీ తీసుకునేందుకు ప్రయత్నించి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన గడ్చిరోలి జిల్లా అటవీ ప్రాంతంలో గురువారం చోటు చేసుకుంది. చంద్రాపూర్ జిల్లాలోని నవేగావ్‌కి చెందిన శశికాంత్ రాంచంద్ర సాత్రే అనే వ్యక్తి ఫారెస్ట్ డివిజన్‌లో కేబుల్స్ వేసే పనికోసం సహోద్యోగులతో కలిసి గడ్చిరోలి వెళ్లాడు.

Read Also: MP News: రూ. 50వేలు ఇచ్చి.. కుమారుడిని హత్య చేయించిన తండ్రి..

అక్టోబర్ 23న చత్‌గావ్-గడ్చిరోలి అటవీ ప్రాంతానికి చెందిన అడవి ఏనుగు కుంఘడ రాయ్ ప్రాంతంలోకి ప్రవేశించింది. సమీపంలో ఏనుగు సంచరిస్తుందనే హెచ్చరికలు ఉన్నప్పటికీ.. శశికాంత్‌తో సహా మరో ఇద్దరు గురువారం ఏనుగును గుర్తించడానికి వెళ్లారు. శశికాంత్ దూరం నుంచి సెల్ఫీ దిగేందుకు ప్రయత్నిస్తుండగా ఏనుగు దూసుకువచ్చి, తొక్కి చంపేసింది. మరొ ఇద్దరు సురక్షితంగా ప్రమాదం నుంచి బయటపడ్డారు.