Maharashtra: మోడీ పిలుపు.. ఫడ్నవిస్ అమలు.. ఇకపై ఈ-వాహనాలే వినియోగించాలని ఆదేశాలు
- మోడీ పిలుపు.. ఫడ్నవిస్ అమలు
- మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం
- ఇకపై ప్రభుత్వ పనులకు ఈ-వాహనాలే వినియోగించాలని ఆదేశాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పశ్చిమాసియా యుద్ధం కారణంగా తలెత్తిన అనేక రకాలైన సంక్షోభాల నుంచి తేరుకునేందుకు పొదుపు పాటించాలని హైదరాబాద్ వేదికగా ఆదివారం ప్రధాని మోడీ దేశ పౌరులకు పిలుపునిచ్చారు. పౌరులు, రాష్ట్ర ప్రభుత్వాలు డబ్బు ఆదా చేయాలని విజ్ఞప్తి చేశారు. పెట్రోల్, డీజిల్ను పొదుపుగా వాడాలని, ప్రజా రవాణా, మెట్రో, కార్పూలింగ్, ఎలక్ట్రిక్ వాహనాలకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు.
ప్రధాని మోడీ పిలుపు మేరకు రాష్ట్ర ప్రభుత్వాలు ఆ దిశగా అడుగులు వేస్తున్నాయి. మొట్టమొదటిగా మహారాష్ట్ర ప్రభుత్వం తొలి అడుగు వేసింది. ప్రభుత్వ పనులకు ఇకపై ఈ-వాహనాలను మాత్రమే వినియోగించాలని మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా అన్ని శాఖాపరమైన సమావేశాలను ఆన్లైన్లో నిర్వహించాలని దేవేంద్ర ఫడ్నవిస్ ప్రభుత్వం నిర్ణయించింది.
Also Read
- LRLACM: భారత స్వదేశీ ‘‘తోమహాక్’’.. పాక్, చైనాలకు ముచ్చెమటలు గ్యారెంటీ..
- Mansukh Kaka: శభాష్ తాతా అనాలా? లేక విధి రాతను నిందించాలా?.. 82 ఏళ్ల వయసులో రోడ్డుపై కన్నీటి కష్టం!
- Uddhav Thackeray: మరోసారి ముక్కలు కాబోతున్న శివసేన పార్టీ? కుప్పకూలుతున్న ఉద్ధవ్ సామ్రాజ్యం!
- Sanchita Ugale: మరాఠీ నటి సంచితా ఉగలే మృతికి కారణమిదేనా? ఇంత జరిగిందా?
మే 12 నుంచి ఫ్రాన్స్ వేదికగా జరిగే కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్కు ప్రభుత్వ అధికారులు హాజరుకాకూడదని నిర్ణయం తీసుకుంది. విదేశీ పర్యటనలకు దూరంగా ఉండాలని సూచించింది. మంగళవారం నుంచి అన్ని సమావేశాలను ఆన్లైన్లోనే నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిందని ఐటీ, సాంస్కృతిక శాఖ మంత్రి ఆశిష్ షెలార్ తెలిపారు.
ఆదివారం హైదరాబాద్ వేదికగా జరిగిన సభలో మోడీ పౌరులకు కీలక పిలుపునిచ్చారు. ఇంధనం, విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేసేందుకు పెట్రోల్, డీజిల్ వాడకాన్ని తగ్గించుకోవాలని, ప్రజా రవాణాను, కార్ పూలింగ్ను ఉపయోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. వర్క్ ఫ్రమ్ హోం, ఆన్లైన్ మీటింగ్స్ పెట్టుకోవాలని, ఎలక్ట్రిక్ వాహనాలను ఉపయోగించుకోవాలని, కార్ల వినియోగం తగ్గించుకుని మెట్రో వంటి పబ్లిక్ రవాణా వ్యవస్థల్ని వాడుకోవాలని సూచించారు.
ఇంధనాన్ని ఆదా చేసేందుకు ఇంటి నుంచే పని చేయడం, వర్చువల్ సమావేశాలను ప్రోత్సహించాలని ప్రజలను ప్రధాని కోరారు. అలాగే కనీసం ఏడాది పాటు అనవసర విదేశీ ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని.. అంతేకాకుండా ఏడాది పాటు పెళ్లిళ్లు, ఇతర వేడుకల కోసం కొత్త బంగారు ఆభరణాలు కొనకుండా ఉండాలని కోరారు. మొత్తానికి మోడీ పిలుపు మేరకు రాష్ట్ర ప్రభుత్వాలు, ఐటీ కంపెనీలు ఆ దిశగా అడుగులు వేస్తున్నాయి.
తాజావార్తలు
-
Thalliki Vandanam Scheme: ‘తల్లికి వందనం’పై గుడ్న్యూస్.. అధికారులకు మంత్రి లోకేష్ కీలక ఆదేశాలు
-
Soft Pulka Tips: పుల్కాలు గట్టిగా వస్తున్నాయా? ఈ 2 సీక్రెట్ టిప్స్ పాటిస్తే బంతిలా పొంగుతాయి!
-
YS Jagan: ప్రతి ఓటును కాపాడుకోవాలి.. వైసీపీ నేతలకు జగన్ దిశానిర్దేశం
-
Team India: కోట్ల ఐపీఎల్ కాంట్రాక్టులు.. కానీ ఇక్కడ గెలవకపోతే పరువు పాయే.. తేల్చుకోనున్న టీమిండియా..
-
Trump: హార్ముజ్ శాశ్వతంగా టోల్ ఫ్రీగా ఉంటుంది.. జీ 7 సదస్సులో ట్రంప్ ప్రకటన
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Fight: భారత్-శ్రీలంక మ్యాచ్లో గొడవ.. వైభవ్ సూర్యవంశీ ఆగ్రహానికి అసలైన కారణం ఇదే!
-
Mrigashira నక్షత్రంలో పుట్టినవారు ఒక్కచోటు కుదురుగా ఉండరుగా.! అదృష్టం, స్వభావం, కెరీర్ అవకాశాలు ఎలా ఉంటాయంటే.?
-
Tilak Varma: నేను ఎవరికీ నీతులు చెప్పడానికి ఇక్కడ రాలేదు.. తిలక్ వర్మ సంచలన వ్యాఖ్యలు!
-
Vaibhav Sooryavanshi Fight: వైభవ్ సూర్యవంశీపై కఠిన చర్యలు తప్పవా?.. ఐసీసీ నిబంధనలు ఏం చెబుతున్నాయంటే?
-
Lucky Plants : మీ పుట్టిన తేదీ ప్రకారం ఇంట్లో ఏ మొక్క పెంచితే అదృష్టం కలిసొస్తుందో తెలుసా?