Maharashtra: మోడీ పిలుపు.. ఫడ్నవిస్ అమలు.. ఇకపై ఈ-వాహనాలే వినియోగించాలని ఆదేశాలు
- మోడీ పిలుపు.. ఫడ్నవిస్ అమలు
- మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం
- ఇకపై ప్రభుత్వ పనులకు ఈ-వాహనాలే వినియోగించాలని ఆదేశాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పశ్చిమాసియా యుద్ధం కారణంగా తలెత్తిన అనేక రకాలైన సంక్షోభాల నుంచి తేరుకునేందుకు పొదుపు పాటించాలని హైదరాబాద్ వేదికగా ఆదివారం ప్రధాని మోడీ దేశ పౌరులకు పిలుపునిచ్చారు. పౌరులు, రాష్ట్ర ప్రభుత్వాలు డబ్బు ఆదా చేయాలని విజ్ఞప్తి చేశారు. పెట్రోల్, డీజిల్ను పొదుపుగా వాడాలని, ప్రజా రవాణా, మెట్రో, కార్పూలింగ్, ఎలక్ట్రిక్ వాహనాలకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు.
ప్రధాని మోడీ పిలుపు మేరకు రాష్ట్ర ప్రభుత్వాలు ఆ దిశగా అడుగులు వేస్తున్నాయి. మొట్టమొదటిగా మహారాష్ట్ర ప్రభుత్వం తొలి అడుగు వేసింది. ప్రభుత్వ పనులకు ఇకపై ఈ-వాహనాలను మాత్రమే వినియోగించాలని మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా అన్ని శాఖాపరమైన సమావేశాలను ఆన్లైన్లో నిర్వహించాలని దేవేంద్ర ఫడ్నవిస్ ప్రభుత్వం నిర్ణయించింది.
Also Read
- Rahul Gandhi: ఆటో అవతారమెత్తిన రాహుల్ గాంధీ.. సమస్యలు పార్లమెంట్లో లేవనెత్తుతానని హామీ
- Siddaramaiah: డీకేకు చెక్ పెట్టాలని సిద్ధరామయ్య ప్లాన్.. హైకమాండ్ షాక్
- Congress: భారత్పై నెతన్యాహూ ప్రశంసలు.. మోడీపై కాంగ్రెస్ విమర్శలు..
- Trinamool Congress: ‘‘ముస్లింల కోసమే పనిచేసింది’’.. టీఎంసీ పార్టీ చీఫ్ రాజీనామా..
మే 12 నుంచి ఫ్రాన్స్ వేదికగా జరిగే కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్కు ప్రభుత్వ అధికారులు హాజరుకాకూడదని నిర్ణయం తీసుకుంది. విదేశీ పర్యటనలకు దూరంగా ఉండాలని సూచించింది. మంగళవారం నుంచి అన్ని సమావేశాలను ఆన్లైన్లోనే నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిందని ఐటీ, సాంస్కృతిక శాఖ మంత్రి ఆశిష్ షెలార్ తెలిపారు.
ఆదివారం హైదరాబాద్ వేదికగా జరిగిన సభలో మోడీ పౌరులకు కీలక పిలుపునిచ్చారు. ఇంధనం, విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేసేందుకు పెట్రోల్, డీజిల్ వాడకాన్ని తగ్గించుకోవాలని, ప్రజా రవాణాను, కార్ పూలింగ్ను ఉపయోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. వర్క్ ఫ్రమ్ హోం, ఆన్లైన్ మీటింగ్స్ పెట్టుకోవాలని, ఎలక్ట్రిక్ వాహనాలను ఉపయోగించుకోవాలని, కార్ల వినియోగం తగ్గించుకుని మెట్రో వంటి పబ్లిక్ రవాణా వ్యవస్థల్ని వాడుకోవాలని సూచించారు.
ఇంధనాన్ని ఆదా చేసేందుకు ఇంటి నుంచే పని చేయడం, వర్చువల్ సమావేశాలను ప్రోత్సహించాలని ప్రజలను ప్రధాని కోరారు. అలాగే కనీసం ఏడాది పాటు అనవసర విదేశీ ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని.. అంతేకాకుండా ఏడాది పాటు పెళ్లిళ్లు, ఇతర వేడుకల కోసం కొత్త బంగారు ఆభరణాలు కొనకుండా ఉండాలని కోరారు. మొత్తానికి మోడీ పిలుపు మేరకు రాష్ట్ర ప్రభుత్వాలు, ఐటీ కంపెనీలు ఆ దిశగా అడుగులు వేస్తున్నాయి.
తాజావార్తలు
-
IPL 2026: క్వాలిఫయర్-2లో రాజస్థాన్పై గుజరాత్ ఘనవిజయం.. ఫైనల్లో బెంగళూరుతో ఢీ.!
-
OTR : తెలంగాణలో పెరిగిపోతున్న ఫ్రంటల్ పైరవీలు!
-
Story Board: కర్ణాటకలో సీఎం మార్పునకు కారణాలేంటి..?
-
Rahul Gandhi: ఆటో అవతారమెత్తిన రాహుల్ గాంధీ.. సమస్యలు పార్లమెంట్లో లేవనెత్తుతానని హామీ
-
Honor Win Turbo: హానర్ విన్ టర్బో రిలీజ్.. 10,000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరా
ట్రెండింగ్
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..
-
షియోమీ నుంచి కొత్త గాడ్జెట్స్ వచ్చేశాయ్.. Xiaomi Watch S5, Smart Band 10 Pro, Buds 6 లాంచ్.!
-
120x AI అల్ట్రా జూమ్ కెమెరాలు, 144Hz AMOLED డిస్ప్లే, 8K వీడియో రికార్డింగ్ వంటి ప్రీమియం ఫీచర్లతో Xiaomi 17T, 17T Pro లాంచ్..